చెన్నూరులో బి ఆర్ ఎస్ సభకు వేళల్లో వచ్చిన జనం

జైపూర్ ,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ నుండి మూడు బస్సుల చొప్పున సుమారుగ మండలంలో 100 బస్సులలో శనివారం నాడు మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బి అరవిందరావు జిల్లా నాయకులు రిక్కుల మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు నాయకులు, ప్రజాప్రతినిధులు చెన్నూరులో తలపెట్టిన హరీష్ రావు సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వం


ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుందని 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఈ ఐదు ఏళ్లలో జరిగాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ప్రజలకు తెలియజేశారు. బంగారు తెలంగాణ కావాలి అంటే ఇక్కడ సుమన్ అక్కడ రాష్ట్రంలో బి బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని వారు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!