మానవత్వంచాటిన వర్ధన్నపేట ఎస్సై

వరంగల్ రూరల్ జిల్లా,నేటిధాత్రి: రోడ్డు ప్రమాదానికి గురైన బాదితులను పోలీసు వాహనం లో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు ఎస్సై వంశీ కృష్ణ.వివరాల్లోకి వెళితే జిల్లాలోని వర్దన్న పేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనం ను కారు ఢీ కొట్టింది .ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వున్న దంపతులు తో పాటు మూడు సంవత్సరాల బాలుడుకి గాయపడ్డారు.కాగా దంపతులో మహిళ తీవ్ర కడుపునొప్పితో(మహిళ గర్భవతి) బాధ పడుతుండటంతో ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ…

Read More

పాత్రికేయుల సేవలు అమూల్యం…!

కరోనా సంక్షోభం నుంచి పాత్రికేయులను కాపాడుకోవాలి పలువురికి సరుకులు అందించిన టిఆర్ఎస్ యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్ కరోనా వైరస్ యావత్తు మానవాళిని గడగడలాడిస్తున్న నేపథ్యంలో పాత్రికేయుల సేవలు అమూల్యమైనవని టిఆర్ఎస యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్ అన్నారు. బుధవారం హన్మకొండ జడ్పీ గెస్ట్ హౌజ్ ఆవరణలోలో వరంగల్ నగరంలోని పలువురు పాత్రికేయులకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా వీరేందర్ మాట్లాడుతూ…కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో మీడియా…

Read More

చివరి శ్వాస వరకు పేదల సేవకే అంకితం

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ సిటి నేటిధాత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 25 వేల మంది పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో బాగంగా సీకేఎం కళాశాల మైదానంలో ప్రారంభమైంది ఈ సందర్భంగా 1,12,29 డివిజన్లకు చెందిన 2200 మంది పేదలకు ప్రముఖుల చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో ప్రజలకు సేవ…

Read More

త్వరలోనే లబ్దిదారులకు అందిస్తాం , కేటీఆర్

పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్   హైదరాబాద్,నేటిదాత్రి: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి లబ్దీదారులకు అందిస్తామని రాష్ట్ర పురపాలక,ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం బెడ్ రూమ్ ఇళ్ల కార్యక్రమం పైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం మంత్రులు కేటిఆర్,వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి నగర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,…

Read More

అవగాహనతోనే కట్టడి సాధ్యం

వరంగల్,నేటిధాత్రి:అవగాహనతోనే కరోనాను అంతం చేసేందుకు సాధ్యమౌతుందని పరికిపండ్ల అశోక్ అన్నారు.ఆదివారం కరోనా కట్టడికి డాక్టర్ పరికిపండ్ల అశోక్ చేపట్టిన ప్రజా చైతన్య బైక్ యాత్ర 25 వ రోజు, నాల్గవ జిల్లా వరంగల్ అర్బన్ లో భాగంగా వరంగల్ మహానగరం 11 వ డివిజన్ క్రిస్టియన్ కాలని గాంధీ నగర్ లో కరోనా పై అవగాహన సదస్సు మరియు వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే ఉచిత హోమియోపతి మందుల పంపిణీ చేశారు. ప్రజలు, పారిశుధ్య కార్మికులు సుమారు 1200…

Read More

ప్రతిఒక్కరు కారోన నుండి క్షేమంగా బయటపడలి

హైదరాబాద్ శ్రీనిధి కళాశాల రిజిస్టర్ చందా సాంబయ్య వరంగల్ అర్బన్ :- ప్రతిఒక్కరు కారోన వైరస్ ఎదుర్కొని క్షమంగా ఉండాలంటే తమ ఇండ్లలో ఉండటమే సురక్షితమని హైదరాబాద్ శ్రీనిధి ఇనిస్టుట్ సైన్స్ టెక్నోలజీ కళాశాల రిజిస్టర్ చందా సాంబయ్య పిలుపునిచ్చారు వరంగల్ గ్రేటర్ పరిధిలోని 5 వ డివిసన్ బొల్లికుంటా కీ.శే.శ్రీమతి పోగు రామక్క జ్ఞాపకార్ధం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగినది కరోనలాంటి మహామర్రిని పరదోలి పేదలకు పేదలను అందుకోడానికి దాతలు ముందుకు వచ్చి…

