Peaceful Municipal Polls in Medchal District
ప్రశాంతంగా మున్సిపాలిటీ ఎన్నికలు
* ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మూడు మున్సిపాలిటీలోని రెండు చోట్ల మినహా ఇతర అన్నిచోట్ల పోలింగ్ సక్రమంగా జరిగింది. మొదట మందకోడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పొంచుకుంది. 7:00 నుంచి 9 గంటల వరకు రెండు గంటల వ్యవధిలో 15% లోపు పోలింగ్ ఆ తర్వాత 11, ఒంటిగంట వరకు పోలింగ్ శాతం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఒకటి గంటల వరకు మూడు మున్సిపాలిటీలో 50 శాతానికి మించి పోలింగ్ జరిగింది. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కు మూడు రోజుల కిందట అలియాబాద్ మున్సిపాలిటీ లాల్ గడి మలక్పేట్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్ల మధ్య జరిగిన గొడవతో బందోబస్తును మరింత పెంచారు. సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన అద్రాస్ పల్లి, కొల్తూరు గ్రామాల్లో బందోబస్తును మరింత పెంచారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ లాల్ గడి మలక్పేట్ ను సందర్శించి, బందోబస్తును పర్యవేక్షించారు.

కాగా జిల్లా కలెక్టర్ మన చౌదరి, ఎన్నికల పరిశీల కురాలు విజయ కాంతి వెస్లీ తో కలిసి మూడు మున్సిపాలిటీల్లో ని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఓటింగ్ నిర్వాహణ, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్ డిసిపి పురుషోత్తం, ఏసీపీ లు శ్రీనివాస్ రెడ్డి, బాలగంగి రెడ్డి, మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలను పరిశీలించారు. కేశవరం, కొల్తూరు, మూడు చింతలపల్లి, ఉద్దమర్రి గ్రామాలను సందర్శించి, భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇది ఇలా ఉంటే అలియాబాద్ మున్సిపాలిటీ ఐదో వార్డులో బిజెపి అభ్యర్థి నకిలీ వెండి నాణేలను ఓటర్లకు అందజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విషయాన్ని గుర్తించిన ఓటరు సదరు అభ్యర్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రావల్కోల్ లో ఓటు వేయడానికి వచ్చిన వారిపై డి ఐ కిరణ్ శాంతి భద్రతల విధుల్లో భాగంగా లాటీ ఛార్జ్ చేశారు. దీనీ పై సిపిఎం నేత నరేష్ తో పాటు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సరికి ఎల్లంపేట్ మునిసిపల్ 83.28 %, అలియాబాద్ మునిసిపల్ 79.62 % మూడుచింతలపల్లి మునిసిపల్ 89.06 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
