నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన హనుమాన్ మాలధారణ స్వాములు దీక్ష పూర్తిచేసుకొని ఇరుముడితో సైకిల్ యాత్ర ద్వారా భద్రాచలం బయలుదేరారు.41 రోజుల మండల
దీక్షలు నియమనిష్ఠలతో చెప్పట్టిన హనుమాన్ మాలధారణ స్వాములు
గుజిలే రాము, తాటికొండ వెంకన్న చారి, ఐలాపురం శ్రీకాంత్ చారి, మనోజ్ చారి ముసుకు మధుకర్ లు గురువారం దీక్ష పూర్తిచేసుకొని ఇరుముడులతో సైకిల్ యాత్ర ద్వారా భద్రాచలం బయలుదేరినట్లు వారు పేర్కొన్నారు.వచ్చే నెల 1 న హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కల్గిన భద్రాచలం వెళ్లి ఇరుముడి సమర్పిస్తామని తెలిపారు.

