మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాలకు మిషన్ భగీరథ నీరు అందించాలి

# నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని కిషన్.

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ పైప్ లైన్ ద్వారా కొన్ని ప్రాంతాలకు మిషన్ భగీరథ నీరు అందడం లేదని అందుకుగాను ప్రతి ప్రాంతానికి ఆ మిషన్ భగీరథ నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీకిషన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలో కొన్ని ప్రాంతాలలో మిషన్ భగీరథ మంచినీరు సరఫరా కావడం లేదని ప్రజలు తెలుపుతున్న ఫిర్యాదు మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ సంబంధిత మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ వంశీ,మున్సిపల్ ఏఈ రాజేష్, మిషన్ భగీరథ వాటర్ సప్లై ఇన్చార్జి లింగు స్వామి, మిషన్ భగీరథ గ్రిడ్ ఇంచార్జ్ సంపత్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు, వాటర్ సప్లై లైన్ మెన్స్, సప్లై లీకేజీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

బస్తి దవఖాన ఏర్పాటు కోసం ఎమ్మెల్యేకు లేఖ.

నర్సంపేట మున్సిపాలిటీలో వాడకంలో లేని పాఠశాలలో బస్తి దావఖాన ఏర్పాటు చేయాలని కోరుతూ నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్ స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి లేఖ రాశారు. బస్తీ దవఖాన ఏర్పాటు పట్ల చైర్ పర్సన్ మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ ఈసంపెల్లి జోనా,బాంజిపేట పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ అరుణ్,మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మార్వోను కలిసిన జాతీయ మానవ హక్కుల మండలం కమిటీ

దుగ్గొండి,నేటిధాత్రి :

జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో దుగ్గొండి మండల నూతన కమిటీ ఎన్నిక కాగా శనివారం ఎమ్మార్వోతో పాటు పలువురు అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుల్ల భద్రయ్య ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి కోమండ్ల శ్రీనివాస్ నియమించారు. ఈ సందర్భంగా దుగ్గొండి మండల జాతీయ మానవ హక్కుల కమిటీ ఎమ్మార్వో రవిచంద్ర రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు,ఎంపీడీవో అరుంధతి, ఎంఈఓ శ్రీదర్ గౌడ్,ఏవో మాధవి, కరెంటు డిపార్ట్మెంట్ ఏఈలను మర్యాదపూర్వకంగా కలిశారు. దుగ్గొండి మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు తెలిపారు. ఈకార్యక్రమంలో దుగ్గొండి మండల అధ్యక్షులు మెరుగు రాంబాబు, ప్రధాన కార్యదర్శి ముత్యాల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మల దిలీప్, మండల అధికార ప్రతినిధి వేముల రామచందర్, సంయుక్త కార్యదర్శి బొడిగె మోహన్,సహాయ కార్యదర్శి పేరబోయిన సురేష్, సోషల్ మీడియా మండల ఇన్చార్జ్ మంద రమేష్ మోర్తాల అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మండల స్థాయి 68వ ఎస్ జి ఎఫ్ క్రీడలు.

చిట్యాల, నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోనీ చల్లగరిగ ఉన్నత పాఠశాలలో ఘనంగా 68వ ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడలు నిర్వహించారు మండల ఎస్ జి ఎఫ్ చైర్మన్ మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం సాధించిన క్రీడాకారుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని క్రీడాకారులు క్రీడలు ఆడవలసిందిగా క్రీడాకారులను కోరాడు అండర్ 14 అండర్ 17 విభాగాలలో బాల బాలికలు 450 మంది విద్యార్థులు కబడ్డీ ఖో ఖో వాలీబాల్ క్రీడలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చిట్యాల మండల సబ్ ఇన్స్పెక్టర్ షాఖన్ పాల్గొన్నారు ఎస్ జి ఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరంగి రమేష్ అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కవిత కబడ్డీ క్రీడాకారుడు రబ్బాని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రహీం పాష సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు వేల్పుల రాజ్ కుమార్ మండల ఎస్ జి ఎఫ్ కన్వీనర్ తెడ్డు స్వరుపరాణి ఫిజికల్ డైరెక్టర్లు బండి ప్రసాద్ సూదం సాంబమూర్తి ఎన్ లింగయ్య జి శ్రీనివాస్ భాస్కర్ సమ్మయ్య శ్రీనివాస్ రెడ్డి వెన్నెల ఉమా రాజు నరేష్ తదితరులు పాల్గొన్నారు

