వైభవంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన వేడుకలు
నడికూడ నేటిధాత్రి:
శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన వేడుకలు నడికూడ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కడివెండి నరేందర్ చారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు.వీర బ్రహ్మేంద్రస్వామి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి, వేద పండితుల మంత్రోచ్ఛారాల నడుమ పూజలు చేశారు.అనంతరం స్వామి వారికి పాలకాయలు సమర్పించి,కర్పూర హారతి ఇచ్చి పూజలు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గ్రామకమిటీ అధ్యక్షుడు ఎలకంటి రాజు చారి, ఉపాధ్యక్షుడు బెజ్జంకి రాజేందర్ చారి,కార్యవర్గ సభ్యులు క్రిష్ణాది సాంబయ్య చారి, మసంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.