# ఏబిఎస్ఎఫ్ అధ్వర్యంలో కార్మికుల నిరసన
నల్లబెల్లి,నేటిధాత్రి :
మధ్యాహ్న భోజనం వండిస్తున్న కార్మికుల వేతనాలు, పెండింగ్ ఉన్న బోజన బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై కార్మికులు వర్షంలో నిరసన తెలిపారు.ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ నల్లబెల్లి మండలంలోని 32 ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలతో పాటు గత సంవత్సరం ఆగస్టు నుండి నేటి వరకు బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికుల గౌరవ వేతనం పెంచిన ప్రభుత్వం బిల్లులు కూడా ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం కార్మికులు సమ్మక్క సుజాత రజిత ఎండి అషం రామ పూల నిర్మల తదితరులు పాల్గొన్నారు.