“PDSU Demands Extension of Degree Fee Deadline”
డిగ్రీ ఫీజుల తేదీ పొడిగించాలని పి డి ఎస్ యూ డిమాండ్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూర్ డిగ్రీ కళాశాలలో పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ మాట్లాడుతూ…
కాకతీయ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఫీజులు నేటితో ముగియడంతో మిగతా విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు.బడుగు, బలహీన,వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పొడిగించి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గా డిమాండ్ చేస్తున్నమన్నారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు జి.అంజి,అసిఫ్, విజయ్,జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
