డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న పరకాల పోలీసులు

పరకాల నేటిధాత్రి
న్యూఇయర్ వేడుక లు విషాదం కాకుండా ఉండేందుకు పరకాల పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించారు.వేడుకల పేరుతో యువత మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చి ప్రాణాలు కోల్పోవద్దని రాత్రి పోలీసులు రోడ్డపైకి చేరి ప్రధాన రోడ్డపై తిరుగుతూ మద్యం తాగి వాహనాలు నడపకుండా నిలువరిం చేందుకు పట్టణంలోని స్థానిక బస్టాండ్ కూడలిలో 31డిసెంబర్ న పరకాల సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మద్యం సేవించిన వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని అధికంగ మద్యం సేవించిన వారి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు.ఈ తనిఖీలో ఎస్ఐ రమేష్ కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!