గ్రామాలలో ప్రతినెల 30న పౌర హక్కుల దినోత్సవం జరపాలి.

గ్రామాలలో ప్రతినెల 30న పౌర హక్కుల దినోత్సవం జరపాలి.

తహసిల్దార్ కి వినతి పత్రం అందజేత.

అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

శనివారం టేకుమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ మారపల్లి కొమురయ్య ఆధ్వర్యంలో ప్రతినెల 30న గ్రామాలలో పౌర హక్కుల ( సివిల్ రైట్స్ డే) దినోత్సవాన్ని జరపాలని అంబేద్కర్ ఫెలోషి ప్ నేషనల్ అవార్డు గ్రహీత రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య తహసిల్దార్ విజయలక్ష్మి కి వినతి పత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతినెల 30న గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవం సంబంధించిన అధికారులు జరుపుతున్నారు . ఈ పౌర హక్కుల దినోత్సవం లో గ్రామ సర్పంచి వార్డ్ మెంబర్లు వివిధ కులాల ప్రజలు ఇందులో పాల్గొనే విధంగా చూడాలని ముఖ్యంగా సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని అన్నారు ఎస్సీలు ఎదుర్కొంటున్న అంటరానితనం కుల వ్యవస్థ మూఢనమ్మకాలు అస్పృశ్యత అను అంశాలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నారు .దేశ రాష్ట్రవ్యాప్తంగా పౌర హక్కుల దినోత్సవం రోజు అధికారులు కొందరు తూతూ మంత్రంగా జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాలలో ఇంకా కుల వ్యవస్థ అంటరానితనం కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వాలు అధికారులు ఈ కుల వ్యవస్థ జరిగిన గ్రామాలలోని వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పౌర హక్కుల దినోత్సవం నిర్వహించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధించిన అధికారులను డిమాండ్ చేశారు. లేని యెడల దళిత సంఘాల తో కలిసి దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ అరకొండ రాజయ్య అంబేద్కర్ వాదులు గోదా బిక్షపతి అరకొండ రాకేష్ తదితరులు పాల్గొన్నారు

టీబీజీకేఎస్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా…

టీబీజీకేఎస్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయకులు

సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డును వెంటనే అమలు చేయాలి

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టిబిజికేఎస్ సంఘం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి,టీబీజీకెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి,వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి టిబిజికెఎస్ నాయకులు, బడిదల సమ్మయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత బిఆర్ఎస్ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలకు చట్టబద్దత లేని సమయంలో, 115 మెడికల్ బోర్డుల ద్వారా 13,119 మంది కార్మిక బిడ్డలకు కారుణ్య నియామకాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది.
నేటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏడాది కాలంగా (మార్చి 2025 నుండి) ఒక్క మెడికల్ బోర్డు కూడా నిర్వహించకుండా 2000 మంది అనారోగ్యంతో ఉన్న కార్మికుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం అడుతుంది.

సింగరేణిలో ఇచ్చిన గ్యారంటీలు నెలకు 3 మెడికల్ బోర్డులు నిర్వహిస్తామన్న ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కడం అన్యాయం.
వారసత్వ ఉద్యోగాల వల్ల సింగరేణి కుంటుపడిందని చెప్పడం అబద్దం! ప్రభుత్వం చెల్లించాల్సిన 50 వేల కోట్ల బకాయిల వల్లే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
మారు పేర్ల విజిలెన్స్ అంశం పై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి.అక్టోబర్ 2025 నుండి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డిపెండెంట్లకు ఉద్యోగ నియమక పత్రలు వేంటనే ఇవ్వాలి.
బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైకరి నశించాలి..
తెలంగాణ బొగ్గు గణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ సంఘం పిలుపునిచ్చారు

లింగంపేట సర్పంచ్ కు సన్మానం…

లింగంపేట సర్పంచ్ కు సన్మానం

జడ్చర్ల /నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని లింగంపేట గ్రామంలో సర్పంచ్‌గా ఎన్నికై.. కేవలం 3 నెలల వ్యవధిలోనే..పలు అభివృద్ధి పనులతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తున్న గ్రామ సర్పంచ్ బాలును గ్రామ ప్రజలు శాలువాతో శనివారం సన్మానించారు. పలు వార్డులో ఏళ్ల తరబడి రోడ్డు, అండర్ డ్రైనేజీ సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించిన బాలు వెంటనే చర్యలు తీసుకుని ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పవన్ కుమార్ , నాగరాజ్ , అమృత తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలి…

మెడికల్ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలి…

టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

సింగరేణిలో యధావిధిగా మెడికల్ బోర్డు నిర్వహించాలని, నిలిచిపోయిన మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ డిమాండ్ చేశారు.శనివారం టీబీజీకేఎస్ యూనియన్, బిఆర్ఎస్ నాయకులు కలిసి రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ మధు కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్ మాట్లాడారు. ఏసీబీ విచారణ పేరుతో మెడికల్ బోర్డును నిలిపివేయడం సరికాదని అన్నారు. ఏసీబీ, విజిలెన్స్ పేరిట మెడికల్ బోర్డును కాలయాపన చేయడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వ తీరును కార్మిక లోకమంతా గమనించాలన్నారు .ప్రభుత్వం స్పందించి వెంటనే మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 30న అన్ని ఏరియా ల జిఎం కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కృష్ణ, సురేష్, దబ్బేటి సంతోష్,బిఆర్ఎస్ నాయకులు రామిడి కుమార్, జాడీ శ్రీనివాస్,మహేందర్ రమేష్, రామిడి లక్ష్మీ కాంత్ చంద్రకిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఉడిత్యాలలో ప్రీ-ప్రైమరీ చిన్నారులకు దుస్తుల పంపిణీ.

ఉడిత్యాలలో ప్రీ-ప్రైమరీ చిన్నారులకు దుస్తుల పంపిణీ.

 

జడ్చర్ల/నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలో శనివారం ద్వాక్రా మహిళా సంఘం ఆధ్వర్యంలో.. ప్రీ-ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సువర్ణ ముఖ్యంగా పాల్గొని చిన్నారులకు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చక్కెర శ్రీధర్ గౌడ్ డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

వాహనాలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ చర్యలు.

 

వాహనాలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ చర్యలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలోని పండ్ల దుకాణాలను రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులను రోడ్డుపై జరుగుతున్న యాక్సిడెంట్లను దృష్టిలో ఉంచుకొని వాహనదారుల రాకపోకలకు ఆటంకాలు రాకుండా రోడ్డుకు దూరంగా పెట్టాలని ఒక మార్కును నియమించి ఆ మార్కు బయట పెట్టవద్దని సూచించారు. మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

వారంరోజుల పాటు వన్ వే ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ నెమ్మదిగా వెళ్లాలి…

వారంరోజుల పాటు వన్ వే ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ నెమ్మదిగా వెళ్లాలి

దామెర ఎస్సై కొంక అశోక్ సూచన

పరకాల,నేటిధాత్రి

 

పరకాల నియోజకవర్గం దామెర మండల పరిధిలోని ఊరుగొండ నుండి ఎన్ఎస్ఆర్ హోటల్ వరకు జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మతు పనులు నేటి నుండి ప్రారంభమయ్యాయి.ఈ పనులు వారం రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.రోడ్డు పనుల దృష్ట్యా ఈ మార్గంలో వన్-వే విధానం అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఈ క్రమంలో వాహనదారులు ఓవర్‌టేకింగ్ చేయకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.దామెర ఎస్సై కొంక అశోక్ మాట్లాడుతూ,రోడ్డు పనుల సమయంలో ప్రమాదాలు జరగకుండా వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.ప్రత్యేకంగా ఊరుగొండ మార్గంలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండి,సూచించిన మార్గదర్శకాలను పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుందని పోలీసులు తెలిపారు.ప్రజల భద్రత దృష్ట్యా చేపట్టిన ఈ చర్యలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Kishan Reddy’s Memorable Service as Minister for Mines