కొర్కిశాలలో మాజీ సర్పంచ్ అప్పం మల్లక్క వర్ధంతి వేడుకలు

నివాళులర్పిస్తున్న జర్నలిస్టులు
మొగులపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కశాల మాజీ సర్పంచ్ అప్పం మల్లక్క మొదటి వర్ధంతి వేడుకలను తన భర్త అప్పం భీమయ్య, కుమారులు అప్పం రమేష్, అప్పం సాగర్ లు తన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు అప్పం మల్లక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె కలలు కన్నా కొర్కిశాల గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు యూనియన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు నిమ్మల సారయ్య, జర్నలిస్టులు క్యాతరాజు రజనీకాంత్, చెక్క శ్రీధర్, వేముల కిరణ్ గౌడ్, కట్కూరి ఐలయ్య, నిమ్మల భద్రయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, మొగుళ్ళపల్లి టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, నాయకులు మణికర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీలో యాదేచ్చగా బహుళ అంతస్థుల నిర్మాణాలు.

ఏజెన్సీ చట్టాలు అమలు చేయని అధికారులు.

ఏజెన్సీలో బహుళ అంతస్థుల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నది ఎవరు.??

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి.-జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి.

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటి ధాత్రి..

పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన కరకగూడెం మండల కేంద్రంలో ఏజెన్సీ చట్టలకు విరుద్దంగా గిరిజనేతరులు భూ క్రయ విక్రయలు జరుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తున్న గిరిజనేతరులు.ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నీరేఎత్తినట్టు చూస్తున్న అధికారులు. ఏజెన్సీ చట్టాలు 1/59, 1/70 యాక్ట్,ఎల్ టీ ఆర్ చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు పూర్తిగా నిర్ములించాలి కానీ అవి ఏమి పట్టనట్టు చూస్తున్న అధికారులు. ఎటువంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్థుల నిర్మాణాలు జరిగిపోతున్నాయి. ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికారులే గిరిజనేతరులకు కొమ్ముకాస్తు చేతులెతేసి చోద్యం చూస్తున్న అధికారులు. ఇదంతా చూస్తుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ గిరిజనేతరులకు ఏజెన్సీ చట్టాలు వర్తిస్తాయా, అనే భావన కలుగుతుంది, ఇది ఇలానే జరిగితే ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసుల మనగడ ప్రశ్నర్దాకంగా మారుతుందని ఆదివాసి సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) కరకగూడెం మండల ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.మండల పరిధిలో చాలామంది నిరుపేద ఆదివాసీ కుంటుంబాలు ఇల్లు కట్టుకొని ఉండటానికి ఇంటి స్థలాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆదివాసీ కుటుంబాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్బంగా ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక(జేఏసీ) కరకగూడెం మండల కమిటీ డిమాండ్ చేస్తుంది.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి-జేఏసీ కో-కన్వీనర్ వజ్జ నరసింహారావు.

మండలలోని సమత్ భట్టుపల్లి రెవిన్యూ పరిధిలో 770 సర్వే నెం. లో సుమారు 500 ఎకరాలు పైచిలుకు భూములు ఉన్నాయి, అందులో సుమారుగా 300 ఎకరాల వరకు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు. గిరిజనేతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భూములు ప్రభుత్వ అధీనంలో ఉన్నట్టుగా ప్రభుత్వ సూచికలను ఏర్పాటు చేయాలనీ, అలాగే భట్టుపల్లి రెవిన్యూ లో గల సర్వే నెం.9 లో 1 ఎకరం 03 కుంటల ప్రభుత్వ భూమిని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) కరకగూడెం కి అప్పగించి ఏజెన్సీలో ఆదివాసీ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.

