ఇండ్లనుండి బయటకు వెళ్ళేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇండ్లనుండి బయటకు వెళ్ళేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

దుగ్గొండి ఎస్సై రణధీర్.

నర్సంపేట దుగ్గొండి నేటిధాత్రి:

shine junior college

వివిధ పనుల నిమిత్తం ఇండ్ల నుండి బయటకు వెళ్ళేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దుగ్గొండి ఎస్సై రణధీర్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ
ఇందుమూలంగా దుగ్గొండి మండల గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా మీ మీ బంధువుల ఇండ్లకు గాని, తీర్థయాత్రలు గాని, ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్లినప్పుడు మీ ఇండ్లకు తాళాలు వేసి పోయేటప్పుడు తలుపులకు సెంట్రల్ లాకింగ్ ఉండే విధంగా జాగ్రత్తలు పడాలని సూచించారు.అలాగే ఇంట్లో ఉండే విలువైన వస్తువులను తమతో పాటు తీసుకెళ్ళాలని లేనిపక్షంలో ఇంట్లో ఒకరు ఉండే విధంగా చూసుకోవలని ఎస్సై రణధీర్ తెలియజేశారు.

కాంగ్రెస్ హయాంలోసెటిల్ మెంట్ లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయి కేటీఆర్

కాంగ్రెస్ హయాంలోసెటిల్ మెంట్ లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయి- కేటీఆర్

సివిల్ మ్యాటర్ లో దూరి పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారు

కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేయడం,పోలీసులు ఉల్టా కేసు పెట్టి వేధించడంతోనే బీఆర్ఎస్ నేత కుంటయ్య ఆత్మహత్య

కుంటయ్య చావుకు కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం-న్యాయపోరాటం చేస్తాం

కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు,పెళ్లిల్లు చేయడంతో పాటు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

కుంటయ్య కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

shine junior college

కాంగ్రెస్ హయాంలో సెటిల్ మెంట్ లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు.తన భూమిని కాంగ్రెస్ నేత కబ్బా చేశాడని ఫిర్యాదుచేస్తే ఉల్టా తమ పార్టీ నేత కర్కబోయిన కుంటయ్యపైనే కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.సివిల్ మ్యాటర్ లో దూరి పోలీసులు సెటిల్మెంట్లు, అరాచకాలు చేయడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నేత భూమిని కబ్బా చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిరిసిల్లలో పరామర్శించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు ఏం చేప్తే అది చేయడాన్నే డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎవరిని వదిలిపట్టమన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఇంత చిల్లర, లేకి పనులు చేయలేదన్నారు.


మొన్న ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి మనసు కకావికలమైందన్నారు కేటీఆర్. రాజకీయ నాయకులు అంటే అందరూ ఏదోదో ఊహించుకుంటారన్న కేటీఆర్, బయటికి గంభీరంగా కనిపడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని ఓ వైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు.తన భూమిని కాంగ్రెస్ నేత కబ్బా చేయడం, పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. పార్టీలో నిబద్దత కల నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు , ఇతర సమస్యలు అన్నింటికీ తనదే బాధ్యత అన్నారు కేటీఆర్. కుంటయ్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామి ఇచ్చారు. ఈరోజు కుంటయ్య కి జరిగింది రేపు మరొకరికి జరగొచ్చన్న కేటీఆర్, ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపుచేయాలన్నారు.ఈ ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. పెద్దకర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని కేటీఆర్ ప్రార్థించారు.

రశ్మికతో కలిసి మళ్లీ దొరికిపోయాడు…

రశ్మికతో కలిసి మళ్లీ దొరికిపోయాడు…

 

shine junior college

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రశ్మిక మందణ్ణ మధ్య సాగుతున్న ప్రేమాయాణం ఇవాళ మొదలైందేమీ కాదు. అయితే వీరిద్దరూ ఆ విషయాన్ని ఇంతవరకూ అధికారికంగా మాత్రం చెప్పలేదు. దాంతో ఎక్కడైనా వీరిద్దరు కలిసి కనిపిస్తే పాపరాజీలకు అది పండగలా ఉంది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్‌ (National crush) రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) మధ్య సాగుతున్న ప్రేమాయణం గురించి ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. కొన్నేళ్ళుగా సాగుతున్నదే. అయితే తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానుబంధం గురించి రశ్మిక బయటపడినట్టుగా విజయ్ దేవరకొండ మాత్రం బయట పడటం లేదు. వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు.