• Active in politics since his student days…
• Held key positions within the BJYM
• Experience serving as the State Party President for both undivided Andhra Pradesh and Telangana
• Elected to the Legislative Assembly three times and to Parliament twice
• Aims to introduce Artificial Intelligence (AI) into the mining sector
• Played a pivotal role in the development of Secunderabad railway station and AIIMS facilities in Bibinagar
• Spearheaded the construction of RoBs (Road Over Bridges) within his constituency
• Instrumental in securing the sanction for the Regional Ring Road
• Kishan Reddy: Delivering effective service with quiet dedication
Gangapuram Kishan Reddy currently serves as the Union Minister for Coal (the 25th Minister to hold this portfolio) and Mines (the 45th Minister). Representing the Secunderabad Parliamentary constituency in the Lok Sabha, he is a prominent leader of the Bharatiya Janata Party (BJP) in Telangana. Previously, he served as the Union Minister for Tourism, Culture, and Development of the North Eastern Region from 2021 to 2024. Similarly, he served as the Union Minister of State for Home Affairs from 2019 to 2021. Prior to his parliamentary career, he was elected as a Member of the Legislative Assembly (MLA) from the Amberpet constituency on a BJP ticket on three occasions. He also served as the President of the Telangana BJP.
He was born on June 15, 1960, in Timmapur, Ranga Reddy district. His father’s name is Swamy Reddy, and his mother’s name is Andallamma. Kishan Reddy is married to Kavya Reddy; the couple has one son and one daughter. He completed a Diploma in Tool Design course from CITD. He has been actively involved in politics since his student days, beginning in 1977. Since the inception of the Bharatiya Janata Party (BJP) in 1980, he has served as a full-time member, eventually rising to the rank of a Union Minister today. From 1982 to 2001, he held various positions within the Bharatiya Janata Party Yuva Morcha (BJYM). During the years 2001–02, he served as the Treasurer, Official Spokesperson, and In-charge of the State BJP Headquarters for Andhra Pradesh. From 2002 to 2005, he served as the National President of the BJYM. He represented the Himayatnagar constituency in the Legislative Assembly in 2004, and the Amberpet constituency in 2009 and 2014. Between 2010 and 2014, he was unanimously elected as the President of the BJP for the united state of Andhra Pradesh, and subsequently, following the formation of Telangana state, he was again elected as the BJP President. In the 2019 and 2024 Lok Sabha elections, he achieved victory with a massive majority from the Secunderabad constituency. On January 19, 2012, he undertook a Padayatra (foot march) spanning 3,500 kilometers, titled the “Telangana Poru Yatra.” His foot march traversed a total of 986 villages and 88 Assembly constituencies. He undertook this struggle-march with the specific objective of achieving the formation of a separate Telangana state. It is noteworthy that this march was flagged off by Nitin Gadkari.
Currently serving as the Union Minister for Coal and Mines, he is taking several pivotal steps forward. He is implementing measures to ensure the transparent auction of lithium mines—a resource that has become critically important to the nation’s economy. Furthermore, he urged the states to extensively utilize drones and artificial intelligence within the mining sector. He is striving to achieve self-reliance in energy resources by boosting domestic coal production and reducing dependence on foreign imports. While serving as a Union Minister, he focused special attention on the modernization of the Secunderabad Railway Station and the development projects for AIIMS in Bibinagar.
In his dual capacity as a Union Minister and the Member of Parliament for Secunderabad, he undertook several key initiatives. Development works for the Secunderabad Railway Station were initiated with an outlay of ₹700 crore; upon completion, the station is set to feature amenities comparable to those found in airports. To alleviate traffic congestion within his constituency, funds have been sanctioned for the construction of railway overbridges (ROBs)—such as the one at Chiralagadda—and various underpasses. He played a pivotal role in securing approval from the Central Government for the construction of the Regional Ring Road (RRR), a project regarded as a crowning jewel for the state of Telangana. Additionally, he is actively working towards the modernization of lakes and water bodies across the twin cities under various Central Government schemes.
Under the ‘PRASAD’ scheme, funds were allocated for the development of pilgrimage sites in Telangana, such as the Ramappa Temple and Bhadrachalam. His efforts were instrumental in securing UNESCO recognition for the Ramappa Temple. Currently, in his capacity as the Minister for Mines, he is providing the necessary impetus for the extraction of lithium. If this mineral is found in abundance, the nation can achieve self-reliance in the electric vehicle sector. He is also actively encouraging start-ups that are pioneering new innovations within the mining and coal sectors. To this end, substantial assistance is being provided to them in the form of grants. Plans are being formulated not only to boost state government revenues through the auction of coal mines but also to generate employment opportunities for thousands of people.
On behalf of the Central Government, Kishan Reddy has initiated numerous projects aimed at developing civic infrastructure within the Secunderabad Cantonment area and fostering the growth of Hyderabad’s IT sector. Kishan Reddy successfully secured approval from the Union Ministry of Defence, allowing the land compensation funds provided by the State Government for the construction of elevated corridors (amounting to approximately ₹303.62 crores) to be utilized directly by the Cantonment Board (SCB) for civic works. From these funds, ₹128 crores are currently being utilized to construct an underground drainage system, as well as stormwater drains at Patny and Rasoolpura. The Central Government has issued a notification regarding the renovation of internal roads within the Cantonment limits and the process of integrating the Cantonment area into the GHMC. This initiative is expected to lead to further improvements in civic amenities. A proposal for an additional special allocation of ₹18 crores for basic infrastructure development is currently under review by the Union Ministry of Defence.
A Model ITI (Industrial Training Institute) center has been established in Mallepally at a cost of ₹10 crore to train the youth in alignment with the requirements of the IT industry. Through the ‘Vikasit Bharat Entrepreneurs Network,’ training and financial assistance are being provided to encourage both rural and urban youth to launch IT startups. The incentives and infrastructure facilities provided by the Central Government played a pivotal role in achieving export revenues of approximately ₹1.45 lakh crore during the last financial year through the ‘Software Technology Parks of India’ (STPI) in Hyderabad. Kishan Reddy urged IT companies to aim for global leadership in Artificial Intelligence (AI) and product innovation, ensuring that the IT industry is not confined solely to coding. Kishan Reddy further stated that the three high-speed corridors originating from Hyderabad—connecting to Pune, Bengaluru, and Chennai—would provide a significant boost to the IT and Pharma sectors.

పార్టీ ని అధికారంలోకి తేలేరు… వారికి పదవులు లేకపోతే ఓర్చుకోలేరు!

`కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల వింత ధోరణి!

`అదినుంచి అంతే.. పార్టీలో పెద్దలుగా పాతుకుపోయారంతే.

`అధికారం లేనప్పుడు పార్టీ పదవులన్నీ మాకే కావాలంటారు.

`అధికారం లోకి వస్తే ప్రభుత్వంలో మేమే ఉంటామంటారు.

`కొత్త వారు ఎదుగుతుంటే చూడలేరు.

`వారి వారసత్వలకు దారులు వేస్తుంటారు.

`గత 50 ఏళ్లుగా పదవులను అనుభవిస్తూనే వున్నారు.

`గోడలు దుంకి పోయి మళ్ళీ చేరి పెత్తనం చేస్తున్న వాళ్ళున్నారు.

`పార్టీ ని బలోపేతం చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి మీద అబండాలు వేస్తున్నారు.

`పార్టీ కి తీరని అన్యాయం చేస్తున్నారు.

`40 సంవత్సరాలు జీవన్ రెడ్డికి అన్ని అవకాశాలు ఇచ్చారు.

`రెండు సార్లు ఓడిపోయి కూడా పెత్తనం నాకే అన్నాడు.

`తన కూతురు రాజకీయం కోసం పార్టీ ని ఇబ్బంది పెట్టారు.

`కొత్త నాయకత్వం జగిత్యాల లో ఎదగకుండా చేశారు.

`ద్వితీయి శ్రేణులను చెప్పు చేతుల్లో పెట్టున్నాడు.

`ఇలా పార్టీ ప్రయోజనం కన్నా సొంత ప్రయోజనం పొందారు.

`పార్టీ కి 40 ఏళ్ళు సేవ చేశానని గొప్పలు చెప్పుకున్నాడు.

`పార్టీ బుజ్జగించినా లెక్క చేయలేదు.

`పార్టీ లోనే వుండి సిఎం రేవంత్ రెడ్డి మీద పదే పదే ఆరోపణలు చేశారు.

`ఇంత కాలం రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీ మీద అబండాలు వేస్తున్నాడు.

`రాజీనామా చేసి గొప్ప పని చేసినట్లు చెప్పుకుంటున్నాడు.