రక్షణ కవచం యంత్రంపై అవగాహన కార్యక్రమం

మంచిర్యాల, నేటి, ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గౌడ కంఠం రక్షణ కవచం యంత్రంపై అవగాహన కార్యక్రమాన్ని బెల్లంపల్లి నియోజకవర్గం తాళ్ల గురజాల గ్రామంలో 22. 9. 2024 ఆదివారం రోజున బెల్లంపల్లి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యంత్రంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇందుకుగాను గౌడ జన హక్కుల పోరాట సమితి తరఫున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారపు మొండి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.తాండూరు,భీమిని,బెల్లంపల్లి,కాసిపేట మండలలలోని గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆయన కోరారు

విద్యార్థుల తల్లి తండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం

జైపూర్, నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రతినెల మూడవ శనివారం జరిగే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి వివిధ గ్రామాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆలిష్ మాధుర్య మాట్లాడుతూ విద్యార్థులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెడుతూ వారి ప్రవర్తనలోని మంచి చెడు విషయాలను ఉపాధ్యాయులతో పంచుకోవాలన్నారు.ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలలో వ్యాధుల బారిన పడకుండా విద్యార్థులు శుభ్రత పాటించే విధంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తద్వారా విద్యార్థుల చదువుకు అంతరాయం మేలు జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తన తో పాటు ఇంటి వద్ద చదువుకునే విధానమును సమావేశంలో తెలియజేస్తూ,పాఠశాలలోఉన్న సమస్యలు టాయిలెట్లు, డైనింగ్ హాల్ గురించి ప్రస్తావిస్తూ త్వరగా పూర్తి చేయించాలని కోరారు .ఈ సమావేశానికి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు పాల్గొన్నారు.

అంతిమయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

చిట్యాల నేటి దాత్రి

చిట్యాల మండలం చల్లగారిగె గ్రామానికి చెందిన మండల యువజన కాంగ్రెస నాయకుడు బండారి సురేష్ గారి తండ్రి బండారి సదయ్య గుండెపోటుతో మృతి చెందారు విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి గ్రామానికి వెళ్లి సదయ్య ‌పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి అధైర్య పడకండి కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించి అంతక్రియలో పాల్గొన్నారు
వెంట మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య , నల్ల రాజిరెడ్డి, బుచ్చిరెడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు..

