మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన..

జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి..

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మంగళవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం బిజినేపల్లి వద్ద ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించిన ఇద్దరు బాలుల మరణ వార్త తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం రోజు మరణించిన వారి తల్లిదండ్రులను మతీన్,అజ్మల్ మరియు వారి కుటుంబసభ్యులను బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్,మాజీ చైర్మన్ వాల్య నాయక్ మరియు జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిని పరామర్శించరు.జడ్చర్ల నియోజకవర్గం లోని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులాకు, కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా ఆదుకుంటున్నాని మనోధైర్యాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గం లోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

వీణవంక, ( కరీంనగర్ జిల్లా)

నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా మాల ధరించి నిష్ట నియమాలతో స్వామివారిని పూజిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామాలలో హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని రతంలో అసినులై గ్రామంలోని పూరవీధుల గుండా ఊరేగింపు శోభ యాత్ర నిర్వహించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, అంటూ రామనామ స్మరణ చేసుకుంటూ చేసుకుంటూ డీజే పాటలు, మేళ తాళాల మధ్య స్వాములు నృత్యాలు చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తీన్మార్ మల్లన్నకు ఓటు వేసిన అందరికి కృతజ్ఞతలు

జాడి వెంకటేశ్వర్లు

గంగారం, నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా గంగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతు
ఉమ్మడి వరంగల్ నల్గొండ మరియు ఖమ్మం జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ప్రతి ఒక్క పట్టభద్రుడికి కృతజ్ఞతలు గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకున్న పాపన పోలేదని నోటిఫికేషన్ లు ఇచ్చినంటే ఇచ్చి మళ్ళీ వారే వాటి మీద కేసులు వేస్తూ కాలయాపన చేస్తూ నిరుద్యోగులను చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేసిందని అందుకే ప్రజలు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ తోనే వారి అభివృద్ధి సాధ్యం అని నిరుద్యోగులను ఉద్యోగులు గా చేస్తారాని అది ఒక్క కాంగ్రెస్ కె సాధ్యంమని నమ్మి రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ నీ భారీ మెజారిటీ తో గెలిపించారో అలాగే తీన్మార్ మల్లన్న కు నిరుద్యోగ యువత పట్టం కడతారని ఆశిస్తున్నామని అని రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండ నెరవేరుస్తుందని అని అన్నారు..

ఆలయానికి కానుకగా ఇచ్చిన ఆవును మరియు లేగదూడను అమ్ముకున్న పూజారి మరియు ఒగ్గు కళాకారులు.

ఈ రోజు డి.ఎస్.పి వేములవాడ కి, ఫిర్యాదు ఫిర్యాదు.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామం శ్రీ మోహినికుంట మల్లికార్జున స్వామి దేవస్థానం కు ఒక భక్తుడు మొక్కుబడిగా ఆవు, లేగ దూడను ఇవ్వడం జరిగింది ఆలయ పూజారి మరియు ఒగ్గు కళాకారులు కలిసి గ్రామ కమిటీకి గాని గ్రామ ప్రజలకు గాని ఎవరికీ తెలియజేయకుండా కటిక వాళ్లకు కోతకు అమ్మడం జరిగింది ఆలయంలో వస్తున్న ఆదాయాన్ని కూడా తన సొంత లాభాల కోసం వాడుతున్నాడని డి.ఎస్.పి కి విన్నవించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ ఆలయ కమిటీ చైర్మన్ నక్క గంగాధర్ సభ్యులు ,పెరుక గంగరాజు చింతకుంట గంగాధర్, ,కొత్త ఎలారెడ్డి, సంపూనూరి దశరథం చింతకుంట బాపయ్య,సాగర్,ముత్యాల నరేష్ ఉన్నారు.

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చెయ్యాలి

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు

భూపాలపల్లి నేటిధాత్రి

బుధవారం
భూపాలపల్లి మండలంలోని ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి గ్రామీణ ప్రాంతాల్లో 22 పాఠశాలల్లో 160.29.లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పన పనులను చేపట్టినట్లు తెలిపారు. పెద్దాపూర్ లో 12.25 లక్షల, నేరేడుపల్లి లో 15.27 లక్షలు వజినేపల్లి 4.87 లక్షలు, రాంపూర్ లో 6 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులు పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పనకు నిధులు వెచ్చించి ప్రభుత్వ బడులలో మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలు పున ప్రారంభం నాటికి ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా సంపూర్ణంగా పూర్తి చేసి ఆహ్లదకరంగా తయారు చేయాలని అన్నారు. బడులు బాగుచేసుకోవడంతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, విద్యార్థులు భోజనం తదుపరి చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ ప్లాట్ ఫారం ఉండాలని పేర్కొన్నారు. మనమే విద్యార్థులమైతే ఎలాంటి సౌకర్యాలు ఉంటే బావుంటుందని కోరుకుంటామో అదే స్థాయిలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం, కనీస సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు. ఖర్చుకు వెనకాడకుండా జిల్లాలో మరమ్మత్తులు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యను అంధించేందు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన పనులు చురుకుగా జరుగుతున్నాయని అన్నారు. పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. నిధులు కొరత రాకుండా పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు మహిళా సంఘాలకు అంచనా ప్రతిపాదనలు మేరకు 25 శాతం ముందస్తు నిధులు మంజూరు చేశామని అన్నారు. పూర్తి అయిన పనులకు ఎలాంటి జాప్యం లేకుండా బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. చేపట్టిన పనులకు చెల్లించిన ప్రతి రూపాయి లెక్క పక్కాగా ఉండాలని, అందుకు
రిజిస్టర్లులో నమోదులు చేయాలన్నారు. మరమ్మతులు చేపట్టకు ముందు, పనులు జరుగుతున్నపుడు, పనులు పూర్తి అయిన తదుపరి మూడు దశల ఫోటోలు భద్రపరచాలని తెలిపారు. పాఠశాలల మైదానాలు ఎత్తు, పల్లాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచేందుకు ఉపాధి హామీ పధకం నిధులు ద్వారా చదను చేయాలని అన్నారు. నీళ్లు నిలిచే అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
స్థలం ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతి రాజ్ డి ఈ వెంకటేశ్వర్లు, ఏఈ సురేష్ కుమార్, ఎంపిఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

7వ డివిజన్ అభ్యర్థి సుక్కమ్మ నామినేషన్ దాఖలు

సిరిసిల్ల,మే -28(నేటి దాత్రి):

అర్బన్ బ్యాంక్ ఎన్నికలలో భాగంగా 7వ డివిజన్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అభ్యర్థి వేముల సుక్కమ్మ లక్ష్మీరాజం మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. 2 సెట్ లు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు.
మొదటి సెట్ లో గూడూరి మంజుల ప్రవీణ్ ప్రతిపాదన చేయగా దిడ్డి రాజు బలపరిచగా, రెండవ సెట్ లో కొక్కుల తిరుపతి ప్రతిపాదించగా దాసరి గోపాల్ బలపరిచారు.

10వ డివిజన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

సిరిసిల్ల, మే – 28(నేటి ధాత్రి):
సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికలలో భాగంగా పదవ డివిజన్ డైరెక్టర్ అభ్యర్థిగా వలస హరిణి నామినేషన్ దాఖలు చేశారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికలలో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని బ్యాంకు వినియోగదారులకు బ్యాంకు సేవలు అందిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.

