అప్రమత్తంగా ఉండాలని ప్లాంట్ యాజమాన్యం వెల్లడి
జైపూర్ నేటి ధాత్రి:
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసులతో పాటు సింగరేణి యాజమాన్యం సూచనల మేరకు జైపూర్ ఎస్టిపిపి ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం వెల్లడించారు.ప్లాంట్ లో సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నత అధికారులతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్లాంట్ ఉద్యోగులంతా పరిస్థితులకు తగిన విధంగా తగిన జాగ్రత్త వహించాలని వివిధ అంశాలను పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిఎం కే. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఐడి కార్డు వెంట ఉంచుకోవాలన్నారు.అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లరాదని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి ఏవైనా వస్తువులు గాని,పార్సిల్స్ గానీ వస్తే తీసుకోరాదని కోరారు.అందరూ విధిగా. ఈ ఆదేశాలను పాటించాలని, అప్రమత్తంగా మెదలాలని తెలిపారు.అలాగే నివాస ప్రాంతాల్లో గాని,ప్లాంట్ పరిసరాల్లో గాని అనుమానితులు కనిపిస్తే వెంటనే సిఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్.8332974224 కీ సమాచారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ (ఓ&ఎం) జే.ఎన్.సింగ్,ఏజీఎం (ఈ అండ్ ఎం) మదన్మోహన్,సిఐఎస్ఎఫ్ కమాండెంట్ చంచల్ సర్కార్,పీఎంపిఎల్ ప్లాంట్ హెడ్ అఖిల్ కపూర్,పీఈఎస్ ప్లాంట్ హెడ్ రమేష్ చంద్ర ,డీజీఎం (సివిల్) శ్రీ అజాజుల్లా ఖాన్,డిజీఏం పర్సనల్ శ్రీ అజ్మీరా తుకారాం, ఎస్ అండ్ పిసి ఇన్స్పెక్టర్ ఎం. సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.