పిల్లలు ఆరోగ్యంగా ఎదగడం ముఖ్యం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధ్యరంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలల్లో నిర్వహించే జాతీయ పోషక మాసం కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున జైపూర్ మండలం మిట్టపెల్లి గ్రామంలోని మిట్టపల్లి -2 అంగన్వాడి సెంటర్ నందు పోషణ మాసం ఉత్సవాలు లబ్దిదారులు,పిల్లలతో,
వారితల్లి తండ్రులతో నిర్వహించడం జరిగింది.అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం, పాలు,గుడ్లు,గర్భిణీ స్త్రీలకు, అలాగే బాలింత పిల్లలు కు అందిస్తున్న పౌష్టిక ఆహారం,నిత్యం తీసుకోవాలి,అలాగే గర్భిణీ స్త్రీలు ప్రతి నెల సరైన చికిత్స అందుకోవాలని అదేవిధంగా 102, 108 సేవలను గర్భిణీ స్త్రీలు బాలింతల సేవలు ఉపయోగించుకోవాలని అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు అనీమియా తో బాధపడకుండా ఐరన్ విటమిన్స్ ఆహారం తీసుకోవాలని గర్భిణీ స్త్రీలు ప్రతి నెల చికిత్స తీసుకోవాలని కోరారు. అదేవిధంగా అంగన్వాడి పాఠశాల పిల్లలు వారి యొక్క పెరుగుదల ఆరోగ్యం కొరకు అంగన్వాడి సెంటర్లో అందిస్తున్న పౌష్టిక ఆహారం గుడ్లు,పాలు,బాలమృతం మరియు బాలమృతం ప్లస్
పిల్లలకు నిత్యం అందించాలని పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడే పిల్లలు యొక్క పెరుగుదల,బలంగా,పిల్లలు ఉంటారని పౌష్టికాహారం పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని ఆరోగ్యంగా బాగుంటారని అన్నారు..గర్భిణీ స్త్రీలు సరైన శాఖాహార,ఆకుకూర,పాలు,పండ్లు తీసుకోవాలని కోరారు.మిట్టపెల్లి ఆరోగ్య కేంద్రం నందు పిల్లల యొక్క టీకాలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాల కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది. అంగన్వాడి పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్య బోధనలు బోధించడం జరుగుతుందని పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు కాకుండా ప్రభుత్వ అంగన్వాడి పాఠశాలలకు పంపించాలని కోరడం జరిగింది. అదేవిధంగా పోషణ మాసం లో భాగంగా అంగన్వాడి పాఠశాల పిల్లల యొక్క తల్లులు బాలమృతం తో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసి రావడం జరిగింది.తీసుకొని వచ్చిన వంటకాలను పరిసరించారు. ఇలాంటి వంటలను పౌష్టిక ఆహారం రూపంలో పిల్లలకి అందించాలి. పిల్లలు యొక్క తల్లులు తీసుకువచ్చిన బాలమృతంతో తయారుచేసిన వివిధ వంటకాలను పరిశీలించి విజేతలకు బహుమతులు అందించడం జరిగింది. కొమ్ముగూడెం అంగన్వాడి సెంటర్ లో 6 నెలల బాబు కి అన్న ప్రసన కార్యక్రమం నిర్వహించారు.సరైన అంగన్వాడి భవనం లేక ఇబ్బంది పడుతున్నామని పిల్లల యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా అంగన్వాడి పాఠశాల టీచర్ తెలపగా మరికొద్ది రోజుల్లోనే చెన్నూర్ ఎమ్మెల్యే తో భవనం మంజూరు చేపిస్తామని స్థానిక నాయకులు కామెర మనోహర్ హామీ ఇచ్చారు.
అనంతరం జాతీయ పోషణ మాసం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ రజిత, ఐసీడీఎస్ సూపర్ వైజర్ కవిత, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ సౌజన్య,
అంగన్వాడి పాఠశాల టీచర్ షెగ్గం నిరోష, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గాజుల ప్రవీణ్, ఏఎన్ఎం రాణి, కాంగ్రెస్ నాయకులు మనోహర్, పిల్లల తల్లి తండ్రులు, గర్భిణీ స్త్రీలు ,ప్రజలు పాల్గొన్నారు.

స్కిల్స్ నేర్చుకోండి భవిష్యత్తును మార్చుకోండి

భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్

ఇంపాక్ట్ ఆధ్వర్యంలో ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు

భూపాలపల్లి నేటిధాత్రి

సమాజంలో ప్రతి ఒక్కరుకూడా స్కిల్స్ నేర్చుకోవాలి భవిష్యత్తును మార్చుకోవాలని ఇంపాక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ఉద్దేశించి భూపాలపల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ నరేష్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శని , ఆదివారాలు రెండు రోజుల పాటు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ భూపాల పల్లి ఏరియా ఇంఛార్జి పెద్ది పృధ్వీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంపాక్ట్ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నిన్ను నువ్వు నమ్ముకో నీ జీవితం మారుతుంది , ఇతరుల మాటలు, అపోహలు నమ్మకు అనే మాటను తన జీవితంలో తన స్నేహితుని ద్వారా విని మోటివేట్ అయి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో సీఐ స్థాయిలో ఉన్నానని సగర్వంగా తెలిపారు. ఇంపాక్ట్ సేవలందిపుచ్చుకొని యువత, నిరుద్యోగులు జీవితాలను ఉన్నతంగా మలుచుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు పెద్ది పృథ్వి మాట్లాడుతూ ప్రపంచంలో ఉచితంగా వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహించే ఏకైక సంస్థ ఇంపాక్ట్ ఫౌండేషన్ మాత్రమేనని, ప్రతి ఒకరు తమ మాటల ద్వారా ఇతరులను మోటివేట్ చేసే గొప్ప నైపుణ్య దానం ఇంపాక్ట్ ఫౌండేషన్ చేస్తుందని వివరించారు. నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ తాము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదుగుతారని, అది ఎంతోమంది ఈ శిక్షణ పొందిన అనంతరం తమ జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం జరిగిందని వివరించారు. తదుపరి జరగబోయే శిక్షణ శిబిరానికి తమ పేర్లను 9396782088 నెంబర్ కు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్