అవినీతిపై ఉక్కుపాదం!

https://epaper.netidhatri.com/view/279/netidhathri-e-paper-29th-may-2024%09/2

`అవినీతి రహిత తెలంగాణ నిర్మాణం.

`ఆదర్శ తెలంగాణ కోసం సంకల్పం.

`అవినీతి అధికారులను ఏరిపడేస్తోంది!

`గతంలో ఎంత మంది మీద ఆరోణలు వచ్చినా పట్టించుకోలేదు.

`ఎన్ని విజిలెన్స్‌ ఎంక్వైరీలు జరిగినా చర్యలు తీసుకోలేదు.

`ఉద్యోగుల విచ్చలవిడి తనాన్ని ఆపలేదు.

`అందుకే అవినీతి విపరీతంగా పెరిగింది!

`ఇప్పుడు ఏక కాలంలో ఏరివేత జరుగుతోంది

`వివిధ శాఖలపై దృష్టి సారించిన రేవంత్‌ సర్కార్‌

`అవినీతి అధికారుల భరతం.

`ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు హోటళ్లపై దాడులు.

`అనేక మంది నకిలీ వైద్యుల గుర్తింపు.

`తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రులపై దాడులు.

`హడలెత్తిపోతున్న అక్రమార్కులు.

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:

అవినీతి ఒక వైరస్‌ లాంటిది. అది సమాజాన్ని పట్టి పీడిస్తూనేవుంటుంది. ఏ వైరస్‌కైనా మందుంది కాదు. అవినీతి అనే వైరస్‌కు మాత్రం ఇప్పటికి వరకు మందు లేదు. దాన్ని ఆపిన వారు లేరు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతూనే వుంది. సమాజంలో అవినీతి రాజ్యమేలుతూనే వుంది. అయినా ఏ ఒక్కరూ ఆపింది లేదు. ఏ ఎన్నిక జరిగినా, ఏపార్టీ అయినా సరే ముందు చెప్పే మొదటి మాట అవినీతి అంతం. ఇదే మాట దేశంలో జరిగే పంచాయితి ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల దాక చెబుతూనే వుంటారు. ప్రజలు వింటూనే వుంటారు. ఆ ప్రభుత్వంలో అవినీతిని చూస్తూనే వుంటాం. ప్రచారంలో, మ్యానిఫెస్టోలో ప్రతిసారి రాజకీయ పార్టీలు అవినీతిని ఒక అంశంగా చేర్చి అవినీతిని అంతం చేస్తాం. అవినీతి రహిత సమాజం నిర్మాణం చేస్తామంటూ చెప్పని వారు లేరు. అంతే కాదు ప్రభుత్వంలోకి వచ్చిన తొలిరోజు కూడా ప్రతి ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పే ఏకైక మాట కూడా ఇ దే. మరి అవినీతి ఆగిందా? ఎవరూ సమాధానం చెప్పలేరు. ప్రధాన మంత్రులు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారే…ఇలాంటి పరిస్దితుల్లో పాలకులు చెప్పడం, జనం వినడం పరిపాటిగానే మారింది. కాని మొదటి సారి తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ చెప్పినది చెప్పినట్లుగా అవినీతి అంతం మొదలు పెట్టింది. గతంలో ఎవరూ ఇలా మొదలు పెట్టింది లేదు. అవినీతి ఆపే ప్రయత్నం చేయలేదు.

మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినది చెప్పినట్లుగా అవినీతి రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

అందుకు పక్కా కార్యాచరణ తీసుకున్నట్లున్నారు. అందుకే ఏక కాలంలో అవినీతి అదికారులను ఏరిపడేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ సర్కారులో గాని ఏనాడు జరగలేదు. ఉద్యోగులు చేసిన అవినీతిపై కేసిఆర్‌ సర్కారు ఏనాడు కదల్లేదు. అంతే కాదు పిర్యాదు దారులకే నష్టం జరిగిందే గాని, అవినీతి చేసిన అదికారులకు మరింత మేలు జరిగింది. పిల్లలకు పాఠాలు చెప్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్లను జీవో.317 తెచ్చి చెల్లా చెదరు చేశాడు. నిజానికి టీచర్లకు ఎలాంటి ఇతర ఆదాయ మార్గాలువుండవు. వాళ్లు తమ గ్రామంలోనో, పక్కనే వున్న పట్టణంలోనో మాత్రమే వుంటారు. జిల్లా దాటి వెళ్తే వారి జీతానికి, జీవితానికి పొంతన లేకుండాపోతుంది. అలాంటి గురువులను సొంత జిల్లాల్లో వుంచకుండా, ఇష్టం వచ్చినట్లు విసిరేసిన కేసిఆర్‌ సర్కారు, ఇతర శాఖల ఉద్యోగులను మాత్రం నెత్తిన పెట్టుకున్నది. తెలంగాణ రాక ముందు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడి నుంచి పదేళ్ల పాటు కదలించకుండా కొలువులు చేయనిచ్చారు. దాంతో అలా పాతుకుపోయిన అదికారులు చేసిన అరాచాలు అంతా ఇంతా కాదు. వారి సంపాదనకు లెక్కే లేదు. మండలస్ధాయి ఉన్నతాధికారి కూడా కోట్లకు పడగలెత్తారు. ఇక ఆపై ఉద్యోగులు ఎంత సంపాదించారన్నదానిపై లెక్కలు తీసే లెక్కించేందుకు మిషన్లు చాలవన్నంతగా సంపాదించారు. కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాదికారులు ఏకంగా రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలవుదామనుకున్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్దపడ్డారు. మరి వాళ్లందరికీ అంతంత సొమ్ము ఎలా కూడిరది? కేవలం జీతాల మీద ఆదారపడే ఉద్యోగులకు పదేళ్ల కాలంలో వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయి? వందల కోట్ల సంపాదన ఎలా సమకూరింది? ఇలాంటి వాటికి ఎవరు సమాధానం చెప్పాలి. అందుకే కొత్త ప్రభుత్వం వచ్చింది. అవినీతి వ్యవసాయం చేస్తోంది. చేనులో చీడ పీడలను ఏరిపారేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాజాన్ని పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి అదికారులను గుర్తిస్తున్నారు. ఏసిబితో వారిని పట్టుకుంటున్నారు. వారి బండారం బైటపెడుతున్నారు. వారి ఆస్దులను లెక్కిస్తున్నారు. వారిని జైలుపాలు చేస్తున్నారు. అయినా కొంత మంది జైలు నుంచి బైటకు వచ్చి మళ్లీ కొలువు కోసం పైరవీలు కూడా చేస్తున్నట్లు సమాచారం.

ఇంత తక్కువ కాలంలో ఇంత మంది అవినీతి అదికారులను పట్టుకోవడం అంటే ప్రజల మీద రేవంత్‌రెడ్డికి ఎంత ప్రేమ వుందో అర్దం చేసుకోవచ్చు.

