సరిహద్దు మహారాష్ట్ర లో పోలింగ్ ప్రశాంతం.

చీమూర్ పార్లమెంట్ పరిధిలోని సరిహద్దు గ్రామాల్లో బారులు తీరిన ఓటర్లు.

సరిహద్దు సిరివంచ తాలూకా లో పెద్ద మొత్తంలో పోలింగ్.

అడుగడుగునా పోలీస్ బందువస్తు మధ్య ప్రశాంతంగా ఓటింగ్.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

భారతదేశ పార్లమెంట్ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ భారత దేశంలోని రెండవ అతిపెద్ద పార్లమెంట్ స్థానాలు కలిగిన మహారాష్ట్ర రాష్ట్రంలో శుక్రవారం రోజు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. భారత దేశంలో 2024వ పార్లమెంట్ ఎన్నికలకు ఏడు దశల వారిగా ఎన్నికల నిర్వహణ లో భాగంగా మొదటి దశ ఎన్నికల నిర్వహణలో మహారాష్ట్ర రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. యావత్ మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి 48 పార్లమెంట్ స్థానాలు ఉండి భారత దేశంలోనే రెండవ అతిపెద్ద రాష్ట్రంలో నీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతంలోని చీమూర్ పార్లమెంట్ పరిధిలో ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల సందర్భంగా చీమూర్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుటకు కూలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వచ్చి తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది.

సరిహద్దు మహారాష్ట్ర లో పోలింగ్ ప్రశాంతం.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి మహారాష్ట్ర గడుచురల్లీ జిల్లా చీమూర్ పార్లమెంట్ పరిధిలోని గడుచురెల్లి చంద్రపూర్ గొందియా మూడు జిల్లాలకు కలుపుకొని చీమూర్ పార్లమెంట్ 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 35 శాతం మూడు జిల్లాలకు కలుపుకొని ఆదివాసి జనాభా సంఖ్య ఉండడంతో చీమూర్ పార్లమెంట్ స్థానానికి ఎస్టీ రిజర్వేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క పార్లమెంట్ స్థానం ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ ఒకసారి బిజెపి రెండు సార్లు చీమూరు స్థానం నుండి గెలుపొందారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలకు సంబంధించిన అశోక్ నేత తో పాటు డాక్టర్ నాందేవ్ కిషన్ లకు పార్టీలు తమ అభ్యర్థులుగా ఖరారు చేసి బరిలో పెట్టడం జరిగింది. ఇక శుక్రవారం భారత పార్లమెంట్ ఎన్నికల మొదటి దశలో మహారాష్ట్ర లోని చీమూర్ పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చీమూర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు నిర్భయంగా స్వచ్ఛందంగా తమ ఓటు వినియోగించుకునేలా పోలీస్ మరియు అధికార యంత్రాంగం ఒకవైపు ప్రజలకు ఓటు హక్కు వినియోగం పై అవగాహన కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛందంగా నిర్భయంగా ఓటు వేయుటకు పోలీస్ యంత్రాంగం తో పాటు మంచినీరు ఇతర ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలను కూలింగ్ సెంటర్ ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. చీమూర్ పార్లమెంట్ పరిధిలోని మూడు జిల్లాలకు సంబంధించి ఓటర్ మహాశీయులు ప్రశాంతంగా తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది.

చీమూర్ పార్లమెంట్ పరిధిలోని సరిహద్దు గ్రామాల్లో బారులు తీరిన ఓటర్లు.

చీమూర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగింది, చీమూరు పార్లమెంట్ పరిధిలోని గడుచురెల్లి జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో గడుచురెల్లి జిల్లాకు తెలంగాణతో పాటు చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దులు కలిగి ఉండడం గత వారం రోజుల క్రింది మహారాష్ట్ర రాష్ట్రంలోని చీమూర్ పార్లమెంట్ పరిధిలోని గడుచురల్లీ జిల్లాలో పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్ సంఘటన చేసుకోవడంతో పోలీసులు మరింత నిఘా వ్యవస్థను పకడ్బందీగా చేస్తూ పార్లమెంట్ ఎన్నికల దృశ్య పోలింగ్ కేంద్రాలకు అలాగే ప్రతి గ్రామాల్లో ఓటర్లను నిర్భయంగా తమ ఓటును వినియోగించుకునేలా మావోయిస్టుల నుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మరింత భద్రతను కట్టుదిట్టం చేస్తూ గడిచూరిలీ జిల్లా వ్యాప్తంగా పోలీసులు సరిహద్దు ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం ప్రశాంతంగా ప్రజలకు ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు బలగాలను సమకూర్చడం జరిగింది. గడ్చిరోలి జిల్లాలోని ఓటర్ మహాశయులు పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు పెద్ద మొత్తంలో చీరి తమ ఓటును వినియోగించుకున్నారు.