మయసభను తలపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్న వెంచర్ల వ్యవస్థ

ఫ్లెక్సీలతో ఆకర్షించి లక్షల్లో దోపిడి

అనుమతులు ఏవి లేకున్నా ఆదాయానికి డోకా లేదు

వెంచర్ల పేరుతో ముంచేస్తున్న పట్టించుకోని అధికారులు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో వెంచర్ల పేరుతో భూవిక్రయ దందా జోరుగా సాగుతుంది. ఇందులో ఒకటైన శ్రీ వెంకటేశ్వర వెంచర్ స్థానిక పంచాయతీ నుండి సరైన అనుమతులు పొందకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతూ వెంచర్ నిర్వాహకులు దర్జాగా ఉంటున్నారు.దీంతో అనుమతులు లేని ఇంటి నిర్మాణ సమాచారాన్ని హైడ్రా అధికారులకు ఇవ్వాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.జైపూర్ మండలంలో ఇదివరకే అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.పట్ట భూములను చూపి గుట్టు చప్పుడు కాకుండా లావాణ పట్టా భూములని ప్లాట్లుగా విభజించి వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే.ప్రభుత్వ అనుమతుల ప్రకారం గ్రామపంచాయతీకి ఇచ్చిన భూమిలో గ్రౌండ్, పార్క్ స్థలాలతో పాటు రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలను అభివృద్ధి చేశాకే క్రయ విక్రయాలు జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ పనులేవి చేయకుండానే మండలంలోని శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ వ్యాపారులు గత కొద్ది రోజుల క్రిందట మండల నాయకుల సమక్షంలో భారీ ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించి,ప్రజలను ఆకర్షించి చట్ట విరుద్ధంగా ప్లాట్లను అమ్ముతూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.డిటిసిపి అనుమతి ఉంది అంటూ మండల కేంద్రం లోని తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకొని సర్వేనెంబర్ 102 మరియు103 లో గల భూమిని వెంచర్ పేరుతో ఫ్లాట్స్ గా తయారు చేసి క్రయవిక్రయాలు చేస్తున్నారు.ప్రభుత్వ అనుమతుల ప్రకారం వెంచర్ వేసే సంబంధిత భూమిలో 10% గ్రీన్ బెల్ట్ కోసం గ్రామపంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వెంచర్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత మరో 10 శాతం భూమిని గ్రామపంచాయతీకి అప్పగించాలి. దాని తరువాతనే భూమి రిలీజ్ చేసుకొని క్రయవిక్రయాలు జరుపుకోవాలి. కానీ మౌలిక సదుపాయాలు పూర్తి చేయకుండా సౌకర్యాల నిర్మాణాలు చేపట్టకుండా మధ్యతరగతి ప్రజలను మోసం చేసి అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం ధరలు నిర్ణయించి అమ్మకాలు జరపకుండా శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా అధిక ధరకు అమ్ముతూ కోట్ల ఆదాయం పొందుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా అనుమతులు పొందినట్లుగా పత్రాలకే పరిమితమై పూర్తిస్థాయి సౌకర్యాలు చేపట్టకుండా క్రయవిక్రయాలు చేపట్టి సామాన్య ప్రజల నడ్డి విరిస్తున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని చౌరస్తాలలో ప్రచారం కొరకు భారీ ఆకారాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించి అధిక మొత్తాన్ని వసూలు చేస్తూ మోసం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దానిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రజలు కోరుతున్నారు.

బతుకమ్మ దసరా వేడుక స్థలాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్.

చిట్యాల నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున జిల్లా అదనపు కలెక్టర్ ఎల్. విజయలక్ష్మి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జరగబోయే దసరా బతుకమ్మ వేడుకల స్థలాలను పరిశీలించడం జరిగింది, అనంతరం చిట్యాల మండలంలోని చిట్యాల గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్, వెంకట్రావుపల్లి, లో బతుకమ్మ,దసరా ఆడుకునే స్థలాలను పరిశీలించి ఎర్పాట్లు త్వరగా పూర్తి చేయుటకు సలహాలు సూచనలు జారి చేశారు. వీరి వెంట ఎం.పి.డి.ఓ ఎ.రామకృష్ణ , పంచాయితి కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎ.రామకృష్ణ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు సిబ్బంది పాల్గొన్నారు

మహ్మదాపురం పీఏసిఎస్ లో జేడీఏ తనిఖీ.

