
Petition submitted for granting support pensions to handloom workers
*చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు మంజూరు చేయా లని వినతిపత్రం అందజేత*
*పద్మశాలీలందరూ ఒక రూపాయి చెల్లించి ప్రమాద బీమా పొందాలి*
*అఖిలభారత పద్మశాలి సంఘ మండల అధ్యక్షుడు వంగరి సాంబయ్య*
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం కార్మికులకు అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని ఎంపీ డివో కు వినతిపత్రం అంద జేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని చేనేత కార్మికు లకు 50 సంవత్సరాలు నిండిన అర్హులైన పద్మశాలిలందరికీ జియో టాక్ షో సంబంధం లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వాలని, రాష్ట్రంలోనీ చేనేత కార్మికులు గతంలో 1500 మంది ఆత్మహత్య చేసుకు న్నారు ఇప్పటికీ ఆసరా పింఛన్లు కొనసాగలేదని నేటికీ పని ఉపాధి లేక అనేక ఇబ్బం దులు పడుతున్నారని రాష్ట్రం లో గత అనేక సంవత్సరాల నుండి నేటికీ చేనేత కార్మికులు చనిపోతే వారి స్థానంలో వారి భార్యలకు పింఛన్లు మంజూరు చేయాలని, రెక్కాడితే గాని డొక్కాడని పేదవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని పద్మశాలి లందరూ ఒక రూపాయి సభ్యత్వ నమోదు తీసుకొని ప్రమాద బీమా పొందగలరు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దిడ్డి రమేష్, చిందం రవి, బాసని శాంత, ప్రభాకర్, చంద్రమౌళి, వనం దేవరాజు ,రమేష్, రాజశేఖర్ ,బాలకృష్ణ, మల్లి కార్జున్, అన్ని గ్రామాల అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు ,కార్యకర్తలు, ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.