ముత్తారం :- నేటిధాత్రి
ముత్తారం మండలంలోని ముత్తారం,ఓడేడు గ్రామాలలో విత్తనాల దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్,పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మధునయ్య తనిఖీలు చేశారు.షాపులలో సంబంధించిన లైసెన్స్,స్టాక్ రిజిస్టర్,విత్తనాల ఇన్వాయిస్ పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని తెలిపారు.