దుగ్గొండి,నేటిధాత్రి :
దుగ్గొండి మండలంలోని మహ్మదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో
జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ శనివారం తనిఖీ చేశారు.సొసైటీని సందర్శించిన అమే ఎరువులను తనిఖి చేశారు.అదేవిధంగా తిమ్మంపేట గ్రామంలో రైతుల పంట పోలాలను పరిశీలించి, మిర్చి పంటలను నాటే ముందు దుక్కిలో ఎకరానికి 8 కే.జీల చొప్పున ట్రైకోడర్మ ను వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాధవి,వ్యవసాయ విస్తరణ అధికారులు హన్మంతు,రాజేష్, రైతులు రవికుమార్,కొమురెల్లి పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమావేశం

నిజాంపేట, నేటిదాత్రి

నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం “ఉపాధ్యాయ విద్యార్థి తల్లిదండ్రుల సమావేశం” నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అంతే కాకుండా పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా చూడాలని చెప్పారు. తరగతి గదుల కొరతను తీర్చడానికి తల్లిదండ్రులు సహకరించాలని విన్నవించారు. ఆరు ఏడు తరగతుల విద్యార్థుల ప్రతిభా పాటవ ప్రదర్శనను తల్లిదండ్రులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, అర్జున్, శ్రీమతి సుకన్య, నరేష్, చంద్రకాంత్, కుమారస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ జెల్ల రజిత లక్ష్మణ్ మాజీ కో ఆప్షన్ మెంబర్ గౌస్ మరియు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి
హాజరయ్యారు.

తిమింగలాలను వదిలేసి పరకల మీదనా ప్రతాపం!

https://epaper.netidhatri.com/view/384/netidhathri-e-paper-22ng-september-2024%09

నేటిధాత్రి ఎఫెక్ట్‌ మిల్లర్లపై కేసులు నమోదు

వేల కోట్లు మింగిన మిల్లర్ల మీద పడండి.

వేల కోట్ల బకాయిలు వసూలు చేయండి.

`నల్గొండ, కరీంనగర్‌, నిజామాబాదు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల లెక్కలు తీయండి.

`తప్పుడు సమాచారాలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయండి.

`ప్రభుత్వ యంత్రాంగానికి చేతగాకపోతే సిబిఐకి అప్పగించండి.

`బకాయిల నిజాలు నిగ్గు తేల్చండి.

`ప్రభుత్వం నుంచి రూపాయి డిపాజిట్‌ లేకుండా వడ్లు పొందేది మిల్లర్లు.

`బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా అమ్ముకుంటోంది మిల్లర్లు.

`ప్రభుత్వం రైతులకు వెంటనే డబ్బులు ఇస్తోంది.

`నాలుగు రోజులలో రైతుల ఖాతాలలో సొమ్ము జమచేస్తోంది.

`ఇలా రెండు రకాలుగా ప్రభుత్వ సొమ్ము కరిగిపోతోంది.

`మిల్లర్లు మింగిన సొమ్ము ప్రభుత్వ ఖజానకు రాకుండాపోతోంది.

`మిల్లింగ్‌ చేస్తామని మిల్లర్లు తీసుకునే వడ్లు మింగేస్తున్నారు.

`వరంగల్‌ మిల్లర్లు పిత్తపరిగెలే!

`ఇతర జిల్లాల్లో తిమింగలాలున్నాయి.

`నష్టపోతున్నామని మిల్లర్లు నాటకాలాడుతున్నారు.

`వేల కోట్ల ప్రజాధనం అప్పనంగా మింగి నంగి వేషాలేస్తున్నారు.

`ప్రభుత్వం ఉదాసీనతను ఆదాయమార్గం చేసుకున్నారు.

`అధికారుల అలసత్వాన్ని అలుసుగా తీసుకున్నారు.

`లంచావతారులను చేతుల్లో పెట్టుకున్నారు.

`జిల్లాల అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారు.

`కోట్లకు పడగలెత్తుతున్నారు.