ప్రజలకు మేలు ఎంత మేర చేయొచ్చని ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు. గతంలో కూడా అవినీతిని అంతం చేస్తామని చాలా మంది ముఖ్యమంత్రులు చెప్పారు. కాని ఎవరూ ఒక్క అడుగు కూడా వేయలేదు. కాని రేవంత్‌రెడ్డి మాత్రం ప్రభుత్వ వ్యవస్దలే కాదు, ప్రైవేటు వ్యవస్దలలో కూడా అక్రమార్కులను జల్లెడ పడుతున్నారు. అక్రమార్కులు ఎక్కడ వున్నా, ఏ వ్యాపార రూపంలోవున్నా వారిని పట్టుకుంటున్నారు. అందుకే ప్రజల జీవితాలతో, ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై ఏక కాలంలో దాడులు చేసి, పెద్దఎత్తున వాటిని మూసేస్తున్నారంటే ప్రజల జీవితాల మీద రేవంత్‌రెడ్డికి వున్న చిత్తశుద్దిని ఇక్కడే గమనించవచ్చు. పేరుకు పెద్ద పెద్ద హోటళ్లు , విసృతమైన ప్రచారాలు, అందమైన భవనాలు, ఇతర హోటళ్లకన్నా ఎక్కువ ధరలు వసూలు చేస్తూ, రోడ్ల మీద కూడా అంత నాసిరకం ఆహార పదార్దాలు వుండని హోటళ్ల బండారం బైట పెడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి భరతం పడుతున్నారు. ఇదిలా వుంటే వైద్య వ్యవస్దను కూడా అక్రమార్కులు చేరి, ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో తెలిసిపోయింది. గత పదేళ్ల కాలంలో ఏనాడు బిఆర్‌ఎస్‌ సర్కారు నకిలీ వైద్యుల గురించిగాని, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆసుపత్రుల మీద గాని నిఘా పెట్టలేదు. వారి గురించి ఆరా తీయలేదు. వారిని పూర్తిగా విచారించలేదు. జిల్లా వైద్యాధికారులు అడిరది ఆట, పాడిరది పాటగా మార్చుకొని విచ్చలవిడిగా ఆసుపత్రులకు పర్మిషన్లు ఇచ్చారు. ఆ సర్టిపికెట్లు ఒరిజినలా? లేక డూప్లికేటా? కూడా చూడకుండా ఆసుపత్రుల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. దాంతో కనీసం పది కూడా చదవని వారు ఎంబిబిఎస్‌ బోర్డులు పెట్టుకొని వైద్యం చేస్తుంటే గత పాలకులు చోద్యం చూశారు.

నకిలీ శంకర్‌దాదాలు ఎక్కడో మారు మూల ప్రాంతాలలో ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోలేదు.

దర్జాగా హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేసుకొని, వైద్యం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి అలాంటి దొంగ డాక్టర్ల బాగోతాలు కూడా వెలుగులోకి తెస్తున్నారు. ఇక తెలంగాణ మొత్తం దాడులు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ప్రజా పాలన అంటే ఇలా వుండాలి. ప్రజా పాలకుడు అంటే రేవంత్‌రెడ్డిలాగ వుండాలని ఆదర్శమౌతున్నారు. నిజంగా తెలంగాణలో ఇలాంటి అక్రమార్కులు లేకుండా చేస్తే రేవంత్‌ పాలన చరిత్రలో నిలిచిపోతుంది. రేవంత్‌ కీర్తి ఆచంద్ర తారార్కం వెలుగుతుంది. ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఒక్కటే..మెరుగైన పాలన. అంటే ప్రజలకు ఎలాంటి కల్తీ లేని ఆహారపదార్దాలు ప్రజలకు అందాలి. తక్కువలో మెరుగైన వైద్యం అందాలి. అధికారుల నుంచి పనులు వెంటనే ఉచితంగా పూర్తి కావాలి. అసలు ప్రభుత్వాధికారులు వున్నదే ప్రజల సేవ కోసం. వారితో పని చేయించుకోవడం ప్రజల హక్కు. కాని ప్రజల నుంచి ముక్కు పిండి పనిని బట్టి వసూలుచేసుకోవడం హక్కుగా అదికారులు మార్చుకున్నారు. సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత సీరియస్‌గా అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నా లంచాలు తీసుకోవడం అధికారులు మానడం లేదు. అంటే లంచాలకు ఎంతగా అలవాటు పడ్డారో తెలుస్తోంది. లంచం కూడా అదికారులకు ఒక వ్యసనంగా మారినట్లు వుంది. లంచం లేకుండా ఇంటికి వెళ్లలేని పరిస్దితి వచ్చినట్లుంది. అందుకే ఎలాంటి భయం లేకుండా దర్జాగా లంచాలు తీసుకుంటున్నారు. పట్టుబడుతున్నారు. అయినా వారిలో ఎలాంటి భాద కనిపించడంలేదు. ఎందుకంటే మళ్లీ ఆ కుర్చీలోకి వస్తామన్న నమ్మకం పెరిగిపోయింది. గతంలో ఇలా పట్టుబడ్డ వాళ్లెంతోమంది మళ్లీ కొలువులు చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో పట్టుబడిన డిప్యూటీ తహసిల్దార్‌ 2017లో కూడ రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మరి మళ్లీ ఎలా కొలువులో చేరాడు. అలా చేరడం పెద్ద సమస్య కాలేదు. అందుకే మళ్లీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అంత దర్జాగా లంచం తీసుకుంటున్నారు. ఇలా ఒక్కసారి పట్టుబడిన అదికారుల కొలువులు తొలగిస్తేగాని వారిలో మార్పు రాదు.

Cracks in Megastar Chiranjeevi family

https://epaper.netidhatri.com/view/279/netidhathri-e-paper-29th-may-2024%09

·Differences between the Chiru and ‘Allu’ families

·Glittering upon and empty within

·Allegations made on each other

·Digging pits behind smiles

· Nagababu’s carelessness adds fuel to the fire

·In previous he made allegations against Endamuri

·Allu Arjun is not our side: Nagababu comments

·Counter attack by Allu Arjun

· The Film Industry is on alert

·Was Allu Arjun became a hero with the film abandoned by Ramcharan?

·Is Nagababu has that much of angry?

·Is it a mistake for Allu Arjun to campaign in favor of his friend?

·Is it the habit of Chiranjeevi to leave friends in need?

·Why did Chiranjeevi not save Devi Varaprasad?

·Why did Chiru not disclose Kodandarami Reddy’s role in his career development?

·Sudhakar made Chiru a Hero

·Chiru brought Brahmanandam against Sudhakar

·Chiru remains wealth and his friends are now in trouble

·Friendship with Chiru remains banned for producers

HYDERBAD,NETIDHATHRI:

