ఘనంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

జెండా ఆవిష్కరణ చేసిన బందు సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

2024 మే 30 సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా , మెట్టుకొండ లక్ష్మి జండా ఆవిష్కరణ చేయగా,బందు సాయిలు అధ్యక్షతన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు రమేష్ మాట్లాడుతూ భారత కార్మిక ఉద్యమ చరిత్రలో సిఐటియు ఆవిర్భావం ఒక చారిత్రక అవసరఘట్టం. 1970 మే 30న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఆవిర్భవించింది. నేటికీ( 2024 మే 30 ) 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జాతీయ కార్మిక ఉద్యమ నేతలు కామ్రేడ్ బి టి రణ దివే, కామ్రేడ్ పి రామ్మూర్తి తొలి అధ్యక్ష, కార్యదర్శులు. ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతిబసు ఉపాధ్యక్షులుగా ఉన్నారు.ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియును దేశవ్యాప్త కార్మిక సంఘంగా స్థాపించి ముందుకు నడిపారు దేశంలో మతోన్మాద కార్పొరేట్ విధానాల సవాల్ నేపథ్యంలో వారి వారసత్వాన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బృహత్తర బాధ్యత మనపై ఉంది. 2024 మే 30 సిఐడి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కార్మిక వర్గాన్ని మరింత చైతన్యం చేయాల్సి ఉన్నది. నాటి నుండి నేటి వరకు భారత కార్మికు ఉద్యమానికి పాలకవర్గాల నుండి అనేక సవాలు ఎదురయ్యాయి. వాటిని ఎదిరిస్తూ నేటికీ 22 దేశవ్యాప్త సమ్మెల్లో పోట్లాదిమంది కార్మిక వర్గాన్ని సమీకరిస్తూ కార్మికోద్యమం ముందుకు పోతున్నది. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల పేరిట దాడి. పెట్టుబడుల సేకరణ పేరిట పనుల తగ్గింపు నిబంధనల సడలింపు కార్మిక చట్టాలను సరళం చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం. బిజెపి వాజ్పేయి కాలంలో ప్రైవేటీకరణ మరింత వేగం పెట్టుబడుల ఉపసంహరణ కోసం కమిటీ ఏర్పాటు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 2021 నాటికి కార్పోరేటికరణ దూకుడుగా కొనసాగింది. ఎయిర్ ఇండియా బాల్కో సిఎంసి హిందుస్థాన్ జింకు హెచ్టిఎల్ మారుతి ఉద్యోగుల లిమిటెడ్ హిందుస్థాన్ యూనివర్స్, బిఎస్ఎన్ఎల్ ఇండియన్ పెట్రోల్ కెమికల్స్ ఐడిఎఫ్సి లాంటి అనేక సంస్థల్లో ప్రైవేటీకరణ కొనసాగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మూల స్తంభాలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కార్మికు ఉద్యమం మీద కార్మిక ఐక్యత పై తీవ్ర దాడి కొనసాగింది.
కార్మిక చట్టాల సవరణలు
కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం తీసుకువచ్చారు హైర్ అండ్ ఫైర్ సిస్టం (వాజ్పేయి కాలం నుండి ) 2024 నరేంద్ర మోడీ కార్మిక హక్కులపై మరింత దాడి. నాలుగు లేబర్ కోట్లు పార్లమెంటులో 2019 20లలో ఆమోదింప చేసుకున్నారు 29 కేంద్ర చట్టాలను రద్దు చేశారు. ఎనిమిది గంటల పని దినం కనీస వేతనం సంఘం పెట్టుకునే హక్కు సమ్మె హక్కును కార్మిక శాఖ పనితీరు, అసంఘటిత కార్మికుల హక్కులు స్కీం వర్కర్ల హక్కులు కాల రాయబడ్డాయి. బిజెపి పాలిత రాష్ట్రాలు మరికొన్ని రాష్ట్రాల్లో కార్మిక చట్టాల సవరణలకు ప్రయత్నం.గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర. ఎఫ్ టి ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టం తీసుకువచ్చారు. 30% అప్రెంటీసులను అనుమతించారు. మోడీ కాలంలో ప్రభుత్వ సంస్థలపై దాడి మరింత ఉధృతం చేశారు. కులం మతం మస్తిత్వ భావజాలంతో కష్టజీవులు ఐక్యతను భంగం చేసి భావోద్వేగా రాజకీయాలు కార్మికుల ఐక్యతను దెబ్బతీయడానికి బిజెపి రాజకీయ ప్రయోజనాలకు కాపాడుకోవడానికి కుటిల యత్నాలు. మతాన్ని రాజకీయాలకు వాడుకుంటూ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నది. రాజ్యాంగం కల్పించిన హక్కుల పై దాడి చేస్తున్నది. ఉదాహరణ వాక్ స్వాతంత్రం, పత్రిక స్వేచ్ఛ, రిజర్వేషన్స్ కోల్పోవడం. సి ఏ ఏ, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జాయింట్ సెక్రెటరీ ఆకుదారి రమేష్, సిఐటియు సీనియర్ నాయకులు వెలిశెట్టి రాజయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి వంగాల విజయలక్ష్మి, ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి శేఖర్, మరియు తదితర కార్మికులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version