
`పద్నాలుగేళ్లు తెలంగాణ కోసం కొట్లడిన వీరులను నిందిస్తావా!
`పచ్చ పత్రికలో ‘‘పుచ్చు ప్రేలాపణలు’’!
`తెలంగాణ పాలిట ‘‘చెత్తపలుకుల అర్థపిశాచి’’.
`మీడియా ముసుగులో ‘‘నిశాచర సంచారి’’.
`మరుగుజ్జంటే అర్థం తెలియని ‘‘అజ్ఞాని’’!
“అక్షర జ్ఞానం లేని ‘‘నిరక్షరకుక్షి’’.
`తెలంగాణకు ఆనాడు అడుగడుగునా అడ్డుపడిన ‘‘శిఖండి’’.
`అనుక్షణం తెలంగాణ అన్యాయం చేయాలని చూసిన ‘‘విషజీవి’’.
`కులపిచ్చితో తెలంగాణకు పట్టిన ‘‘గ్రహణ నిశీది’’.
`తెలంగాణ వాదులు మరుగుజ్జు నాయకులా?
`తెలంగాణ నాయకులకు అలాంటి పదం ఆపాదిస్తావా!
`ఉద్యమ కాలంలో తెలంగాణకు అనుకూలంగా వార్తలు రాశావా!
`సమైక్య వాదం నింపుకుని తెలంగాణను అడ్డుకోలేదా!
`శ్రీకృష్ణ కమిటీ సూచనల్లో నీ పత్రిక వుందా?
`తెలంగాణ అనుకూలంగా వార్తలు రాస్తే ఎందుకు దాడులు చేశారు!
`తెలంగాణ మేలు కోరిన వాళ్లను నెత్తిన పెట్డుకున్నారు.
…………………………
`కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజులకే రైతు ఆత్మహత్య బ్యానర్ వార్త పెట్డిందెవరు?
`మూడు రోజులకే కేసిఆర్ ప్రభుత్వంలో తొలి రైతు ఆత్మహత్య అన్నదెవరు?
`ట్యాంక్ బండ్ మీద రైతు ఉరి వార్తను వేసిందెవరు?
`తెలంగాణ ఎమ్మెల్యేలను కళ్లు తాగిన కోతులన్నది ఎవరు?
`ప్రమాణ స్వీకారం చేయరాలేదని ఎమ్మెల్యేలను దద్దమ్మలని కూసిందెవరు?
`టూరింగ్ టాకీస్లో సినిమా చూసే వాళ్లకు మల్టీ ప్లెక్స్లో కూర్చున్నట్లుందని ఎగతాళి చేసిందెవరు!
…………….
`పనిలో పనిగా సిఎం రేవంత్ రెడ్డి మీద కూడా వాక్భాణాలు సంధిస్తున్నాడు.
`తెలుగు దేశం వల్లనే గత ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిందంటున్నాడు.
` రేవంత్ రెడ్డి కష్టం బూడిదలో పోసిన పన్నీర్అయినట్లు పిచ్చి రాతలు రాస్తున్నాడు.
హైదరాబాద్,నేటిధాత్రి:
రోత గాడు పెండ రాతలు రాస్తే పెంట పెంట అవుతుందంటే ఇదే..మరి! పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే కూడా ఇలాంటిదే!! నీ జోలికి రాకున్నా, నన్ను తన్నరా..తన్నారా! అని పిలుచుకోవడమంటే కూడా ఇలాగే వుంటుంది. ఎంత తన్నుమన్నా ఎవరూ తన్నడం లేదనుకొని వెలికి వార్తలు రాసి తెలంగాణ సమాజం మొత్తంతో ఉమ్మించుకోవడమంటే ఇలాగాదే జరగుతుంది. ఇప్పటి వరకు బురద జల్లి కుడుక్కోండని రోత రాతులు రాసుకునే బూతుగాడు తొలిసారి తన మీదే రోత చల్లించుకున్నాడు. డ్రైనేజీ నిండా మునిగిపోయాడు. సెప్టిక్ ట్యాంక్లో దూకినంత పని చేసుకున్నాడు. ఇదీ తెలంగాణ సమాజం అని మరోసారి రుచి చూశాడు. తెలంగాణ వచ్చి పదేళ్లయింది. ఇంకా ఆ సెంటి మెంటు లేదు. కేసిఆర్ మీద ప్రజల్లో అభిమానం లేదు. బిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదు. ముఖ్యంగా నిత్యం మీడియాను ఫాలో అయ్యేవారు కేసిఆర్ను తిడితే సంతోషపడతారనుకున్నాడు. కాని అటు తిరిగి ఇటు తిగిగి బూతుగానికే గుచ్చుకుంటుందని ఊహించలేదు. ఒక్కసారిగా తెలంగాణ సమాజమంతా కదలడంతో ఉలిక్కిపడ్డాడు. చెరపకురా? చెడేవు అనే సామెత తెలిసినా, తెలిసి తెలిసి బిఆర్ఎస్ను కెలికినా పరిస్దితి ఇలాగే వుంటుందని మరోసారి అనుభవానికి వచ్చాడు. ఇప్పుడే కాదు..ఇంకా వందేళ్లయినా, వెయ్యేళ్లయినా తెలంగాణ సమాజంలోనే కాదు, జనం గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి కేసిఆర్. కేసిఆర్కు బూతుగాడు స్నేహితుడే కావొచ్చు.