How did Chiranjeevi rise to this Mega Star level? Only personal effort caused for his present stage or was there any role of Allu Ramalingaiah in his success story? Since three decades this question still has been taking place in the discussions among cine personalities. Now Nagababu raised another interesting question. Who is the main cause for the growth of Allu Arjun as top hero? Is Chiranjeevi or Allu Aravind? While speaking in a Youtube channel Nagababau revealed that Chiranjeevi is the main cause for the elevation of Allu Arjun. Is it real that Allu Arjun has no talent to raise this level? Is it true that main cause for his rise is the film sacrificed by Ramcharan? Is it fact that Ramcharan left the Arya film in which he had to act as hero? Now the comments made by Nagababu in Youtube channel, causing lot of problems among Chiru family. There serious discussions are going on in cine industry. In previous Parliament Elections a friend of Allu Arjun contested and requested Arjun to participate in the campaign. Allu Ajurn gave him word and as per the given assurance he participated in the campaign in favour of his friend. That friend in the fray was the candidate of YSRCP. This caused to raise anger in Nagababu who posted in ‘X’ expressing his dissatisfaction using the words ‘our person’ and ‘other person’. This post created serious repercussions. Here we must recognise one point. Allu Arjun made campaign in favour of only one leader that to his friend. When Chiranjeevi founded ‘prajarajyam party’ Allu Arjun stood in support of Chiranjeevi and in previous elections he also worked in favour of Pavan Kalyan. This time also Allu Arjun extended his full support to Janasena party but he did not participated in campaign. Whatever the reasons may be, they are not essential for the people. Not campaigning in favour of Janasena party now became issue due to Nagababu post. He also raised one point that without Chiranjeevi, it is not possible for Allu Arjun to become an actor. This created flutter in the Chiru family and created a situation of creating distance in between the families of of Chiru and Allu Aravind. Like this creating controversies is became a habit for Chiru family and finally they push their allegations against media is only cause for such controversies. For all such controversies Naga babu is becoming the main cause.
Chiranjeevi always tries to project himself as a gentle man. Really speaking no actor in the field has as many opponents as Chiranjeevi have. Now time is favour to them. That is only the cause for their success. Not only Chiranjeevi… Nagababu and Pavan Kalyan also remain problem creators. Chiranjeevi family has the history of never caring those who had stood in support and extended cooperation to them. This is the sayings of those who are in cine field. Really speaking Sudhakar gave chances to Chiranjeevi but in return he never extended his helping hand to Sudakar. There are allegations that Chiranjeevi brought Brahmanandam against Sudhakar and left him without opportunities. Everybody knows the present position of Narayana Rao like actors who became hero’s before to Chiranjeevi. If the argument that by doing the film relinquished by Ramcharn, Arjun became star is real, once in the film where Super Star Krishna was hero, in that film Chiranjeevi acted and became star is also a fact that can’t be dismissed. Everybody used to say that Chiranjeevi rose to this level only with his personal efforts but fact is that by acting in star directors films caused his stardom. Nobody is ready to reveal this fact. One year back one reporter asked Chiranjeevi to tell the names of directors who caused for his success. Then Chirnajeevi told the names of directors except Kodi Ramakrishna who gave his first film super hit. Once Star director Kodanda Ramireddy had directed 23 films in which Chiranjeevi was hero. All of them became super hit but Chiru did not tell his name. Kodanda Ramireddy himself raised this point on one occasion. ‘I am leaving this for his discrimination’ Kodandarami Reddy said. The erroneous statements given by Chiranjeevi and Pavan Kalyan are not less in number. In 1990 at the time of ‘Rowdi Alludu’ suiting period one journalist asked him, ‘do have the habit of reading the papers?’ then his reply was ‘no’! Continuously some pictures became hit made Chiru to look towards politics. Then he replied on one occasion that ‘I read every paper dailly’! Once Pavan Kalyan told that he had not shown any interest on studies. ‘I studied in Telugu medium. My father had no belief on god’ like that Pavan Kalyan revelations continues. On another occasion he said that he studied Inter with B.P.C group, on some other occasion he said about his Inter with MPC group. When he went to Guntur, ‘I continued my studies here’, he says like this. On one occasion when he visited Piduguralla, ‘I used to play here’ he recollected. Like that whenever visits a place he used to tell the people about the relationship he has with that particular city or town. This has become the nature of Pavan Kalyan.
After founding the Prajarajyam party Chiranjeevi said, ‘my life is for the service of the people’. He also assured the people that he never act further in the films. What happened next everybody knows well. Now Pavankalyan says that he has not at all interested in films. Who asked him to act in films? Anybody invited him to film industry to make as hero? These brothers, what they say and for what purpose they expose like this is nobody knows. Can they understand what themselves saying? In cine field also this family has differences with lot of people. Chiranjeevi continued his antagonism with Mohanbabu during his entire cine career. On the issue of ‘Tagore’ film, How Chiranjeevi created lot of troubles to another hero Rajasekhar is well known to everybody. When Rajasekhar had not extended his support to Prajarajyam and spoken against that party, Chiranjeevi and Pavan Kalyan fans attacked him. The cine hero’s belong to 1980 decade used to meet at Chiranjeevi’s house. On such occasions Balakrishna didn’t received any invitations from them. All these incidents expose the silly behaviour of Chiranjeevi. After ‘Rikshavodu’ film fell in utter flap, no producer came forward to give opportunity to Chiranjeevi. Then Mohanbabu came forward and gave chiranjeevi a chance to act in ‘Hitler’ film in which Mohanbabu left his opportunity to act. With that film Chiranjeevi again came into form. Devi Varaprasad gave number of hits to Chiranjeevi and by making the film ‘Magamaharaju’ he lost everything when that film became flaps. There are allegations that in such situation Chiranjeeve never made any attempt to save Devivaraprasad. There are lot of allegations on his blood bank. Like that Chiranjeevi remain the centre of controversies. He always tried to prevent the raise of others. That is the name acquired by Chiranjeevi family in cine filed. Now Allu family also joined to such opponents. Let us see how far this controversy goes further.

ఖిలా వరంగల్ ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్ సస్పెండ్

*అనుమతి లేని వెంచర్ కు అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్*

*ఒక్కో డాక్యుమెంట్ కు 75వేల చొప్పున డీల్, మొత్తం 48 డాక్యుమెంట్లు చేయాలని ఒప్పందం, రెండు రోజుల్లో 26 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిన ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్*

*ప్లాన్ ప్రకారం అన్ని రెడీ చేశారు, ఇంకో 22 డాక్యుమెంట్లు చేసే లోపే అక్రమ వ్యవహారం బయటకు పొక్కడంతో సస్పెండ్ చేసిన జిల్లా రిజిస్ట్రార్*

*అనుమతులు లేని అక్రమ వెంచర్ ఎక్కడ?, పూర్తి వివరాలు త్వరలో “మీ నేటిధాత్రి లో”*

*నేటిధాత్రి, వరంగల్*

ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రార్ అజ్మీరా కార్తిక్ సెలవుపై వెళ్లగా, ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన రాజేష్ ప్లాన్ ప్రకారం ఒక అనుమతి లేని వెంచర్ లో, సుమారు 48 డాక్యుమెంట్లకు డీల్ కుదుర్చుకొని, ఒక్కో డాక్క్యుమెంట్ కు 75వేలకు డీల్ ఒప్పందం చేసుకొని, రెండు రోజుల్లో 26 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినాడు. అనుమతి లేని వెంచర్, అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం, డబ్బుల డీల్ విషయం బయటకు పొక్కడంతో వెంటనే స్పందించి జిల్లా రిజిస్ట్రార్ రవి, డి.ఐ.జి సుభాషిణి ఆదేశాల మేరకు ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా పని చేసిన రాజేష్ ను సస్పెండ్ చేశారు. అతను చేసిన డాక్యుమెంట్ల పైన విచారణ చేపియ్యనున్నట్లు సమాచారం.

*అనుమతులు లేని ఆ “అక్రమ వెంచర్” పైన పూర్తి వివరాలు త్వరలో*

అల్లు కున్న బంధానికి చిరు బీటలు!

చిరు అలజడి… అల్లు తిరగబడి!

పైన పటారం..లోన లొటారం!!