`అమాయకులమని మాట్లాడుతున్నారు.

`ప్రభుత్వం వడ్లు ఇస్తున్నది నిజం.

`బియ్యం ప్రభుత్వానికి ఇవ్వడం లేదన్నది వాస్తవం.

`తిరిగి ప్రభుత్వానికి చేరాల్సిన బియ్యం మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు.

`అధికారులు లెక్కలు చూడరు.

`మిల్లర్లు వాస్తవాలు చెప్పరు.

`ఏక కాలంలో మిల్లర్లపై దాడులు చేస్తే కోట్ల రూపాయలు ఖజానుకు చేరుతాయి.

`ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు నిధులందుతాయి.

`ఇంకా ఆలస్యం చేస్తే వేల కోట్లు లక్షల కోట్ల బకాయిలౌతాయి.

`రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల బాగోతాలు వరుస కథనాలు మీ నేటిధాత్రిలో త్వరలో ఎక్స్క్లూజివ్‌ గా

 

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి.

జమ్మికుంట: నేటిధాత్రి
కొండా లక్ష్మణ్ బాపూజీ 12 వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇంగిలే రామారావు మాట్లాడుతూ క్విట్ ఇండియా పోరాటం, గైర్ ముల్కి ఆందోళన తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ సాధన కోసం పదవులు సైతం వదులుకొని మలిదశ ఉద్యమానికి మార్గదర్శకoగ నిలిచిన వ్యక్తి అని కొనియాడారు .తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన ప్రముఖ సామాజికవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది నిబద్ధత కలిగిన రాజకీయవేత్త స్వాతంత్ర సమరయోధులు అని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండి సలీం , రమేష్ ,మల్లేష్ ,అశోక్, మహేందర్ ,సమ్మయ్య ,రాజు మురళి తదితరులు పాల్గొన్నారు.

శాయంపేటలో 8 అడుగుల రాకు పైధాన్ పట్టివేత

శాయంపేట నేటిధాత్రి;

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ప్రైమరీ పాఠశాల వెనుకాల చిత్తడిలో సుమారుగా 8 అడుగుల పొడవు బరువు 20 కేజీల వరకు ఉంటుందని హనుమకొండ అడవి శాఖ అధికారికి బిక్షపతి కి సమాచారం ఇవ్వడం జరిగింది ఆ అధికారి పైతానుకు ఎలాంటి కలిగించద్దని అడవి శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం 10 సమయంలో పాఠశాల వెనకాల చిత్తడి నేలల్లో ఉన్న రాకు పైతాన్ ను రాజు శివప్రసాద్ అనే ధైర్యవంతు లైన యువకుల సహాయంతో దానిని జాగ్రత్తగా పట్టి కాట్రపల్లి అడవిలో వదిలివేయడం జరిగింది. అడవి శాఖకు సమాచారం ఇచ్చినచో దానిని జాగ్రత్తగా దానిని పట్టుకుని అడవిలో వదిలి వేయడం జరుగుతుంది ఒకవేళ హాని కలిగించే ప్రయత్నాలుచేస్తే కఠినశిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