 

హైదరాబాద్, నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎంత నష్టమో తాజాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని చూస్తే అర్దమౌతుంది. చెప్ప్పులోని రాయి, చెవిలోని జోరిగ అన్నట్లు నిత్యం పార్టీని తూర్పార పట్టే వాళ్ల వళ్ల నష్టమే గాని, లాభం వుండదు. కేవలం సీనియర్లయినంత మాత్రాన అడిగిన పదవి ఇవ్వాలి. తమకే ప్రాదాన్యత పదే పదే దక్కాలని కోరుకోవడం కూడా సరైంది కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చి, రేవంత్‌సర్కారు ఏర్పడిన నాటి నుంచి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిత్యం ఏదో కుంపటి రగిల్చుతూనే వస్తున్నారు. అయినా సిఎం. రేవంత్ రెడ్డి ఉపేక్షిస్తూ పోతున్నారు. జీవన్‌రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా సమాదానం చెప్పకుండా ఆయనపై వున్న గౌరవాన్ని నిలుకుంటూనే వున్నారు. ఆ మాత్రం కూడా అర్దం చేసుకోకుండా జీవన్‌రెడ్డి పదే పదే పార్టీని, ప్రభుత్వాన్ని తప్ప్పు పడుతూ వస్తునే వున్నారు. నిజం చెప్పాలంటే జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే పుట్టిన నాయకుడు కాదు. కాంగ్రెస్‌లోనే రాజకీయం మొదలు పెట్టిన నాయకుడు కాదు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన అన్యాయం జరిగింది ఏనాడు లేదు. ఇప్పటి వరకు ఆయన పార్టీ టికెట్ ఇవ్వకుండా వున్నది లేదు. గత ఎన్నికల్లో కూడా ఆయనకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సిఎం. రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో జగిత్యాలకు వెళ్లి స్వయంగా ప్రచారం నిర్వహించారు. జీవన్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. జీవన్‌రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. అయినా జీవన్‌రెడ్డి గెలవలేవు. నిజంగా జీవన్‌రెడ్డి అంత బలవంతుడే అయితే వరసగా రెండు సార్లు ఓ{మి పాలయ్యారు. 2018, 2023లోనూ ఓడిపోయారు. 2018లో ఓడిపోయినా మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిపించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఆయనను గౌరవించింది. తర్వాత మళ్లీ ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీగా వున్న జీవన్‌రెడ్డికే పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ ఎంతో ప్రచారం చేసింది. నాయకులు, కార్యకర్తలు విసతంగా ప్రచారం చేశారు. సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు. ఇంత చేసినా జీవన్‌రెడ్డి ఓటమి పాýయ్యారు. ఇవే నాకు ఆఖరు ఎన్నిÅ£లు, మళ్లీ నేను ఎన్నికల్లో పోటీ చేయను అని కూడా జీవన్‌రెడ్డి సెంటి మెంటు ప్రయోగించారు. అయినా జగిత్యాల ప్రజలు కనికరించలేదు. జీవన్‌రెడ్డిని గెలిపించలేదు. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికý అభ్యర్దుల విషయంలోనూ జీవన్‌రెడ్డినే ముందు సిఎం. రేవంత్ రెడ్డి సంప్రదించారు. తనకు వద్దని జీవన్‌రెడ్డి చెబితేనే ఆల్‌ఫోర్స్ అధినేతకు ఆ సీటు కేటాయించారు. ఇలా పార్టీ అనేక సార్లు, అనేక అవకాశాలు ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవన్‌రెడ్డికి ఇచ్చినన్ని సార్లు అవకాశాలు సీనియర్ నేతల్లో ఏ ఒక్కరికీ దక్కలేదు. ఇప్పటి వరకు జీవన్‌రెడ్డికి పార్టీ 12 సార్లు బిఫామ్‌లు ఇచ్చింది. అందులో ఆరు సార్లు గెలిచారు. ఆరు సార్లు ఓడిపోయారు. అయినా పార్టీ ఆయనను గౌరవిస్తూనే వుంది. కాంగ్రెస్ పార్టీ గాలిలో గెలిచిన ప్రతీసారి జీవన్‌రెడ్డికి మంత్రి పదవి కూడా ఇస్తూ వచ్చారు. పైగా తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న తరుణంలో జీవన్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. కేసిఆర్ కరీంనగర్‌లో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లినప్ప్పుడు కాంగ్రెస్ అభ్యర్దిగా పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. నాడు వైఎస్ చెప్పినట్లు చేశాడు. తెలంగాణ వ్యతిరేక శక్తులతోనూ చేతులు కలిపారు. ఇప్ప్పుడు నీతి సుద్దులు చెబుతున్నారు. తనకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నారు. ఆఖరుకు పార్టీ కి చెందిన పెద్దలంతా కలిసి వచ్చి బుజ్జగించినా సరే వీరయోధుడులాగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తెలంగాణ వాదం లేదని నిరూపించాలని చూసిన జీవన్‌రెడ్డిని ఆనాడు తెలంగాణ సమాజమంతా చీ కొట్టింది. ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా వెళ్లొద్దని సూచించింది. అయినా ఆయన ఆగలేదు. తెలంగాణ 2009 ప్రకటన వచ్చిన తర్వాత కూడా జీవన్‌రెడ్డి జై తెలంగాణ అన్న సందర్భాలు లేదు. మంత్రి పదవి వుంటే చాలు అనుకున్నారు. మంత్రి పదవిని త్యాగం చేసేందుకు కూడా ఇష్టపడలేదు. ఉమ్మడి కరీంనగర్ అంతా జై తెలంగాణ నినదిస్తుంటే కళ్లుండి చూడలేదు. చెవులుండి వినలేదు. తెలంగాణ ఉద్యమానికి సహకరించలేదు. ఆనాడు సీమాంద్రులంతా ఒక్కతాటి మీదకు వచ్చి, సమైక్య వాదం వినిపిస్తుంటే కూడా వారిని వారించలేదు. జై తెలంగాణ అని గొంతు సవరించుకోలేదు. నాడైనా, నేడైనా సరే ఆయన పదవి కోసమే రాజకీయాలు ఆది నుంచి చేస్తూనే వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి గెలిచిన జీవన్‌రెడ్డి కొద్ది రోజులకే ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచారు. నాడు నాదేండ్ల వర్గంలో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. 1985 ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్నారు. తర్వాత దిక్కులేక కాంగ్రెస్‌లో చేరారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయనను నెత్తిన పెట్టుకుంటూనే వస్తోంది. ఆనాడు రెండే పార్టీలు. కాంగ్రెస్‌ను కాదని తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేలేకు వున్నారేగాని, మరో పార్టీ వుంటే ఏనాడో ఆయన పార్టీమారేవారేమో! ప్రతిపక్షంలో వున్నా, పాలకపక్షంలో వున్నా ఆయనకు పదవి మాత్రం కావాలి. నలభై ఏళ్లుగా ఆయన జగిత్యాలను తన అడ్డాగా చేసుకొని, ఇతర నాయకులకు ఎదకుండా చేసుకున్నారు. వ్యతిరేకంగా ఎవరూ ఎదగకుండా చేశారు. తన చెప్ప్పుచేతుల్లో వున్న నాయకులకు చిన్న చిన్న పదువులు ఎర వేసి, వారికి తానే రక్ష అనేలా రాజకీయం చేశారు. జగిత్యాలలో గత ఎన్నికల్లో జీవన్‌రెడ్డికి పోటీగా ఎవరూ కాంగ్రెస్‌లో ధరఖాస్తు చేసుకోలేదంటే పార్టీని ఆయన ఎంత బలహీనంగా మార్చారో అర్దం చేసుకోవచ్చు. నల్లగొండ జిల్లాలోనే బలమైన నాయకులైన కోమటిరెడ్డి కుటుంబాలకు వ్యతిరేకంగా కూడా నాయకులు తమకు అవకాశం కల్పించాలని పార్టీకి ధరఖాస్తులు చేసుకున్నారు. కాని జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎవరూ ధరఖాస్తు చేసుకోలేదు. అంతగా పార్టీని తన చెప్ప్పుచేతుల్లో పెట్టుకొని కూడా ఈ మధ్య గాయ్‌గాయ్ చేయడం మొదలు పెట్టారు. తన సీటునే తాను గెల్చుకోలేకపోయిన జీవన్‌రెడ్డి పార్టీకి నేనే దిక్కు అనేంత స్ధాయి మాటలు మాట్లాడడం విడ్డూరం. కేవలం తన కూతురు రాజకీయం కోసం పార్టీని కబ్జా చేసినంతగా మాట్లాడడం కూడా సరైంది కాదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో కి రావడం ఆయన సుతారం ఇష్టం లేదు. రెండుసార్లు వరుసగా సంజయ్ చేతిలో ఓడిపోయిన జీవన్‌రెడ్డి స్వచ్చందంగా తప్ప్పుకోవాల్సిన వయసు. కాని ఇంకా నేనే వుంటాను. నేనే మోనార్క్‌ని అన్నట్లు మాట్లాడి, ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తుంటే ఏ పార్టీ అయినా ఎందుకు ఊరుకుంటుంది. పైగా సిఎం. రేవంత్‌రెడ్డి ఎంత కష్టపడితే పార్టీ అదికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. జీవన్‌రెడ్డికి కూడా తెలుసు. తెలంగాణ ఇచ్చినా పదేళ్లపాటు అదికారంలోకి రాకుండా నానాటికీ తీసికట్టులా మారుతున్న పార్టీని గట్టెక్కించిన నాయకుడు సిఎం. రేవంత్‌రెడ్డి. తన సర్వశక్తులు ఒడ్డి, పార్టీని బలోపేతం చేసి, అప్పటి పాలకులను ఎదిరించి అనేక పోరాటాలు చేశారు. జైలు జీవితం అనుభవించారు. మూడేళ్లపాటు సిఎం. రేవంత్‌రెడ్డి పడని కష్టం లేదు. పడని ఇబ్బంది లేదు. పార్టీ బలోపేతానికి కాలుకు బలపం కట్టుకొని తి రిగినట్టు తిరిగారు. ప్రజల్లో నమ్మకం కలిగించారు. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తీసుకొచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీకి కతజ్ఞత చూపించే బాధ్యత మన తెలంగాణది అని సెంటిమెంటు రగిలించారు. ఇలా అన్ని అనువైన అవకాశాలను అందిపుచ్చుకొని జనం మెప్ప్పు సాధించి కాంగ్రెస్‌పార్టీని అదికారంలోకి తెచ్చారు. ప్రజా వ్యతిరేకత లేకుండా, రాకుండా చూసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అలాంటి పాలనపై, సిఎం. రేవంత్‌రెడ్డిని నిత్యం విమర్శలకు గురిచేస్తూ వుండడం జీవన్‌రెడ్డి చేసిన అతి పెద్ద తప్ప్పు. పార్టీని గట్టెక్కించలేని నాయకత్వం జీవన్‌రెడ్డిది. తనకు తాను కూడా గెలవలేని పరిస్దితి వుంది. అయినా నలభై ఏళ్లపాటు సుథీర్ఘ క్రియాశీల రాజకీయాలు చేసినా ఇంకా ఆయనకు రాజకీయం మోజు తగ్గలేదు. పదవుల మీద ఆశ చావలేదు. అలాంటి వారిని ప్రజలు , పార్టీ ఎంత కాలం భరిస్తుంది. పొగ పె ట్టుకున్నాడో, పెగ పెడుతున్నారని అనుకున్నాడో మొత్తానికి జీవన్‌రెడ్డి జారుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి తగ్గించారు.

గనులశాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి గుర్తుండిపోయే సేవలు

· విద్యార్థి దశనుంచే చురుగ్గా రాజకీయాల్లో…
· బీజేవైఎంలో కీలక పదవుల నిర్వహణ
· ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం
· మూడుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు పార్లమెంట్‌కు ఎన్నిక
· మైనింగ్ రంగంలో కత్రిమేధను ప్రవేశపెట్టాలన్న లక్ష్యం
· సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బీబీనగర్ ఎయిమ్స్ అభివద్ధిలో కీలకపాత్ర
· నియోజకవర్గంలో ఆరఓఆర్‌ల నిర్మాణాలు
· రీజినల్ రింగ్‌రోడ్డు మంజూరులో కీలక పాత్ర
· నిశ్శబ్దంగా సమర్థ సేవలందిస్తున్న కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నేటిధాత్రి:
గంగాపురం కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేంద్ర బొగ్గు (25వ మంత్రి) మరియు గనులశాఖ (45వ మం త్రి) మంత్రిగా కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన భారతీయ జనతాపార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర కీలక నేత. గతంలో ఆయన కేంద్ర పర్యాటÅ£, సాంస్కతిక, ఈశాన్య రాష్ట్రాల అభివద్ధి శాఖ మంత్రిగా (2021`24) మధ్యకాలంలో పనిచేశారు. అదేవిధంగా 2019`21 మధ్యకాలంలో కేంద్ర ీVAంశాఖ సహాయమంత్రిగా సేవలందించారు. గతంలో ఆయన అంబర్‌పేట్ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో 1960, జూన్ 15న జన్మించారు. తండ్రిపేరు స్వామిరెడ్డి, తల్లి ఆండాళ్లమ్మ. కిషన్‌రెడ్డి, కావ్యారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమా ర్తె వున్నారు. సీఐటీడీ నుంచి డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ కోర్సును పూర్తిచేశారు.
విద్యార్థి దశ అంటే 1977 నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాý£్గనేవారు. 1980లో భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నుంచి పూర్తిస్థాయి సభ్యుడిగా కొనసాగుతూ నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. 1982 నుంచి 2001 వరకు భారతీయ జనతాపార్టీ యువమోర్చా (బీజేవైఎం)లో వివిధ పదవులు నిర్వహించారు. 2001`02 సంవత్సరంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కోశాధికారిగా, అధికార ప్రతినిధిగా, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. 2002నుంచి 2005 వరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు. 2004లో హిమయత్‌నగర్ నుంచి, 2009, 2014 సంవత్సరాల్లో అంబర్‌పేట స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2010`14 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2012జనవరి 19న ఆయన తెలంగాణ పోరు యాత్ర పేరుతో 3500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించారు. మొత్తం 986 గ్రామాలు, 88 అసెంబ్లీ నియోజకవరాల్లో ఆయన పాదయాత్ర కొన సాగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఆయన ఈ పోరుయాత్ర జరిపారు. ఈయాత్రను నితిన్ గడ్కరీ ప్రారంభించడం గమనార్హం.
ప్రస్తుతం కేంద్ర u£గ్గు మరియు గనుల మంత్రిగా పనిచేస్తున్న ఆయన కొన్ని కీలక అడుగులు ముందుకేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా మారిన లీథియం గనుల వేలాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మైనింగ్ రంగంలో డ్రోన్లు, క త్రిమ మేధను విరివిగా ఉపయోగించాలని రాష్ట్రాలను కోరారు. దేశీయంగా u£గ్గు ఉత్పత్తిని పెంచి, విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా శక్తి వనరుల విషయంలో స్వయం సమద్ధి సాధించేందు కు కషి చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా వుంటూనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, బీబీనగర్‌లోని ఎయిమ్స్ అభివద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దష్టి కేంద్రీకరించారు.
కేంద్రమంత్రిగా, సికింద్రాబాద్ ఎంపీగా ఆయన కొన్ని కీలక పనులు చేపట్టారు. రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివద్ధి పనులు చేపట్టారు. ఇక్కడ విమానాశ్రయంలో వుండే సదుపాయాలను కల్పిస్తారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు నియోజకవర్గంలో చీరాలగడ్డ, ఇతర రైల్వే ఒవర్ బ్రిడ్జ్ (ఆరఓఆర్)లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు. తెలంగాణకు మకుటంలా భావించే రీజినల్ రింగ్ రోడ్డు (ఆరఆరఆర్) నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి సాధించడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకింద జంట నగ రాల్లోని చెరువుల ఆధునీకరణకు కషిచేస్తున్నారు.
‘ప్రసాద’ పథకం కింద తెలంగాణలో రామప్పదేవాలయం, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల అభి వద్ధికి నిధులు కేటాయించారు. రామప్పకు ‘యునెస్కో’ గుర్తింపు రావడంలో ఆయన కషి ఎం తో వుంది. ప్రస్తుతం గనులశాఖ మంత్రిగా లీథియం ఖనిజాన్ని వెలికి తీయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ ఖనిజం సమద్ధిగా లభిస్తే విద్యుత్ వాహన రంగంలో దేశం స్వయం సమద్ధి సాధించగలదు. మైనింగ్, బొగ్గు రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం వాటికి పెద్ద ఎత్తున గ్రాంట్ల రూపంలో సహాయం అందిస్తున్నా రు. బొగ్గుగనుల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెంచడమే కాకుండా, వేలాదిమందికి ఉద్యోగాలు లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో పౌర మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్ ఐటీ రంగ అభివద్ధికి కేంద్రం తరపున కిషన్‌రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఎలివేటెడ్ కారిడార్లనిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భూపరిహారం నిధులను (సుమారు రూ.303.62కోట్లు) నేరుగా కంటోన్మెంట్ బోర్డు (ఎస్‌సీబీ) పౌర పనులకే ఉపయోగించుకునేలా కిషన్‌రెడ్డి కేంద్ర రక్షణశాఖ నుంచి అనుమతి ఇప్పించారు. ఈ నిధుల్లో రూ.128 కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ను, అలాగే పాట్నీ, రసూల్‌పుర వద్ద తుపాను నీటి కాల్వలను నిర్మిస్తున్నారు. కంటోన్మెంట్ పరిధిలో అంతర్గత రోడ్డు పునరుద్ధరణ, కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచఎంసీలో విలీనం చేసే ప్రక్రి యపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనివల్ల పౌర సదుపాయాలు మరింత మెరుగు కాగలవు. ప్రాథమిక వసతులకోసం అదనంగా రూ.18కోట్ల ప్రత్యేక నిధుల ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర రక్షణశాఖ పరిశీలనలో వుంది.
ఐటీ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు మల్లేపల్లిలో రూ.10 కోట్ల వ్యయంతో మోడల్ ఐటీఐ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ‘వికసిత భారత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్‌వర్క’ ద్వారా గ్రామీణ మరియు పట్టణ యువత ఐటీ స్టార్టప్‌లు ప్రారంభించేలా శిక్షణ మరియు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ‘సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌టీపీఐ) ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1.45లక్షల కోట్ల ఎగుమతులను సాధించడంలో కేంద్రం అందించిన రాయితీలు, మౌలిక సదుపాయాలు దోహదపడ్డాయి. ఐటీ పరి శ్రమ కేవలం కోడింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా కత్రిమ మేధ (ఏఐ), ప్రాడక్ట్ ఇన్నోవేషన్‌లో ప్రపంచ నాయకత్వం వహించాలని ఐటీ సంస్థలను కిషన్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే మూడు హైస్పీడ్ కారిడార్లు`పూణె, బెంగళూరు, చెన్నై`ఐటీ మరియు ఫార్మా రంగాలకు ఊతమిస్తాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Pralhad Joshi: Efficiently Managing the PDS Ministry

• Elected to the Lok Sabha from the Dharwad constituency for five consecutive terms.