రచ్చకెక్కి కక్కేసుకుంటున్నారు…

పైకి ప్లాస్టిక్‌ నవ్వులు…లోలోన తవ్వుకుంటున్న గోతులు.

నాగబాబు తొందరపాటు…అలవాటుగా నోటి దురుసు.

యండమూరితో ఆనాడు కామెంట్లు..తర్వాత చివాట్లు!

అల్లు అర్జున్‌ మనవాడు కాదంటూ నేడు విసుర్లు…

అల్లు అర్జున్‌ కౌంటర్‌ ఎటాక్‌ కామెంట్లు.

సినీ పరిశ్రమ అలర్ట్‌…

రామ్‌ చరణ్‌ వదిలేసిన సినిమాతో అల్లు అర్జున్‌ హీరో అయ్యారా!

నాగబాబు మనసులో అంత కోపముందా?

స్నేహితుడికి ప్రచారం చేయడం అల్లు అర్జున్‌ తప్పా!

స్నేహితులకు హాండ్‌ ఇవ్వడం చిరుకు అలవాటేనా?

దేవీ వరప్రసాద్‌ను చిరంజీవి ఎందుకు ఆదుకోలేదు?

తన ఎదుగుదలలో కోదండరామి రెడ్డి పేరెందుకు చెప్పలేదు?

సుధాకర్‌ చిరును హీరో చేస్తే…

బ్రహ్మానందంను సుదాకర్‌కు పోటీ తెచ్చె..

చిరు ఐశ్వర్యంలో…స్నేహితులు కష్టాలలో…

చిరు స్నేహం… నిర్మాతలకు శాపం.

మెగాస్టార్‌గా చిరంజీవి ఎదగడానికి స్వయంకృషి కారణమా? లేక అల్లు రామలింగయ్య కారణమా? ఇది సినీ లోకంలో గత ముప్పై దశాబ్ధాలుగా వినిపిస్తున్న మాట. ఇప్పటికీ సాగుతున్న చర్చ. ఇదిలా వుంటే చిరంజీవి వల్ల అల్లు అర్జున్‌ హీరో అయ్యాడా? లేక అల్లు అరవింద్‌ వల్ల ఎదిగాడా? కాని తాజాగా నాగబాబు చేసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వింటే చిరంజీవి వల్లనే అల్లు అర్జున్‌కు క్రేజ్‌ ఏర్పడిరదంటూ ఓ యూట్యూబ్‌ చానల్‌లో నాగబాబు చెప్పడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చకు దారి తీసింది. నిజంగా అల్లు అర్జున్‌కు టాలెంట్‌ లేకుండానే ఎదిగాడా? రామ్‌ చరణ్‌ చేయాల్సిన సినిమా ఛాన్సు అల్లు అర్జున్‌కు ఇవ్వడం వల్లనే ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడా? ఆర్యా అనే సినిమా రామ్‌ చరణ్‌ చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్‌కు త్యాగం చేశారా? నాగబాబు వ్యాఖ్యలు అల్లు కుటుంబంలో తాజాగా మరింత చిచ్చును రేపుతున్నాయని సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మద్య అల్లు అర్జున్‌ తన స్నేహితుడు వైసిపినుంచి పోటీ చేశాడు. ఆయనకు గతంలోనే అల్లు అర్జున్‌ మాటిచ్చాడు. తాన ప్రచారం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆచరించాడు. ఆ వైసిపి. అభ్యర్దికి మద్దతుగా ప్రచారం సాగించాడు. ఇది అల్లు అర్జున్‌ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. కాని ఇదే విషయంలో నాగబాబు అక్కసు పీక్‌ స్ధాయికి వెళ్లింది. మనవాడు, పరాయి వాడంటూ ఓ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశాడు. అది పెద్ద రచ్చకు దారి తీసింది. అయినా అల్లు అర్జున్‌ కేవలం ఒక్క అభ్యర్దికి మాత్రమే ప్రచారం చేశాడు. అయినా ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సూచిస్తాం. ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎంచుకుంటే అభివృద్ది జరుగుతుందని ఆలోచిస్తాం. అదే ఇక్కడ అల్లు అర్జున్‌ చేశాడు. అల్లు అర్జున్‌ గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి మద్దతుగా ప్రచారం చేసిన సందర్భం వుంది. అల్లు అర్జున్‌ ఈసారి కూడా జనసేనకు పూర్తి మద్దుతు పలికారు. కాని ఆయన ప్రచారానికి వెళ్లలేదు. అందుకు కారణాలు ఏవైనా వుండొచ్చు. అది ప్రజలకు అవసరం లేదు. అల్లు అర్జున్‌ జనసేనకు అనుకూలంగా ప్రచారం చేయలేదు. అది ఇప్పుడు పాత పెంకాలసులన్నీ తవ్వుకునేందుకు దారి తీసింది. అసలు చిరంజీవి లేకుంటే అల్లు అర్జున్‌ నటుడయ్యేవాడు కాదన్నట్లు నాగబాబు చెప్పడం అన్నది పెద్ద వివాదంగా మారింది. అల్లు, చిరు కుటుంబాల మద్య దూరం పెరిగిందనేదానికి ఆస్కారం ఏర్పడిరది. ఇలా వివాదాలు సృష్టించుకునేది చిరు కుటుంబమే..మళ్లీ మా మధ్య విభేదాలు మీడియా సృష్టే అంటూ తోసేయడం వారికి పరిపాటే..ఎందుకంటే వివాదాలకు ఎప్పుడూ నాగబాబు కేఆర్‌ఆఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటాడు.