సన్నిహితుడేకావొచ్చు. అయినంత మాత్రాన కారు కూతలు కూస్తే జనం సహించరని ఇప్పటికైనా తెలుసుకోవాలి. తెలంగాణ పాలిట ఎప్పటికైనా రోతగాడు పిశాచే అని చెప్పకతప్పదు. తెలంగాణలో వుంటూ తెలంగాణపై విషం కక్కె విషపురుగు. పాలుకు పాలు పోసి పెంచినా సరే కాటేయక మానదు. రోత గాడు కూడా అంతే..నిజం చెప్పాలంటే మీడియా ముసుగులో తెలంగాణలో నిశాచర సంచారి. తెలంగాణ ఉద్యమ కారుడైన పోరాటయోధుడు సూర్యపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని మరుగుజ్జు అనడానికి రోతగానికి ఇంత పైత్యమా? అసలు మరురుజ్జు అంటే ఆ వెదవకు అర్దం తెలుసా? తెలంగాణ నాయకులందరూ మరగుజ్జు నాయకుల్లా కనిపిస్తున్నారా? తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా ఇలాంటి పత్రికలో చిల్లర రాతలు రాశాడు. చానల్లో రోత పలుకులు పలికించాడు. ముఖ్యమంత్రిగా కేసిఆర్ బాధ్యతలు చేపట్టిన సరిగ్గా మూడు రోజులకు ట్యాంక్ బండ్పై ఓ వ్యక్తి ఉరివేసుకొని చనిపోయాడు. దానికి తెలంగాణలో తొలి రైతు ఆత్మహత్య అని బ్యానర్ వార్త ప్రచురించాడు. అంటే మూడు రోజుల్లోనే తెలంగాణ విఫల రాష్ట్రం.. కేసిఆర్ విఫల సిఎం, అని చెప్పాలనుకున్నాడు. తెలంగాణలో ఇక ఏదో జరిగిపోతుందని భయపెట్టే ప్రయత్నంచేశాడు. నిజం చెప్పాలంటే కేసిఆర్ కాబట్టి అలాంటి తట్టుకున్నారు. ఆ స్ధానంలో మరే నాయకుడు వున్నా, ఆగం చేసేవారు. ఇక ఇటు ఆ చెత్త ఛానల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారలపై అతి జుగుస్సాకంగా ప్రసారం చేశారు. కొత్తగా ఎన్నికైనా తెలంగాణ ఉద్యమకారులైన ఎమ్మెల్యేలకు ప్రమాణస్వీకారలు చేయరాలేదని మెరిగారు. కళ్లు తాగిన కోతులు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. పైగా టూరింగ్ టాకీస్లో సినిమా చూసే వారిని తీసుకొచ్చి, మల్టీపెక్స్లో సినిమా చూపిస్తే ఎలా వుంటుందో అలా వుందని తెలంగాణ అసెంబ్లీని కించపర్చారు. ఇదీ రోతగాని మీడియా దుర్భుద్ది. అక్షర జ్ఞానం లేని నరక్షరకుక్షి వాడు. వాడి నుంచి ఇలాంటి వార్తలు తప్ప మంచి వార్తలు వస్తాయని కూడా ఎదరుచూడడం తప్పే అవుతుంది. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన మీడియా శిఖండి వాడు. అనుక్షణం తెలంగాణకు అన్యాయం చేయాలని చూసి విష జీవి. కుల పచ్చితో తెలంగాణకు పట్టిన అమావాస్య గ్రహణ నిశీది వాడు. తెలంగాణా నాయకులకు బలుపులున్నాయా? మరుగుజ్జులంటావా? చెప్పుకోవడానికి సిగ్గులేని వార్తలు రాసుకోవడంలో వాడిని మించిన వారు మరొకరలు లేరు. తెలంగాణ ఉద్యమానికి సహాకారం అందించానని సిగ్గులేని నిస్సిగ్గు గుణం తనదని మరోసారి నిరూపించుకున్నాడు. ఓ వైపు తెలంగాణ ఉద్యమానికి సహకరించానని ఓ వైపు చెబుతూనే, మరోపక్క ఉద్యమ కారులు పత్రిక కార్యాలయంపై దాడి చేశారని రోతగాడే చెప్పాడు. ఇందులో ఏది నిజం. తెలంగాణ ఉద్యమానికి సహకరిస్తే తెలంగాణ వాదులు నెత్తిన పెట్టుకొని ఊరేగేవారు. ఇప్పుడు ఎన్ని రాతలు రాసినా మెచ్చుకునేవారు. అంతే కాకుండా శ్రీ కృష్ణ కమిటీ రోతగాని పత్రిక మూసేస్తే తెలంగాణ ఉద్యమాన్ని కట్టడి చేయొచ్చని చెప్పిందని లేని పచ్చి అబద్దం చెప్పేశాడు. పైగా తన చెత్తపలుకులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కారణం తెలుగుదేశం అంటూ కొత్త లెక్కలు చెప్పి సిఎం. రేవంత్ రెడ్డిని కూడ బెదిరించే ప్రయత్నం చేశాడు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం రోతగాడు ఏదైనా చేస్తాడు! ఏదైనా రాస్తాడు. ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చింది సిఎం.రేవంత్రెడ్డి. మూడేళ్లుగా పిసిసి అధ్యక్షుడిగా నిత్యం ఎంతో శ్రమకోర్చి పార్టీని బలోపేతం చేసింది రేవంత్రెడ్డి. తెలంగాణ మొత్తం తిరిగి ప్రజలను ఒప్పించి, మెప్పింది కాంగ్రెస్ను అదికారంలోకి తెచ్చింది రేవంత్రెడ్డి. కాంగ్రెస్ గెలవడానికి, రేవంత్ రెడ్డి సిఎం. కావడానికి తెలుగుదేశం పార్టీ కారణమని రేవంత్ పరువు తీశాడు. రేవంత్ రెడ్డి గొప్పదనం కాదన్న అర్దమొచ్చేలా చెత్త పలుకు రాశాడు. సరిగ్గా వారం రోజుల క్రితం సిఎం. రేవంత్ రెడ్డి ఇతర మంత్రులను పట్టించుకోవడం లేదనే అర్దమొచ్చేలా పలుకులు పలికాడు. సిఎం. రేవంత్రెడ్డికి మంత్రులకు దూరం పెరుగుతోందని అర్ధం వచ్చేలా కూతలు కూశాడు. కాని వాటిని కాంగ్రెస్ నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ వారం ఏకంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అసలైన గెలుపు కాదన్న రీతిలో పలుకులను ఆరబెట్టాడు. ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అని చెప్పుకొచ్చాడు. అంటే సిఎం. రేవంత్ రెడ్డి కష్టం, మంత్రి పొంగులేటి శ్రమకు పెద్దగా ప్రాదాన్యత లేదని తేల్చేశాడు. పైగా హైదరాబాద్ చుట్టూ వున్న అన్ని నియోజకవర్గాలలో సీమాంద్రులతోపాటు, తెలుగుదేశం కార్యకర్తల సాయంతోనే కాంగ్రెస్ గెలవడానికి కారమైందన్నాడు. ఇక్కడే రోతగాడు డ్రైనేజీలో మరోసారి కాలు వేశాడు. అదే నిజమైతే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చుట్టూ వున్నా 37 నియోజకవర్గాలు గెల్చుకోవాలి. కేవలం రంగారెడ్డిలో తప్ప హైదరాబాద్లో కాంగ్రెస్ సీటు గెల్చుకోలేదని మర్చిపోయాడు. పైగా ఖమ్మంలో ఆది నుంచి కాంగ్రెస్కు మంచి పట్టుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మూడు ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ ఒక్క సీటు మాత్రమే గెల్చుకున్నది. ఈ సంగతి మరుగున పడేసేలా కాంగ్రెస్ గెలుపుకు తెలుగుదేశం కారణమన్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో కూటమి తెలంగాణకు వస్తే కాంగ్రెస్పార్టీకి ఇబ్బందే అన్నారు. అంటే సిఎం.రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పకనే చెప్పేశాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు చూడనట్లున్నారు. చెత్తపలుకులు విననట్టున్నారు. వింటే వాళ్లుకూడా ఈ రోజు రోతగానికి బుద్దిచెప్పేవారు. ఏపి సిఎం చంద్రబాబు కోసం ఏదైనా రాస్తాడు. ఎంతటి వారిపైనైనా నిందలు వేస్తాడు. గతంలో బిజేపి నాయకులను, ముఖ్యంగా ప్రధాని మోడీనిపై కూడ రోతగాడు పిచ్చికూతులు కూశాడు. వాళ్లుకూడా ఏమీ అనలేదు. ఈ బలుపే ఇప్పుడు చూపిస్తామంటూ పలుకులు పలిగి జీడి కారే పరిస్దితి వచ్చేలా చేసుకుంటున్నాడు. గత ఐదేళ్లు ఏపిలో మాజీ సిఎం. జగన్ మీద ఏది రాసినా ఆయన పట్టించుకోలేదు. ఇక్కడ బిఆర్ఎస్ ప్రతిపక్షంలో వుంది. ఇప్పుడు వాళ్లు చేసేదేముందని అనుకుంటున్నట్లున్నాడు. ఓ స్లాటర్ మీడియాకు బద్దలు బాషింగాలైన తర్వాత కూడా తన రోతలు రాసే ప్రయత్నం రోతగాడు మానుకోలేదు. తెలంగాణ మీద విషం కక్కడం మానుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎదరుతిరగలేదు. ఇకపై కూడా అంత దమ్ము ఎవరికి వుందన్న భ్రమలో రోతగాడున్నాడు. ఇంకోసారి ఇలాంటి పుచ్చు రాతలు, పచ్చ గీతలు గీస్తే పలుకులకు పెంకులు పగిలిపోయేలా చేస్తే తప్ప మానుకోడు.