సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన పెండెం రామానంద్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణానికి చెందిన వడ్లకొండ సాంబయ్య ఇటీవల అనారోగ్య కారణాలతో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం పొందాడు.కాగా అందుకు ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం పథకం కింద స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో దరఖాస్తు చేసుకోగా లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం ఆ వార్డు ఇంచార్జ్ కొంకిస అరుణ గౌడ్ చేతుల మీదుగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అందజేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మాజీ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్, మాజీ వార్డు సభ్యులు కొయ్యడి సంపత్ గౌడ్,గండి గిరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