• A leader who garnered widespread attention on two occasions by winning with a massive majority.

• Joshi hoisted the national flag at the Dharwad Eidgah Maidan during 1992–94.

• The Supreme Court eventually delivered a favorable verdict regarding this ground.

• Manages assigned portfolios with unwavering commitment.

• Oversees the distribution of food grains to 800 million people through the PDS.

• Implemented the “Bharat Dal” scheme to regulate onion prices.

• Holds a prominent and secure position within the Karnataka BJP.

Pralhad Joshi, the Union Minister for Consumer Affairs, Food, and Public Distribution, hails from Karnataka. He currently serves as the 13th Minister in charge of the Food and Public Distribution portfolio and as the 10th Minister for New and Renewable Energy. Between 2019 and 2024, he also held the portfolios of Parliamentary Affairs, Coal, and Mines. Since 2004, he has represented the Dharwad constituency as a Member of Parliament. He served as the President of the Karnataka State BJP between 2014 and 2016. From 2014 to 2018, he served on the Panel of Chairpersons in the Lok Sabha. He was born on November 27, 1962, in Bijapur, which was then part of Mysore State. His father’s name is Venkatesh Joshi, and his mother’s name is Malatibai Joshi; Pralhad Joshi is the third child of this couple. He completed his primary education at a Railway School, while his secondary and high school education took place at the New English School in Hubballi. He earned his degree from the Kadisiddheshwar Arts College in Hubballi. From his childhood, he developed a keen interest in the Rashtriya Swayamsevak Sangh (RSS) and began his journey within the organization as a dedicated “Karyakarta” (activist). Subsequently, he actively participated in various RSS training camps.

Between 1992 and 1994, he hoisted the National Flag at the Eidgah Maidan in Hubli (Karnataka) under the aegis of the Rashtriya Swayamsevak Sangh. By participating in this event on behalf of the RSS, Pralhad Joshi became a widely recognized figure. The Supreme Court subsequently delivered a verdict regarding the ownership of this Eidgah Maidan. It gave orders that the property to be handed over to the Dharwad Municipal Corporation.

Pralhad Joshi has consecutively represented the Dharwad parliamentary constituency in the elections held in 2004, 2009, 2014, 2019, and 2024. Although he began his career as an industrialist, he gained immense public prominence overnight by leading the National Flag hoisting ceremony at the Eidgah Maidan in Hubli between 1992 and 1994. During this same period, he became a household name across the entire state by spearheading a movement titled “Save Kashmir.” Since then, he has cemented his position as a prominent and recognized politician within the state. Subsequently, he was elected as the BJP President for the Dharwad district. He contested for the Lok Sabha for the first time in 2004 from the Dharwad constituency. In this election, he defeated the Congress party candidate, B.S. Patil. Following this, he was elected to this same parliamentary seat for three consecutive terms and currently continues to represent this constituency. In the 2009 elections—held for the 28 Lok Sabha seats in Karnataka—he distinguished himself as the leader who secured the second-highest majority in the entire state. Notably, this election witnessed the defeat of many Union Ministers and MPs; thus, he demonstrated his leadership prowess even during a period when the BJP faced political headwinds in the state. Once again, in the 2019 elections, he proved his mettle by winning the Dharwad seat with a majority of over one lakh votes.

In May 2019, he took the oath as a Union Minister. Subsequently, Prime Minister Narendra Modi appointed him as the Minister for Parliamentary Affairs, Coal, and Mines. He continued to hold these portfolios until June 2024. After securing victory once again in the 2024 elections, he was entrusted with the Ministries of Consumer Affairs, Food and Public Distribution, and New and Renewable Energy. He currently oversees these ministries. It can truly be said that Pralhad Joshi has set a record by being elected five consecutive times from the same constituency. However, he expressed slight dissatisfaction regarding the reduced margin of his victory this time around. Mr. and Mrs. Joshi have three daughters. He possesses an immense passion for Indian classical music and cricket.

He works very actively to safeguard consumer rights and to foster appropriate awareness among the public. In particular, he focuses on irregularities within the Public Distribution System and strives to curb them. His primary objective is to ensure food security for all citizens. He pays close attention to ensuring the accuracy of weights and measures, consistently introducing and implementing modern technologies in this regard. Through the Bureau of Indian Standards (BIS), he takes measures to ensure strict adherence to quality standards. In doing so, through the Ministry of Consumer Affairs he currently heads, he lends his support to the “Atmanirbhar Bharat” and “Make in India” initiatives. Furthermore, he constantly monitors the Public Distribution System to ensure that food grains reach 800 million underprivileged people across the country under the Pradhan Mantri Garib Kalyan Yojana. After assuming ministerial responsibilities in 2024, he launched the “Bharat Dal” scheme and has been taking measures to ensure that essential commodities—such as onions—remain available to the public at affordable prices.

పీడీఎస్ మంత్రిత్వశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషి

· ఐదుసార్లు వరుసగా ధార్వాడ్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నిక

· రెండు సార్లు అత్యధిక మెజారిటీతో అందరి దష్టిని ఆకర్షించిన నేత

· 1992 `94లో ధార్వాడ్ ఈద్గా మైదానంలో జాతీయ పతాకం ఎగురవేసిన జోషి

· ఎట్టకేలకు ఈ మైదానంపై సుప్రీంకోర్టు అనుకూల తీర్పు

· అప్పగించిన శాఖలు నిబద్ధతతో నిర్వహణ

· 80కోట్ల మంది ప్రజలకు పీడీఎస్ ద్వారా ధాన్యం అందేలా పర్యవేక్షణ

· ఉల్లి ధరల నియంత్రణకు “భారత్ దాల” పథకం

· కర్ణాటక బీజేపీలో సుస్థిర స్థానం

హైదరాబాద్, నేటిధాత్రి: 

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం`ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కర్ణాటకకు చెందినవారు. ఆహారం`ప్రజాపంపిణీ శాఖను నిర్వహిస్తున్న 13వ మంత్రిగా, పునరుత్పాదక ఇంధన వనరుల శాకకు పదవ మంత్రిగా కొనసాగుతున్నారు. 2019`24 మధ్యకాలంలో ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను, u£గ్గు, మైనింగ్ శాఖలను కూడా నిర్వహించారు. 2004 నుంచి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ధార్వాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014`16 మధ్యకాలంలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014`18 మధ్యకాలంలో లోక్‌సభలో ఛైర్‌పర్సన్స్ ప్యానల్‌లో పనిచేశారు. 1962 నవంబర్ 27న మైసూరు రాష్ట్రానికి చెందిన బీజాపూర్‌లో జన్మించారు. తండ్రిపేరు వెంకటేష్ జోషి, తల్లి మాలతీబాయి జోషి. ఈ దంపతులకు ప్రహ్లాద్ జోషి మూడో సంతానం. ఈయన ప్రాథమిక విద్యాభ్యా సం రైల్వే స్కూల్‌లో జరగ్గా, సెకండరీ, హైస్కూల్ విద్యాభ్యాసం హుబ్బళ్లిలోని న్యూ ఇంగ్లీష్ స్కూల్‌లో జరిగింది. హుబ్బళ్లిలోని కడసిద్దేశ్వర్ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. చిన్నతనం నుంచే ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పట్ల ఆసక్తి పెంచుకొని అందులో కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంబించారు. తర్వాతి కాలంలో ఆయన ఆరఎసఎస్ శిక్షణా శిబిరాల్లో పాý£్గన్నారు.

1992‘94 మధ్యకాలంలో హుబ్లీ (కర్ణాటక) ఈద్గా మైదానంలో, రాష్ట్రీయ స్వయం సేవక్ సం ఘ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆరఎసఎస్ తరపున ఈ కార్యక్రమంలో పా ý£్గనడం ద్వారా ప్రహ్లాద్ జోషి పేరు అందరికీ సుపరిచితులయ్యారు. ఈ ఈద్గామైదానం ఎవరి దనే దానిపై విచారించి ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పుచె ప్పింది.

ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు 2004, 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలినాళ్లలో పారిశ్రామికవేత్తగా వున్న ఆయన 1992, 1994 మధ్యకాలంలో హుబ్లీలోని ఈద్గా మైదాన్‌లో జాతీయ పతాకావిష్కరణ కా ర్యక్రమానికి నేతత్వం వహించడం ద్వారా ఒక్కసారిగా ప్రజల్లో మంచి ప్రాచుర్యం పొందారు. ఇదే కాలంలో ఆయన “కాశ్మీర్‌ను రక్షించాలి” పేరుతో ఉద్యమాన్ని నడపడం ద్వారా రాష్ట్రవ్యాప్తం గా ప్రజలందరికీ సుపరిచితులయ్యారు. అప్పటినుంచి ఆయన రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందిన ప్రముఖ రాజకీయవేత్తగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తర్వాత ఆయన ధార్వాడ్ జిల్లా కు బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన మొట్టమొదటిసారి 2004లో ధార్వాడ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.ఎస్. పాటిల్‌ను ఓడించారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఇదే పార్లమెంట్ స్థానానికి ఎన్నికవుతూ వచ్చి, ప్ర స్తుతం కూడా ఇదే స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజారిటీ సాధించిన నేతగా గుర్తింపు పొందారు. కానీ ఇదే ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలు చాలామంది ఓటమి పాలవడం గమనార్హం. అంటే రాష్ట్రంలో బీజేపీకి ఎదురుగాలి వీచిన సందర్భంలోనూ ఆయన తన నాయక త్వ పటిమను చూపారు. మళ్లీ 2019 ఎన్నికల్లో ధార్వాడ్ సీటును లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుచుకొని మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. 

2019 మే నెలలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఆయన్ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, u£గ్గు, మైనింగ్ శాఖల మంత్రిగా ప్రధాని నరేంద్రమోదీ నియమించారు. ఆయన 2024 జూన్ వరకు ఈ పదవుల్లో కొనసాగారు. 2024 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించిన తర్వాత ఆయనకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖలను అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఈ శాఖలను నిర్వహిస్తున్నారు. వరుసగా ఒక నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎన్నికవడం ద్వారా ప్రహ్లాద్ జోషి రికార్డు సష్టించారనే చెప్పాలి. అయితే ఈసారి తన గెలుపు మార్జిన్ తగ్గడం పట్ల కొద్దిగా అసంతప్తిని వ్యక్తం చేశారు. జోషి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. భారతీయ శాస్త్రీయ సంగీతం, క్రికెట్ అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం.

వినియోగదారుల హక్కులను కాపాడటం, వారిలో తగిన చైతన్యాన్ని నింపడంలో ఆయన ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలపై దష్టి కేంద్రీకరించి, వాటిని అరికట్టేందుకు కషిచేస్తున్నారు. ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించాలన్నదే ఆయన ధ్యే యం. ఆయన తూనికలు, కొలతలు కచ్చితంగా వుండేవిధంగా, వీటికి సంబంధించి ఆధునిక సాంకేతికతలను ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టి అమలు చేయడంలో తగిన శ్రద్ద చూపుతున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ద్వారా నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా వుండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆవిధంగా తాను నిర్వహిస్తున్న వినియోగదారుల మంత్రిత్వశాఖ ద్వారా “ఆత్మనిర్భర్ భారత”, “మేకిన్ ఇండియా” కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాదు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశంలో 80కోట్ల మంది పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థల ద్వారా ఆహార ధాన్యం అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 2024లో మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత “భారత్ దాల” స్కీమ్‌ను ప్రారంభించి ఉల్లి వంటి నిత్యావసరాలుతక్కువ ధరలోనే ప్రజలకు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటున్నారు.

గ్యారెంటీలే అస్త్రాలు..పార్టీల గెలుపు ఆశలు!

`అంతటా గ్యారెంటీలే గ్యారంటీలు!?

`తమిళనాడు ప్రజలకు పార్టీల భంపర్ ఆఫర్లు!

`ఒకరిని మించి మరొకరు ప్రకటనలు.

`మూడు ప్రాంతీయ పార్టీలకు పడుతున్న ముచ్చెమటలు?

`లెక్కల మీద లెక్కలు..

`నమ్మకం ఆపనమ్మకం మధ్య ఉగిస లాటలు!

`విజయ్ ప్రభావం మీదనే రెండు పార్టీలకు భయాలు?

`ఏ పార్టీ ఓట్లు చీల్చుతాడో అని రెండు పార్టీలకు దిగులు.

`ప్రభుత్వ వ్యతిరేక ఓటు పై ఎవరిది పై చేయన్నది అర్ధం కావడం లేదు!

`ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు!