అసలు చిరంజీవిపైకి ఎంతో మృధు స్వభావి అన్నంతగా ప్రచారం చేసుకోవడం ఆయనను మించిన వారు లేరు. ఎందుకంటే ఆయనతో విబేధాలున్నంత మంది సినీ ప్రముఖులు మరెవ్వరికీ లేదు. కాలం కలిసిరావడం వల్ల వారి ఆటలు సాగుతున్నాయి. చిరంజీవి ఒక్కడే కాదు, నాగబాబు, పవన్‌ వివాదాలు కేరాఫ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే వారిని ఆదుకున్నవారితో గాని, వారితో తోడుగా నిలిచి వారిని కూడా లెక్క చేయని తనం చిరంజీవి కుటుంబానికే చెల్లిందనేది సినీ వర్గాలు చెప్పే మాట. అసలు చిరంజీవికి అవకాశం వచ్చిందే కమెడియన్‌ సుదాకర్‌తో…కాని ఆయనకు చిరంజీవి పెద్దగా సహకరించిందిలేదు. సుధాకర్‌ లాంటి నటుడికి పోటీగా బ్రహ్మనందంను తెచ్చి, సుదాకర్‌కు అవకాశాలు లేకుండా చేసిందే చిరంజీవి అన్న అపవాదు వుండనే వుంది. ఇక చిరంజీవి కన్నా ముందు హీరోలైనా నారాయణ రావు లాంటి వారు ఎక్కడున్నారో అర్దం చేసుకోవచ్చు. రామ్‌ చరణ్‌ సినిమా వదిలేస్తే అల్లు అర్జున్‌ చేసి స్టార్‌ అయ్యాడంటే ఒకనాడు సూపర్‌ స్టార్‌ కృష్ణ చేయాల్సిన సినిమాను చిరంజీవి చేసి స్టార్‌ అయ్యాడన్న సంగతి తెలియంది కాదు. పట్టుదలతో, స్వయం కృషితో చిరంజీవి సినిమాలు చేసి స్టార్‌ అయ్యాడని అందరూ అంటుంటారు. కాని ఆయన స్టార్‌ డైరెక్టర్లతో ఎక్కువ సినిమాలు చేయడం వల్లనే ఆయనకు స్టార్‌ డమ్‌ వచ్చిందన్న సంగతిని ఎక్కడా చెప్పరు. ఓ ఏడాది క్రితం మీ కేరిర్‌కు బాగా దోహదపడిన డైరెక్టర్ల పేర్లు చెప్పమంటే చిరంజీవికి తొలి హిట్‌ ఇచ్చిన కోడి రామకృష్ణ పేరు చెప్పలేదు. చిరంజీవితో సుమారు 23 సినిమాలు చెసి, పెద్ద పెద్ద హిట్‌లు ఇచ్చిన కోదండరామి రెడ్డి పేరు చెప్పలేదు. ఈ విషయాన్ని సాక్ష్యాత్తు దర్శకుడు కోదండరామి రెడ్డే స్వయంగా చిరంజీవిని తప్పు పట్టారు. చిరంజీవి తన పేరు చెప్పకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కూడా అన్నారంటే చిరంజీవి వ్యక్తిత్వం ఎలాంటిదో అరం చేసుకోవచ్చు. ఇక చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు చెప్పే మాటల్లో వుండే అబద్దాలు మామూలుగా వుండవు. 1990లో రౌడీ అల్లుడు సినిమా షూటింగ్‌ సమయంలో జర్నలిస్టులు చిరంజీవిని పేపర్‌ చిదివే అలవాటు వుందా? అని ప్రశ్నిస్తే అసలు నేను పేపర్‌ చూడను అంటూ సమాధానం చెప్పారు. వరసుగా కొన్ని సినిమాలు హిట్‌ కావడంతో చిరంజీవికి రాజకీయాల మీద ఆశ మల్లింది. అప్పుడు నిత్యం నేను అన్ని పేపర్లు చదువుతానంటూ మరోసారి చెప్పారు. ఇవి ఎలా వుంటాయంటే పవన్‌ కల్యాణ్‌ నాకు చదువు కోవాలని వుండేది కాదంటాడు. తెలుగు మీడియం స్కూల్‌లోనే చదివానంటూ చెబుతుంటాడు. మా నాన్నకు దేవుడంటే నమ్మకం లేకుండేది అని పవన్‌ అంటాడు. మా నాన్నకు ఎంతో భక్తి వుండేది చిరంజీవి అంటాడు. తాను ఇంటర్‌లో బైపిసి చదివానని ఓసారి, మ్యాధ్స్‌ చదివానని ఓసాని, అసలు ఇంటర్‌ వరకు వెళ్లనే వెళ్లలేదని పలు సార్లు పవన్‌ చెప్పాడు. అంతే కాదు గుంటూర్‌కు వెళ్తే ఇక్కడే చదువుకున్నానంటాడు. పిడుగురాళ్లకు వెళ్తే ఇక్కడే ఆడుకున్నానంటాడు. నెల్లూరుకువెళ్లి ఇక్కడే ఈ గల్లీలో ఆడుకున్నానంటాడు. ఇలా జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో నా బాల్యం సాగిందంటాడు. అసలు వారు ఏం చెబుతున్నారో కూడా మర్చిపోయి చెబుతుంటారు.

జనం వెర్రి గొర్రెలనుకుంటారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఇక నా జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ ప్రకటించాడు. ఇక జీవితంలో సినిమాలు చేయనంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఇక పవన్‌ కల్యాన్‌ అసలు తాను సినిమాల్లోకి రావాలనే వుండేది కాదంటాడు. ఎవరు రమ్మన్నారు? ఎవరిని ఉద్దరించాడానికి వచ్చాడు? ప్రజలు అయ్యా పవన్‌ కల్యాన్‌, నిన్ను పవర్‌ స్టార్‌ను చేస్తాం రా..రామ్మని పిలిచారా? అసలు వాళ్లు ఏం మాట్లాడతారో..ఎవరికోసం మాట్లాడతారో వాళ్లకే అర్ధమౌతుందో లేదో తెలియదు. సినిమాల విషయంలోనూ అందరితోనూ విభేదాలే.. మోహన్‌బాబుతో సినీ కేరిర్‌ అంతా వైరమే… డెబ్బై ఏళ్ల సినిమాలో తనకు తానే స్వయం ప్రకటిత లెజెండ్‌గా చిరంజీవి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మోహన్‌బాబు పరువు తీయడానికి చేసిన ప్రయత్నం తెలియంది కాదు. ఠాగూర్‌ సినిమా విషయంలో హీరో రాజశేఖర్‌ కెరీర్‌ను ఎలా ఇబ్బందులకు గురిచేశారో అందరం చూశాం..ప్రజారాజ్యానికి సపోర్టుగా కాకుండా వ్యతిరేకంగా మాట్లాడాడిన రాజశేఖర్‌పై చిరంజీవి, పవన్‌ అభిమానులు దాడి చేసిన సందర్భం వుంది. అంతే కాదు 1980 దశకం హీరోలు, హీరోయిన్లు ఏటా చిరంజీవి ఇంట్లో సమావేశమై, బాలకృష్ణను పిలువకపోవడం వంటి చిల్లర పనులు చేసేదే చిరంజీవి అన్న అపవాదు వుండనే వుంది. రిక్షావోడు తర్వాత ఆయనతో సినిమా తీసేందుకు నిర్మాతలు కూడా ముందుకు రాని సమయంలో, మోహన్‌బాబు చేయాల్సిన సినిమా హిట్లర్‌ను చిరంజీవి చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇలా ఇతరులు చేయాల్సిన అనేక సినిమాలు ఆయన చేసి హిట్‌లు అందుకున్నాడు. చిరంజీవికి ఎన్నొ హిట్‌లు ఇచ్చిన దేవీ వర ప్రసాద్‌, మగరాజు తీసి సర్వం కోల్పోయి వీధిన పడితే, కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు కూడా చిరంజీవి మీద వున్నాయి. ఇక బ్లడ్‌ బ్యాంకు మీద ఆ మధ్య వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వివాదాలకే అడ్రస్సే చిరంజీవి…తన ముందు ఎవరూ ఎదగకుండా అడ్డుకున్న వ్యక్తే చిరంజీవి అని సినీ వర్గాల్లో చర్చించుకోని కుటుంబం అంటూ వుండదు. ఇప్పుడు ఆ కుటుంబంలో అల్లు అర్జున్‌ కుటుంబం చేరింది. ఈ వివాదం ఎంత దూరం పోతుందో చూడాలి.