Read More

వరంగల్ అజాంజాహి మిల్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం

ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్   నేటిధాత్రి డేస్క్:అజాంజాహి మిల్ గ్రౌండ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు నన్నపునేని నరేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతుతో ఫోన్ లో మాట్లాడి ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు.. అగ్నిమాపక అధికారులు, సిబ్బందితో మరియు ఎలక్ట్రిక్ సిబ్బందితో ఎమ్మెల్యే మాట్లాడారు.. మంటలు ఎలా వ్యాపించాయని…

Read More

కర్ఫ్యూ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

పోలీస్ కమిషనర్ డా రవీందర్ కరోనా వ్యాప్తిని ఆడ్డుకోవడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ హెచ్చరించారు. గురువారం లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రి కర్ఫ్య్ సమయంలో యంజియం పోలీస్ చేకింగ్ పాయింట్ వద్ద అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనాదారులపై పోలీస్ కమిషనర్ అగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను తక్షణమే సీజ్ చేసి కేసులను నమోదు చేయాల్సిందిగా…

Read More

ఇండ్లే పేకాట కేంద్రంగా నడుపుతున్న యాజమానులు

మద్యం సేవిస్తూ పేకాట ఆడుతూ ఎంజాయ్ లీడర్లు, ఫైనాన్స్, మద్యం వ్యాపారులదే హవా ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు *వరంగల్ సిటి నేటిధాత్రి* వరంగల్ నగరంలో పేకాట కేంద్రాలు మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తున్నాయి ఇందుకు ఇంటి యజమానులే ఒక సెటప్ ఏర్పాటు చేసుకొని గ్యాంగ్ గా ఏర్పాటై గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నట్టు సమాచారం అండర్ రైల్వే గేటు ప్రాంతంలో విచ్చలవిడిగా పేకాట కేంద్రాలు ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు నడుపుతున్నారు కరిమాబాద్,ఎస్ ఆర్ ఆర్…

Read More

నిబంధనలు పాటించలేదని పెండ్లి పెద్దలపై కేసు నమోదు

బుగ్గారం, (నేటి ధాత్రి): కరోనా నిబంధనలు పాటించలేదని,పెళ్ళికి 20 మందికి మించి హాజరయ్యారని వధూవరుల తండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి కథనం ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళితే….. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని కొత్త ఎస్సీ కాలనీలో బుధవారం వివాహం జరిగింది. అట్టి వివాహానికి అధికారుల అనుమతి ప్రకారం 20మంది మాత్రమే హాజరు కావాలి. కాని పెండ్లికి 20మందికి మించి హాజరయ్యారని, భౌతిక దూరం పాటించలేదని, మాస్కులు ధరించలేదని…

Read More

బీదలను ఆదుకునేందుకు ముందుకు రావాలి

రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ సుధారాణి వరంగల్ అర్బన్,నేటిధాత్రి: ప్రస్తుత లాక్ డౌన్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్ 24 వ డివిజన్లోని 70 పేద కుటుంబాలకు ది వరంగల్ ఐరన్ మరియు హార్డ్ వేర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆద్వర్యములో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, మాజీ పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కోడం రాజేందర్,…

Read More

సమాధుల స్థలం కబ్జా గృహ నిర్మాణం, నివాసం

ధారాదత్తం చేసిన భూములు కబ్జా సమాధుల స్మశాన వాటిక గా వాడకం సమాధులపై ఇంటిని నిర్మించుకున్న *బాలాజీ* నివాసం.. పిర్యాదు చేసినా పట్టింపులేని అధికారులు మా స్థలాన్ని మాకివ్వండి *గట్టు* పట్టుదల   వరంగల్ సిటి నేటిధాత్రి అదొక సమాధులు నిర్మాణం చేసుకున్న స్థలం పవిత్రంగా భావించే ఆ స్థలంలో సమాధులు నిర్మించుకొని ఆలయంగా భావించే సమాధుల పై ఓ ఘనుడు కన్నేసి ఏకంగా గృహ నిర్మాణమే చేపట్టాడు వివరాల్లోకి వెలితే గత 70 సంవత్సరాల క్రితం…

Read More

ఎర్రబెల్లి సొంత గ్రామంలో ధాన్యం తగులబెట్టిన రైతులు

కొనుగోలులో జాప్యం,కాంటాలో అక్రమాలే కారణం   వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు వరి ధాన్యాన్ని తగలబెట్టారు. తమ ఇబ్బందులను సంబంధిత ఆఫీసర్లు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెల రోజుల నుంచి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 500 మందికి టోకెన్ ఇప్పటికీ 120 మందికి మాత్రమే కాంటాలు నిర్వహించారని ఇక్కడ బస్తా కు నలభై రెండు…

Read More
error: Content is protected !!