కొర్కిశాలలో మాజీ సర్పంచ్ అప్పం మల్లక్క వర్ధంతి వేడుకలు

నివాళులర్పిస్తున్న జర్నలిస్టులు
మొగులపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కశాల మాజీ సర్పంచ్ అప్పం మల్లక్క మొదటి వర్ధంతి వేడుకలను తన భర్త అప్పం భీమయ్య, కుమారులు అప్పం రమేష్, అప్పం సాగర్ లు తన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు అప్పం మల్లక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె కలలు కన్నా కొర్కిశాల గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు యూనియన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు నిమ్మల సారయ్య, జర్నలిస్టులు క్యాతరాజు రజనీకాంత్, చెక్క శ్రీధర్, వేముల కిరణ్ గౌడ్, కట్కూరి ఐలయ్య, నిమ్మల భద్రయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, మొగుళ్ళపల్లి టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, నాయకులు మణికర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు కనీస వేతనం 26 వేలు పెంచాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
నాలుగు లేబర్ కోడుల మూడు నేర చట్టాల సవరణ రద్దు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ స్క్రీ కార్మికులకు కనీస వేతనం 26వేల కై అసంఘటిత రంగ కార్మికులక సమస్యల పరిష్కారం కై శనివారం గుండాల మండలం కాచనపల్లి గ్రామ సెంటర్లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.అనంతరం ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు యనగంటి రమేష్ మాట్లాడుతూ
బిజెపి మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసింది.స్వదేశీ జాతీయత దేశభక్తి పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులను సహజ వనరులను ఖనిజ సంపదను సంస్థలకు అమ్మి వారి ఆస్తులు సంపదను పెంచింది.
కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనులతో సహా అన్ని రకాల గనులను వేలంపాటలు పెట్టి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి వలసవాద చట్టాలను సవరించి పౌరులకు స్వేచ్ఛ సత్వరం న్యాయం చేస్తామని మూడు నేర చట్టాలను సవరించి జూలై 1. 2024 నుండి అమలు చేస్తున్నది ఈ నేరచట్టాలలో 90 శాతం యధాతధంగా ఉంచి పేరు మార్చి సెక్షన్లు మార్చింది. వలసవాద చట్టాల కంటే మరింత ప్రమాదంగా స్వరాధికారాలుగా పోలీస్ యంత్రాంగానికి ఇచ్చింది పౌరుల సంఘాల ప్రశ్నించే గొంతుకల పార్టీలపై ఉక్కు పాదం మోపి అణచివేసే విధంగా ఈ చట్టాలను సవరించింది
ప్రభుత్వ రంగ సంస్థలలో పర్మినెంట్ కార్మికులను తగ్గించి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను నియమిస్తున్నారు.సమాన పనికి సమాన వేతనం లేదు కనీస వేతనం అమలు జరగడం లేదు. ఇతర చట్టబద్ధ హక్కులు లేవు. ఆశ అంగన్వాడి మధ్యాహ్నం భోజనం కేజీబీవీ తదితర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులను వెట్టిచాకిరితో పనిచేస్తున్నారు.వీటన్నిటి అమలుకై ఈనెల 30న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరుగు మహాధర్నకు కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని వాటి అమలుకై పోరాటపటిమను రూపొందించుకొని భవిష్యత్ కార్యాచరణ పోరాటాల ద్వారా సాధించుకునే విధంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచారు.
ఈ కార్యక్రమంలో మోటార్ కార్మికులు మందపురి శ్యామ్,రంగు రాము, పూణెం రమేష్,గ్రామపంచాయతీ కార్మికులు ఎరకల సురేష్,రాపోలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ పై అవగాహనా సదస్సు

నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి కార్యక్రమంలో భాగంగా టాస్క్ పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు టాస్క్ ప్రోగ్రాంలో నమోదు చేసుకొని నేటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పోంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపున్యాలను,వ్యక్తిత్వ వికాసాన్ని , కమ్యూనికేషన్ స్కిల్స్,అలాగే ఎంప్లాయాబిలిటీ స్కిల్స్ ను పెంచుకోవాలని కోరారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు నెగ్గాలంటే తమ స్కిల్స్ ను పెంచుకొనే ఆవశ్యాకత ఎంతైన ఉన్నదనీ, ఇoదుకు టాస్క్ లో తప్పక నమోదు చేసుకొవలనీ కొరారు.టాస్క్ కన్వీనర్ ఎం ఎం కె రహీముద్దీన్ టాస్క్ నమోదుకు సంబందించిన వివరాలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. భైరి సత్యనారాయణ,అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్, మరియు స్టాఫ్ సెకట్రరీ డాక్టర్.ఎం సోమయ్య ,అధ్యాపకులు డాక్టర్ రాంబాబు,డాక్టర్ భద్రు భూక్య, డాక్టర్ జె.రాజీరు, ఎస్.రజిత, ఆర్.రుద్రాణి, డాక్టర్ డి.సంధ్య,డాక్టర్.బి.గాయత్రి, ఆర్.గణేష్, డాక్టర్.వి.పూర్ణచందర్, బి.వీరన్న, నిజాము, బి.రమేష్, బి.గ్లోరి, ఆర్.మాధవి, జి.అనిత, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version