Relentless struggle of ‘Netidhatri’ on Chitrapuri ·

‘Netidhatri’ stand in support of Chitrapuri

·Netidhatri continued its struggle against fraudulent activities in Chitrapuri

·Finally Anil’s arrest caused happiness among workers

·They are expressing congratulations to Netidhatri

·Now workers are coming forward to express their opinions

·Netidhatri created awareness among workers

·We will open all fraudulent activities in Chitapuri: workers

·‘We will expose all details of corrupted people’: workers

·‘We will make them stand before people for their mistakes’: victims

·Till collecting what has been swallowed Netidhatri never takes a rest

·Now Anil’s anarchy came to the limelight

·We wrote items till the government responded

·Every time we cautioned against those mistakes

·We always indicated not to cause injustice to workers

·Anil never showed interest in heeding the words…now in jail

·Netidhatri never stops here

· The real story began now itself

·We will expose all illicit activities of those behind Anil

·We never take rest till justice is caused to workers

HYDERABAD, NETIDHATRI:

Those who are in film industry always try to tell ethics. Even in films finally they preach ethics but entire film story contain all the nonsense that can easily attract the audience. In real life most of those belong to film industry indulge in worthless things. Every system contains good and bad. Unfortunately in film industry the bad quantity is higher when compare to other systems. Everywhere we can observe the domination of glamour and the money that revolve around it. So film industry is nothing but a colourful filed, where present innocent people as well as hypocrites. Unfortunately where innocence is present there deceit also makes its presence. Contemptible people number is also considerably high in this industry. They always try to indulge in detriment activities. Every time they try to make believe others that the people in film industry are such a great that no other field contain such prestigious people. Saying like this the trickery people try deceit others with their words of mischief exaggerating the colourful field like a field of fortune. If such people are ordinary one than we can easily keep them aside when we get doubt on their words. Unfortunately those who acquired name and fame in the industry indulge in such practices. In general the people who hear their mesmerising words automatically fell in trap and finally face haplessness after losing huge amount of money. Such people make you to believe, that they are going to produce a film. When you fell in their trap, they always make you to spend money. Such a fraudulent people they are. In the same way since forty years such elders in cine field are continue to mischief the workers about allocating the plots. Those workers who rely on their words have still waiting for allotment of plots.

As like deceiving the workers since four decades now such ‘elders’ began to mischief new people by collecting lakhs of rupees from them. When there is no justice caused to workers since forty years, how they can allocate plots to new people? Those who are paying such amounts, why not understanding this simple logic is remain a real puzzle. In this background ‘Netidhatri’ entered and began to question the same and continue to write stories on the fraudulent activities taking place in ‘Chitrapuri’. Responding to these stories Society Chairman tried to show himself as fair man. Then ‘Netidhatri’ published a story on real face of this Chariman, that exposed all unethical things happened along with proofs. With story published, it was proved that all the sayings of Vallabhanaeni Anil not real. Unfortunate thing is that still those fraudulent activities have been continuing and the practice of illegally allocating the plots to others those really meant for workers. Those who want plots in Chitrapuri, already paid lakhs of rupees to the society. Like that number of plots allocated to cine workers now sold out to those people who not belong to this Chitrapuri. Unfortunate thing is that, one single plot has been registered in the name of one or two people. Like that number of fraudulent activities took place in the society. With these deceitful acts the workers left on roads as real losers. Those cine elders who transformed to rich with such activities now have been enjoying grandeur life. At the same time their belittle attitude towards workers left intact. Such unethical people entered into Chitrapuri. After a long time, their sins turned as experiences in the form of results. Netidhatri brought out all such illegal activities of Vallabhaneni Anil and exposed his real face. At the same time it also published stories regarding what had happened in previous. Responding to these stories cine workers filed a case in the police station against Vallabhaneni Anil. Immediately police arrested him and put him behind the bars. Some other people are in escape, as per the information given by the police. This episode revealed that large number of people has been indulged in these illegal activities. From the beginning crores of rupees worth fraud has been taken place in Chitrapuri plots issue. Some workers have already been telling this fact but unable to prove them, they remain kept in silence.

The plots legally allocated to cine workers now have been sold out. The Chitrapuri plots only allocated to cine workers belong to 24 departments in film industry. Then how cine producers, directors and cine heroes got plots in this colony? Astonishing fact is that some plots were also allocated to police personnel! Even IT employees also have plots in this Chitrapuri colony. How all such people who nowhere related to cine industry got plots in this colony? In these circumstances cine workers met Netidhatri and gave all the details regarding how those fraudulent activities have been taking place in Chitrapuri colony.

Now there is some movement in the government with the serial stories published in Netidhatri. It also exposed that some leaders in previous government extended their support to these so called cine elders. It is learnt that some review also took place in the government regarding the stories published in Netidhatri regarding Chitrapuri. Immediately it issued orders to police to take any complaint regarding Chitrapuri colony frauds. In this background police took the complaint filed by cine workers and arrested Society President Anil. There are also some complaints against some other people but now they are not available. It is learnt that they are trying to escape from this trouble with the help of elders in the government. It is also learnt that such elders in the Government reluctant to respond in favour to such people. So they are searching other routs to make the political leaders in favour. Chief Minister Revanth Reddy is in strong opinion to put an end to these illegal activities. Now 250 such plots were sold out to cine elders! They built villas in the name of row houses. Government issued orders to dismantle such row houses but the officials are in back foot to do so! Now cine workers have been demanding to immediate dismantle of such row houses. If dismantle takes place, hundreds of cine workers can get plots. The amount that has been credited by workers in the society is still left intact but no house plots allocated to them. Unfortunately cine producers, directors, heroes got plots and build merry houses. This is nothing but usurp the rights of the workers. Now it requires the government shall act quickly to dismantle those row houses and expose the fact that whom such houses really has been allocated. Cases shall be filed against those who acted against workers. Netidhatri is demanding to allocate plots to workers who are genuine beneficiaries.

ట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి నాయిని శ్రీనివాస్ రాజీనామా..

నేటి ధాత్రి

కాటారం లో గృహ నిర్మాణాలకు ఇసుక కొరత ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల దృష్యా ట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు నాయిని శ్రీనివాస్ తెలిపారు. శనివారం ట్రాక్టర్ అసోషియేషన్ లో ట్రాక్టర్ ఓనర్ల తో సమావేశం నాయిని శ్రీనివాస్ మాట్లాడుతూ
విలాసాగర్ మానేరువాగు, లోకల్ వాగుల నుండి ఇసుక సరఫరా చేయడం ఇబ్బందిగా ఉన్న నేపథ్యం లో గ్రామ ప్రజలకు ఇసుక సరఫరా చేయలేక పోయాను. కావునా ప్రజల ఇబ్బందులే నా సమస్యగా భావించి ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు నాయిని శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాటారం గ్రామములో నెలకొన్న ఇసుక కొరతకు ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు

అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి

పార్కుల నిర్వహణ జిహెచ్ఎంసి చేపట్టాలి:కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య
క్షుడు శేరిసతీష్ రెడ్డి