`సర్వే సంస్థలు చెబుతున్న గందరగోళం మాటలు

హైదరాబాద్, నేటిధాత్రి:                     ఒకప్ప్పుడు యాత్రలు, పాదయాత్రలు రాజకీయ పార్టీలను అదికారంలోకి తీసుకొస్తాయన్న గ్యారెంటీ కనిపించింది. ఇప్పటికీ దాని ప్రభావం కనిపిస్తోంది. అటు యాత్రలతోపాటు, గ్యారెంటీలు కూడా ఈ మధ్య రాజకీయ పార్టీలకు తోడౌతున్నాయి. గెలుపులో కీలకభూమిక పోషిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాలలో గ్యారెంటీల గోల మొదలైంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఈ గ్యారెంటీలు ఒక పార్టీలకు ఊపును తెస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం తమిళనాడులో అదికారంలో వున్న డిఎంకే కొత్తగా హమీల జోలికి వెళ్లడం లేదు. తమ పాలన చూసి ఓట్లేయమని అడుగుతున్నారు. కాని ఏఐడిఎంకే పార్టీ ఇస్తున్న హమీలు, తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా తన పార్టీ గెలుపుకోసం ఆరుగ్యారెంటీలు ప్రకటించారు. ఈ గ్యారెంటీలన్నీ దాదాపు అందరికీ ఒకే గొడుగులా వున్నాయి. తాజాగా ఏఐడిఎంకే ఇచ్చిన గ్యారెంటీలు కొంత విభిన్నంగా వున్నాయి. నిజానికి గ్యారెంటీలన్నీ ఆచరణ సాధ్యమౌతాయా? అంటే ఎవరూ సరైన సమాదానం చెప్పలేరు. ఎదుకంటే తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చారు. అవి ఎంత వరకు అమలుకు నోచుకుంటున్నాయో చూస్తూనే వున్నాం. ఈ గ్యారెంటీలకు భీజం వేసిన కర్నాటకలో కూడా వాటి అమలు అంత ఆశాజనకంగా లేదు. ఈ రెండు రాష్ట్రాలను చూసి గతంలో తెలుగుదేశం కూటమి కూడా ఏపిలో గ్యారెంటీలు ఇచ్చింది. అయితే ఇక్కడ కొన్ని బాగానే అమలు జరుగుతున్నాయి. పొరుగునే వున్న తమిళనాడు కూడ ఆదే బాటలో నడవాలనుకుంటోంది. తాజాగా ఏఐడిఎంకే గ్యారెంటీలు ప్రేజలను ఆకర్షిస్తాయా లేదా అనేది ఎన్నికల ఫలితాలు వస్తే గాని చెప్పలేం. కాకపోతే ఈ గ్యారెంటీలు కొంత జనంలో బాగానే నానుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి రేషన్ కార్డు వున్న కుటుంబానికి ఒక ప్రిజ్ ఇస్తామని ఏఐడిఎంకే చెబుతోంది. ప్రతి నెల రేషన్ సరుకులతోపాటు కందిపప్ప్పు, వంటనూనె కూడా ప్రీగా ఇస్తామంటోంది. ఇక ఇప్పటి వరకు చెన్నైకే పరిమితమైన మహిళలకు ఉచిత ప్రయాణం ఏఐడిఎంకే గెలిస్తే ప్రజలందరికీ తమిళనాడు మొత్తం ఉచిత రవాణ అంటున్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10వేల ఆర్ధికసాయం అందిస్తామంటున్నారు. ప్రతి విద్యార్ధికి విద్యా రుణాలు అందిస్తాతమంటున్నారు. వద్దులకు రూ.2వేలు ఫించన్ ఇస్తామంటున్నారు. గ్రామీణ ఉపాధి హమీ పధకం వంద రోజులుకు బదులు 150 రోజులు ఇస్తామంటున్నారు. ప్రతి వర్కింగ్ మహిళకు 25వేల సబ్సిడీతో స్కూటీ ఇస్తామంటున్నారు. జల్లిÅ£ట్లు ఎద్దులకు శిక్షణనిచ్చే కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, రూ.10లక్షల ఆర్దిక సాయం చేస్తామంటున్నారు. అనేది గ్యారెంటీలు గట్టెక్కిస్తాయా..అధికారం ఇస్తాయా? అనేది ఇప్ప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప్పుడు కేరళలలోనూ గ్యారెంటీల ప్రచారం జోరుగానే సాగుతోంది. తమిళనాడులో విజయ్ ఆరు గ్యారెంటీలు ఇస్తామంటున్నారు. తెలంగాణ తరహా గ్యారెంటీలు విజయ్ భాగానే ప్రచారం సాగిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిగానే జనం విజయ్ గ్యారెంటీల వైపు చూస్తున్నారు. విజయ్ ఇస్తున్న హమీలలో డిఎంకే కొన్ని ఇప్పటికే అమలు చేస్తోంది. విజయ్ మాటలు తమిళనాడు ప్రజలు నమ్మొచ్చనే అంటున్నారు. కేరళ ప్రజలు ఎంత వరకు నమ్ముతారనేదానిపై ఆసక్తి నెలకొని వుంది. ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం గ్యారెంటీలు దక్షిణాదిలో పనికొస్తాయని తెలుస్తోంది. ఎన్నికలంటేనే రాజకీయ పార్టీలకు పెద్ద యుద్దం. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు అనేక హమీలు ఇస్తున్నారు. వాటికి గ్యారెంటీలంటూ పేరు పెడుతున్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలో మాత్రం ఈ గ్యారెంటీల హమీలు బాగానే గుప్పిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ గ్యారెంటీలు పార్టీలను గట్టెక్కిస్తున్నాయని జనం నమ్ముతున్నారు. అయితే గ్యారెంటీలు అనేవి కాంగ్రెస్ పార్టీ పేటేంట్లుగా కూడా జనం చూస్తున్నట్లున్నారు. అందుకే నమ్మే రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాదిస్తోంది. నమ్మని రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోతోంది. కాంగ్రెస్ గ్యారెంటీలను ఉత్తరాదిలో కూడా బిజేపి కాపీ కొడుతుంది. కాని వాటికి గ్యారెంటీలు అని పేరు పెట్టడం లేదు. మరో రూపంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నారు. అందుకే గ్యారెంటీల పర్వం ఎన్నికల సమరంలో ఒక భాగమైపోతుందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. త్వరలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో తమిళనాడు, కేరళ కూడా వున్నాయి. కేరళýలో కాంగ్రెస్ కొంచెం బలంగానే వుంది. అక్కడ ఈసారి అదికారంలోకి రావాలన్న కసితోనే పనిచేస్తున్నట్లుంది. కేరళలలో పెద్దగా బిజేపికి స్కోప్ లేదు. కాంగ్రెస్‌కు ఎంతో కొంత స్దానం వుంది. బలమైన పార్టీగా ఇంత కాలం వున్న వామపక్షాలు, ఈసారి కూడా మళ్లీ అదికారం దక్కించుకోవాలన్న తపనతో వున్నాయి. అదే విధంగా కాంగ్రెస్ కూడా ఈసారి కేరళలలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందుకు అక్కడ కూడా గ్యారెంటీలను నమ్ముకొని ప్రచారం సాగిస్తోంది. అక్కడ కూడా తెలంగాణలో అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలపై పెద్దఎత్తున కాంగ్రెస్ ప్రచారం సాగిస్తోంది. అక్కడ ఈ మధ్య అన్ని పత్రికల్లోనూ తెలంగాణలో అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీల ప్రకటనలు ఇచ్చినట్లు సమాచారం. అలా గతంలో ఉత్తరాది రాష్ట్రాలలోనూ ప్రచారం జరిగింది. దీనికి బీజం కర్నాటకలో పడింది. అయితే అక్కడ పాంచ్ పటాకా పేరుతో కాంగ్రెస్ ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాదించారు. ఆ తర్వాత ఆరు నెలలకు తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో ఎన్నికల మ్యానిఫెస్టోలో సుమారు 420 హమీలు ఇచ్చారు. కాని ఆరు గ్యారెంటీల పేరుతో 13 గ్యారెంటీలను ప్రత్యేకంగా ప్రకటించారు. ప్రజలు ఆకర్షించారు. నమ్మించగలిగారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ సర్కారు ఏర్పడింది. ఇదే కాంగ్రెస్ పార్టీలో అన్ని రాష్ట్రాలకు ఎన్నికల రోల్ మోడల్‌గా పనికొస్తుంది. అయితే దక్షిణాదిలో మరో రాష్ట్రమైన తమిళనాడులో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో వున్న ఆరు గ్యారెంటీలను సినీ నటుడు విజయ్ తన విటికే పార్టీ ఎన్నికల గ్యారెంటీలను ఇటీవలే ప్రకటించారు. దాదాపు పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పోలి వున్న ఆరు గ్యారెంటీలను విజయ్ ప్రకటించారు. తమిళనాడులో విజయ్ అన్ని రకాల బస్సుల్లో తమిళనాడు మొత్తం ప్రయాణం ఉచితమని చెబుతున్నారు. తమిళనాడులో విజయ్ లక్ష రూపాయలు ప్రస్తావన లేకుండా తులం బంగారం ఇస్తామని చెబుతున్నాడు. పెళ్లికి తులం బంగారం ఇస్తామని అంటున్నారు. దానికి తోడు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు 8 గ్రాముల ఉంగరం ఇస్తామని చెబుతున్నారు. తమిళనాడులో విజయ్ మాత్రం ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. పించన్లు రూ.2500 ఇస్తామని మరో గ్యారెంటీ ఇస్తున్నారు. మహిళలకు కూడా ఇస్తామంటున్నారు. తెలంగాణలో చెప్పినట్లు ఆడపిల్లకు స్కూటీలు ఇస్తామన్నారు. విజయ్ కూడా ఆడపిల్లకు స్కూటీలు ఇస్తామంటున్నారు. ఇలా విజయ్ గ్యారెంటీ వలలు వేస్తున్నారు. ఆయన సభలకు కూడా జనం విరగబడి వస్తున్నారు. విజయ్ సభల్లో ఆ విషయం చెబుతున్నప్ప్పుడు చప్పట్లు, ఈలలు కొడుతున్నారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా స్కోప్ లేదు. బిజేపికి కూడా పెద్దగా ఆదరణ అంటూ ఏమీ లేదు. కేంద్రంలో అదికారంలో వున్న పార్టీగా తమిళనాడు రాజకీయాలను ఏలాలని చూసినా, ఇప్పట్లో సాద్యమయ్యేలా కనిపించడం లేదు. విజయ్ ఆరు గ్యారెంటీలు అధికార డిఎంకేను ఎంత మేర డీకొంటుందన్నది ఎన్నికలు పూర్తియితే గాని తెలియదు. కేరళýలో కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రజలు నమ్మే పరిస్దితి కనిపించడం లేదు. ఎందుకంటే కేరళలో వామపక్ష పార్టీలు తెలంగాణ ఆరు గ్యారెంటీల అమలు అబద్దమని ప్రచారం సాగిస్తున్నారు. పైగా అక్కడ సిఎం. పినరన్ విజయ్ కూడా ఖమ్మం వెలుగు మట్ల వివాదాన్ని పెద్దది చేసి ప్రచారం చేస్తున్నారు. ఎలఈడీ స్క్రీన్లు పెట్టి మరీ చూపిస్తున్నారు. ఉత్తరాదిలో పెద్దగా గ్యారెంటీలు పనిచేయలేదు. మరి తమిళనాడులో విజయ్‌ని నమ్ముతారా? లేక విజయ్ గ్యారెంటీలు నమ్ముతారా? ఏఐడిఎంకే వైపు జనం మొగ్గుతారా? అనేది చూడాలి. గతంలో తమిళనాడులో ఏ పార్టీకైనా ఒక్కసారే ప్రజలు అవకాశమిచ్చేవారు. మొదటిసారి గతంలో జయలలిత పార్టీకి రెండుసార్లు అవకాశం కల్పించారు. ఆ తర్వాత డిఎంకేకు కూడా రెండోసారి ప్రజలు పాలించే అవకాశమిచ్చారు. మరి మూడోసారి కూడా డిఎంకేకే అవకాశమిస్తారా? ప్రత్యామ్నాయ పార్టీలను ఎంచుకుంటారా? డిఎంకే పార్టీకే మరోసారి అదికారం కట్టబెడతారా? అనేది చూడాలి.

పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి…

పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు.గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 1 రాజీవ్ నగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, అధికారులతో కలిసి పారిశుధ్యం, అభివృద్ధి పనుల నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని, అంతర్గత రహదారులు,మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిబంధనలకు లోబడి త్వరగా ఇల్లు నిర్మించుకునేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఇండ్ల నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.మురుగు కాలువ సమస్య, పట్టణ ఆరోగ్య ఉప కేంద్రంలో నెలకొన్న సమస్యలు, ఇంటి పైనుండి విద్యుత్ తీగలు వెళ్లడంతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రజలకు త్రాగునీరు, వీధి దీపాలు,మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మొగుళ్ళపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీస్పెషల్టి మెగా హెల్త్ క్యాంప్…

మొగుళ్ళపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీస్పెషల్టి మెగా హెల్త్ క్యాంప్
————————–మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తేదీ 28 మార్చి 2026 శనివారం రోజున మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలో అందుబాటులోకి తీసుకురావడానికి గాను శనివారం రోజున (ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు) మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది .ఈ శిబిరంలో డెంటల్, ఆప్తలిమిక్, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసినన్ , పీడియాట్రిక్, గైనక్ సంబంధిత వైద్య నిపుణులు వస్తారు అని ప్రాథమిక ఆరోగ్యంగా కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ,డాక్టర్ నవత గార్లు ఆస్పత్రి సిబ్బందితో సమావేశం ఏర్పరిచి మండల ప్రజలకు తెలియజేసినారు. ఈ శిబిరాన్ని అన్ని గ్రామ ప్రజలు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు.
ఈ యొక్క శిబిరానికి వివిధ వైద్య విభాగాలకు చెందిన ప్రముఖ వైద్య నిపుణు రానున్నారని తెలియజేస్తున్నారు.
ఈ శిబిరానికి ముఖ్యంగా ఈ క్రింది వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు.
1.స్త్రీ వైద్య నిపుణులు (గైనకాలజిస్ట్):- మహిళా ఆరోగ్య సమస్యలు మరియు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయబడును.
2.ఎముకల వ్యాధి నిపుణులు (ఆర్థోపెడిక్ ):-కీళ్ల నొప్పులు ఎముకల బలహీనత వంటి సమస్యలకు చికిత్స అందజేస్తారు.
3.MD జనరల్ మెడిసిన్:-అన్ని రకాల జబ్బులకు పరీక్ష చేయబడును .
4.నేత్ర వైద్య నిపుణులు (ENT):-కంటి చూపు సమస్యలు ఉన్నవారికి పరీక్షలు చేయబడును.
5.పిల్లల వైద్య నిపుణులు (పీడియాట్రిక్):-చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్యలు గూర్చి చికిత్స చేయబడును.
6దంత వైద్య నిపుణులు (డెంటల్):-పంటి సమస్యలు ఉన్న వారికి పరీక్ష చేయబడును. ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో నిపుణులైన డాక్టర్లు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలియజేసినారు. ఇంకేమైనా పెద్ద సమస్యలు ఉన్నట్లయితే పై ఆసుపత్రికి పంపించబడును.కావున మొగుళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, మరియు వృద్ధులు చిన్నపిల్లలు, కంటి సమస్యలు ఉన్నవారు, పంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
వైద్యాధికారిణి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
మొగుళ్ళపల్లి

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలుగా న్యాయవాది కిరణ్ విజయం….

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలుగా న్యాయవాది కిరణ్ విజయం

వనపర్తి నేటిదాత్రి .

https://youtu.be/FvRqDzK6-PU?si=-2MLBuxUJemVBUgU

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికల పోటీలో కిరణ్ కుమార్ విజయం సాధించారని ప్రధాన కార్యదర్శి గా వెంకటరమణ గెలుపు పొందారని ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం ఓట్లు 177 దాదాపు 85 శాతం పోలింగ్ జేరిందని చెప్పారు బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఏం రాహుల్ రాజు పర్యవేక్షకులుగా వ్యవహరించారని చెప్పారు వనపర్తి బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించినందుకు న్యాయవాదులకు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ఈసందర్భంగా వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా విజయం సాధించి న o దు కు సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ సన్మానం చేసి అభినందించారు

మున్సిపల్ పన్నులను 100 శాతం వసూలు చేయాలి…

మున్సిపల్ పన్నులను 100 శాతం వసూలు చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపల్ పరిధిలో పన్నులను 100 శాతం వసూలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి పన్నుల వసూలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి కొరకు పన్ను వసూలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరితగతిన వసూలు చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. పన్నుల వసూలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు అందించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వేసవి కాలం అయినందున ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు నిబంధనల ప్రకారం త్వరగా ఇల్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

వన్య ప్రాణుల దాహార్తి కోసం నీటివసతి ఏర్పాటు-టీజీ ఎఫ్ డీసీ…

వన్య ప్రాణుల దాహార్తి కోసం నీటివసతి ఏర్పాటు-టీజీ ఎఫ్ డీసీ

జైపూర్, నేటి ధాత్రి :

 

ఎండలు మండి పోతున్న ఈ వేసవిలో అడవులు,ప్లాంటేషన్ లలో సంచరించే వన్య ప్రాణుల దాహం తీర్చ డానికి తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో నీరు నిల్వ ఉండేలా వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలం ముదిగుంట అటవీప్రాంతం లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాంటేషన్ లలో ఒక కాలువ లో ఒక చోట నీటి ఊటను ప్లాంటేషన్ వాచర్ శంకర్ గమనించారు.ఈ సమాచారం తెలిసిన వెంటనే టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ దీనికి ఒక కార్య రూపం దాల్చారు.గురువారం ప్లాంటేషన్ వాచర్ శంకర్,కొంత మంది కూలీల సహాయం తో జంతువులు తాగడానికి వీలుగా నీటి ఊట నీరు వృధాగా పోకుండా కొంత మేరకు మట్టి పూడిక తీయించి అడ్డు కట్ట వేయడం తో నీరు నిల్వ గా ఆగిపోయింది.ఈ సందర్బంగా ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ మూగ జీవాలైన వన్య ప్రాణులు వేసవిలో తాగు నీరు దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటాయని, వాటి దాహర్తి తీర్చడం కోసం చిరు ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

అంకుశాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవితకు అరుదైన గౌరవం…

అంకుశాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవితకు అరుదైన గౌరవం

-హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘన సన్మానం
మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంకుశాపురం గ్రామ నూతన సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. గురువారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఆ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతనంగా అంకుశాపురం గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన బీసీల ముద్దుబిడ్డ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులను మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ డిజిపి పూర్ణచందర్ రావు, సమాజ్ అధినేత సూర్యరావు, తొలి వెలుగు ఎడిటర్ రఘులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కవిత-లింగమూర్తి దంపతులు మాట్లాడారు. ప్రజాసేవ చేసేందుకు తాము రాజకీయ రంగ ప్రవేశం చేశామని, తమను సన్మానించి..రాజకీయంగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఆకేరువాగు కార్మికులకు ఆశాకిరణం – వర్ధన్నపేట ఎమ్మెల్యే చొరవ…

ఆకేరువాగు కార్మికులకు ఆశాకిరణం – వర్ధన్నపేట ఎమ్మెల్యే చొరవ
వేలాది కుటుంబాల జీవనాధారం ఆకేరువాగు
వ్యక్తుల కోసం వ్యవస్థ ఎప్పుడూ నిర్వీర్యం కావొద్దు.
నాయకులు అధికారులు మధ్య వైరుధ్యం కార్మికులకు శాపం

నేటిధాత్రి ఐనవోలు :-

 

వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐనవోలు, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల మీదుగా ప్రవహించే ఆకేరువాగు పరిసర ప్రాంతాల్లో సుమారు 5,000 కుటుంబాలు జీవనోపాధి సాగిస్తున్నాయి. వర్షాకాలంలో పొలాల్లో పేరుకుపోయే మట్టి, ఇసుకను ఫిల్టర్ చేసి అమ్మడం వీరి ప్రధాన ఉపాధిగా ఉంది.

ఫిల్టర్ ఇసుకకు ప్రత్యేక ఉపయోగాలు

ఈ ఫిల్టర్ చేసిన ఇసుకను ఇళ్ల నిర్మాణానికి కాకుండా, టైల్స్ కింద వేయడం, బాత్రూంల నిర్మాణం వంటి పనులకు ఉపయోగిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక అమ్మితే సుమారు వెయ్యి రూపాయల వరకు ఆదాయం వస్తోంది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రభావం

ఈ వృత్తిపై ఆధారపడిన వారిలో ఎక్కువగా దళితులు, ఎస్టీలు, బీసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఇసుక వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం పాలసీ కారణంగా ఉపాధి నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇసుక పాలసీతో దొంగలపై కట్టడి

ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక పాలసీ వల్ల అక్రమ రవాణా తగ్గినప్పటికీ, ఫిల్టర్ ఇసుకపై ఆధారపడిన కార్మికుల సమస్యలు ముందుకు వచ్చాయి.

ప్రత్యేక అనుమతులకు ప్రతిపాదన

గ్రామపంచాయతీ స్థాయిలో రాయల్టీ చెల్లించే విధంగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. అలా చేస్తే గ్రామపంచాయతీలకు ఆదాయం పెరగడంతో పాటు ప్రజలు తమ భూముల్లోనే ఫిల్టర్ ఇసుక సేకరించి అమ్ముకునే అవకాశం ఉంటుంది.

కార్మికులకు మళ్లీ ఉపాధి కల్పించే దిశగా చర్యలు

ప్రస్తుతం ఉపాధి కోల్పోయి ఆందోళనలు చేస్తున్న కార్మికులకు త్వరలోనే ఉపశమనం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే చొరవతో ఈ సమస్యకు పరిష్కారం దొరికి వేలాది కుటుంబాలు మళ్లీ తమ జీవనోపాధిని కొనసాగించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

error: Content is protected !!
Exit mobile version