సరిహద్దు సిరివంచ తాలూకా లో పెద్ద మొత్తంలో పోలింగ్.

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి ఆదుకొని ఉన్న మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన చీమూర్ పార్లమెంట్ పరిధిలోని సిరివంచ తాలూకా గడుచురెల్లి జిల్లా లో 55710 ఓటర్లు నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. అహిరి నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి గ్రామాల్లో భారీ బందోబస్తుల మధ్య చీమూర్ పార్లమెంట్ మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి కావడం జరిగింది. సిరివంచ తాలూకాకు సంబంధించి గోదావరి సరిహద్దుకు ఆనుకొని ఉన్న అనేక గ్రామాలు అలాగే ప్రత్యేకంగా అహరి ఆలపిల్లి సిరివంచ తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు పెద్ద మొత్తంలో శ్రద్ధ చూపడం గత 2019 ఎన్నికల్లో చీమూరు పార్లమెంట్ పరిధిలో 75% పోలింగ్ కావడం జరిగింది. నిన్న జరిగినటువంటి పోలింగ్ గత ఎన్నికల కంటే మరింత పర్సంటేజ్ పెరిగే విధంగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడం జరిగిందని పార్లమెంట్ పరిధిలోని ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. పట్టణాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా చీమూరు పార్లమెంట్ పరిధిలోని అనేక గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకొనుటకు ఓటర్ మహాశయులు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో వచ్చి తమ ఓటును వినియోగించుకోవడం తో ఓటర్లతో పాటు ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేయక తప్పడం లేదు. అనేక గ్రామాల్లో పట్టణాల్లో 2024 సీమూర్ పార్లమెంట్ ఎన్నికలకు యువ ఓటర్ల సంఖ్య పెరగడంతో ఓటు యొక్క ప్రాముఖ్యత ప్రజల్లో కలగడం జరిగిందని అనుకుంటున్నారు.

అడుగడుగునా పోలీస్ బందువస్తు మధ్య ప్రశాంతంగా ఓటింగ్.

చీమూరు పార్లమెంట్ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి శుక్రవారం జరిగిన పార్లమెంట్ ఓటింగ్ పై ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఒకవైపు అధికారులు చీమూరు పరిధిలోని 428 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో సుమారు 206 పోలింగ్ కేంద్రాలు బాబు ప్రభావిత ప్రాంతాల్లో కలిగి ఉండడం పై అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా సుమారు 15 వేల పోలీసు బలగాలను చీమూరు పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసింది అలాగే 130 డ్రోన్ కేంద్రాలతో పోలింగ్ కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాలు ప్రత్యేకంగా ఆరు ఆర్మీ హెలికాప్టర్లు ప్రత్యేక నిఘా కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ యంత్రాంగం చీమూర్ పార్లమెంట్ పరిధిలోని గడిచి రెల్లి జిల్లా లో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు అధికారులతో పాటు ప్రత్యేక పోలీస్ బలగాల పర్యవేక్షణలో పట్టణాలు గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటును వినియోగించుకునేలా కట్టుదిడ్డమైన భద్రతతో చీమూర్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా కొనసాగించేలా చేసింది. గడిచిరెల్లి జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్డిపిఓ సిరివంచ ఏ ఎస్ పి తోపాటు జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ లతోపాటు ప్రత్యేక పోలీస్ బటానియన్లు ఓటింగ్ ప్రశాంతం గా కొనసాగుటకు కీలక పాత్ర పోషించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!