కూకట్పల్లి మే 25 ధాత్రి ఇన్చార్జి

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో పలు పార్కులను కాంగ్రెస్ నాయకులు పరిశీ లించారు. కూకట్పల్లి నియోజకవర్గం కాం గ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నా యకులు బృందం శనివారం పార్కులు సందర్శించి పరిశీలించారు. పార్కుల మెయింటెనెన్స్, పార్కుల్లో ఉన్న సమస్యలను గుర్తించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా అవసరాల కోసం పేరుతో హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవసరా లు లేనప్పటికీ ఖాళీ స్థలాలను కమిషన్ల కోసం పార్కులను నిర్మించారని అన్నా రు.నిర్మించిన పార్కుల నిర్వహణ జిహె చ్ఎంసి ఆధ్వర్యంలో జరగాలని అయితే ఇక్కడ మా త్రం బి ఆర్ ఎస్ నాయకులు పార్కులో తిష్ట వేసి సొంత జాగరుగా వాడుకుం టున్నారని ఆరోపించారు.అంతేగాక కేపీహెచ్బీ ఎలసి ఫ్లాట్స్ ప్రాంతంలో గల పార్కుల్లో రాత్రి వేళల్లో అసాంఘిక కార్య క్రమాలు జరుగుతున్నా యని వీటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.అభివృద్ధి అంటే ప్రజాధనంతో నిర్మించి పట్టించు కోకుండా ఉండడం కాదని,గత ప్రభుత్వం హయంలో పా
ర్క్లో డెవల ప్మెంట్ కోసం అని కోట్ల రూపాయలు నిధులు వేచించి టెండర్లు పిలిచి కమిషన్ల కోసం పండు చేపట్టి నిర్వహణ బాధ్యత మరిచిపోయారని వెంటనే జిహెచ్ఎంసి అధికారులు పార్కు లను పరిశీలించి ప్రజా అవసరాలకు వినియోగంలోకి తీసుకురావాలని కోరా రు.ఈ విషయమై తాము జిహెచ్ఎంసి అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శేరి సతీష్ రెడ్డి స్పష్టం చేశారు.కార్యక్రమంలో పాల్గొన్నారు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి,114 కెపిహెచ్బి డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రాజు,మహిళా అధ్యక్షురాలు పొన్నం రజితగౌడ్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి,ఫణీంద్ర కుమార్,మేకల మేకలు,నాగమల్లేశ్వరరావు,బాబ్జి,నితీష్ కుమార్ గౌడ్,కిరణ్,సా యితేజగౌడ్,అ రవింద.

విత్తనాలు కొనుగోలు విషయంలో రైతులకు అవగాహన కార్యక్రమం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని ఖాజిపల్లి, నరసింగాపూర్ గ్రామాలలో శనివారం రోజున రైతులు విత్తనాలు కొనుగోలు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఏఈఓ బి. అరుణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ విత్తనల సంచులు లూజుగా ఉన్నవి కొనరాదని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని విత్తన ప్యాకెట్ మరియు బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ బి .అరుణ్ కుమార్ గౌడ్, బిటిఎం విశ్వనాథ్ మరియు రైతులు పాల్గొన్నారు.

విత్తన కొనుగోలుపై రైతులకు అవగాహన

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

వానాకాలం పంటల సాగులో విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని పొత్కపెల్లి AEO V. కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం ఓదెల మండలం జీలకుంట గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని, లైసెన్స్ ఉన్న డీలర్ వద్ద మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. పంట దిగుబడి వచ్చే వరకు, పంట కాలం పూర్తయ్యే వరకు రసీదు జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్నారు. రసీదులో విత్తన కంపెనీ పేరు, రకం, బ్యాచ్ నెంబర్ ,లాట్ నెంబర్, రేటు ఉండాలన్నారు. ప్యాకెట్ మీద తయారీ తేదీ, కాలం ముగిసిన తేదీ చూసుకోవాలన్నారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి.

#రైతులు లైసెన్సు ఉన్న షాప్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి.

#మండల వ్యవసాయ అధికారి ఆర్ పరమేశ్వర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి: అనుమతులేని కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి ఆర్ పరమేశ్వర్ అన్నారు శనివారం మండల కేంద్రంలో విత్తనాల వ్యాపారస్తులతో సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పలు విత్తనాల విక్రయ కోసం వచ్చిన సందర్భంలో ప్రతి డీలరు నాణ్యమైన విత్తనాలు రైతులకు విక్రయించాలని మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలు అధిక రేట్లకు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అలాగే తప్పనిసరిగా ప్రతి షాపు నందు విత్తనాల వివరాలను స్టాక్ బోర్డులో నమోదు చేయాలి రైతు కొన్న ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి లేనియెడల సదరు డీలర్ పై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో ఏ ఈ ఓ లు శ్రీకాంత్, సాధన, భాస్కర్, మహేందర్, భారతి, డీలర్లు బిక్షపతి, రవీందర్ గౌడ్, శివరాత్రి శ్రీనివాస్ గుప్తా, గోనె రాంబాబు, ఎస్.కె మైనద్దీన్, పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

పోలీసు శాఖ వారు నిర్వహించిన పోటీల్లో పాల్గొంటున్న జట్లకి నగదు ప్రోత్సాహం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పోలీస్ శాఖ వారు నిర్వహించిన కబడ్డీ వాలీబాల్ పోటీలలో పాల్గొంటున్న జట్లకి 3000 రూపాయలు నగదు అందజేసిన జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి అలాగే గ్రామ మాజీ సర్పంచ్ నీరజ ఎల్లయ్య వెయ్యి రూపాయల లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత యువకులు క్రీడా కార్యక్రమాలతో పాటు చదువులో రాణించాలని పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు యువకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు

ఆత్మ రక్షణకు కరాటే అత్యవసరం

పురాతన కాలం నుండి యుద్ధ విద్యలలో ఆయుధం లేకుండా శత్రువుని ఎదిరించి అద్భుత విద్య

భారతదేశంలో పుట్టి చైనా దేశంలో ప్రదర్శింపబడి నేడు భారతీయులకు అందించబడుతుందని ఆవేదన కలుగుతుంది

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి

ప్రతి వ్యక్తి ఆత్మరక్షణకు ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలంటే కరాటే నేర్చుకొని ఉండాలి,,,, సమాజంలో ధైర్య సాహసాలను ప్రదర్శించగలగాలి ఆరోగ్యం శక్తి ఆయుష్షు నిలకడమైన జీవితానికి కరాటే అత్యవసరం నేటి సమాజంలో ఆడపిల్లలను మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఎదుర్కోవాలంటే గుండె నిబ్బరం కరాటే విద్యతో వస్తుంది ఎంతటి వారినైనా చాకచక్యంగా శక్తి మాత్రమే ఉంటుంది అతి పురాతనమైన ఆయుధం లేని కరాటే విద్యను అందరి అభ్యసించాలి అందుకే ప్రచారాన్ని ఉచితంగా చేయడమే కాకుండా దాన్ని అభ్యసించడానికి రామాయంపేట కరాటే మాస్టారు మర్కు శ్యామ్, పోచమ్మల రామకృష్ణ తెలిపారు. రామయంపేటలోనే కాకుండా బచ్చే రాజు పల్లి గ్రామంలో కూడా కరడే క్లాసులు ప్రారంభించడం జరిగినాయి అని వారు అన్నారు. అక్షర విద్యాలయం వద్ద ఉచిత కరాట శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ మర్కు శ్యామ్ కుమార్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ రామాయంపేట. మాస్టర్ పోచమ్మ రామకృష్ణ బ్లాక్ బెల్ట్. లు పాల్గొన్నారు.

తాడి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం లోని మడక గ్రామానికి చెందిన మ్యడగోని మొగిలి గౌడ్ అనే గీత కార్మికుడు వృత్తి లో బాగంగా శనివారం ఉదయం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడగా కాలు విరిగి గాయాలయ్యాయి.గమనించిన సహచర గీతకార్మికులు మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది.భాదితునికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఓదెల మండల ఉపాధ్యక్షులు గట్టు మహేష్ గౌడ్ మరియు గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు మ్యడగోని మల్లేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

error: Content is protected !!
Exit mobile version