రశ్మిక మాత్రం అవకాశం కుదిరినప్పుడల్లా విజయ్ ఫ్యామిలీతో తనకున్న బాండింగ్ ను విడమర్చి, విపులంగా చెబుతోంది. ఎవరు ఆ రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించినా… సంకోచం లేకుండా దాచుకోకుండా డైరెక్ట్ గా చెప్పడం లేదు కానీ ఇన్ డైరెక్ట్ గా అందరికీ తెలిసిందేగా అనేస్తోంది. రశ్మిక ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా… ఆమె చుట్టు పక్కల విజయ్ దేవరకొండ లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? అని పరికించి చూడడం అందరికీ అలవాటైపోయింది. అలానే విజయ్ దేవరకొండ ఫారిన్ ట్రిప్ వేసినా… అదే ప్లేస్ కు రశ్మిక కూడా వెళ్ళే ఉంటుందనే సందేహంతో ఆమె సోషల్ మీడియాను సెర్చ్ చేయడం కామన్ అయిపోయింది. ఏ మాత్రం హింట్ దొరికినా… ఇద్దరు ప్రేమికులు కలిసే వెళ్ళారోచ్ అంటూ ఆధారాలతో ఆ ఫోటోలను పెట్టడం పరిపాటిగా మారింది.

తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ ఇద్దరూ ముంబై ఎయిర్ పోర్ట్ నుండి వస్తున్న ఫోటో ఒకటి నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్ కలర్ డ్రస్ లో రశ్మిక ఉండగా, బ్లూ కలర్ డ్రస్ లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇద్దరూ ముఖాలకు మాస్క్ పెట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ బయట కారు ఎక్కుతుండగా కొందరు దీనిని సెల్ లో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘కింగ్ డమ్’ (Kingdom) మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలై నెలాఖరులో లేదా ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. అలానే రశ్మిక నటించిన ‘కుబేర’ (Kubera) సినిమా 20వ తేదీ జనం ముందుకు వస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులను మరింత వెయిట్ చేయించకుండా ఈ జంట ఎప్పుడు తమ ప్రేమకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి.

భయపడి అడుగు ఆపకే

భయపడి అడుగు ఆపకే

 

shine junior college

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు…

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. సప్తమి గౌడ కథానాయిక. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. మంగళవారం చిత్రబృందం ‘ఆగకే అమ్మాడీ… భయపడి అడుగు ఆపకే’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది ఈ సందర్భంగా చిత్రబృందం స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. లయ వర్ష బొల్లమ్మ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్‌

మంచినీటి బోరు మోటారు ను మరమ్మతులు చేయించిన కాంగ్రెస్ నాయకులు.

మంచినీటి బోరు మోటారు ను మరమ్మతులు చేయించిన కాంగ్రెస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి:

 

 

shine junior college

గణపురం మండల కేంద్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని గణప సముద్రం చెరువు కట్ట వద్ద ఉన్న బోరు బావికి భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలతో మోటార్ బిగించి ప్రారంభించిన మండల అధ్యక్షులు వ్యవసాయ శాఖ ఉపాధ్యక్షులు రేపాక రాజేందర్ వారితో మాజీ వైస్ ఎంపీపీ విదినేని అశోక్ భూపాల్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్ అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణ గోలి రవి గ్రామపంచాయతీ సిబ్బంది సాంబయ్య

రామాలయానికి పూజా సామాగ్రి అందజేత.

రామాలయానికి పూజా సామాగ్రి అందజేత

గణపురం నేటి ధాత్రి:

shine junior college

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజ నిర్వహించారు గణపురం మండల కేంద్రంలోని సోమేశ్వర మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు పబ్బ. వర్షిని. రాకేష్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పూజ అనంతరం రాకేష్.వర్షిని దంపతులు 3.000 రూపాయలతో నిత్య ధూప దీప సంబంధించిన పూజా సామాగ్రిని ఆలయ అర్చకులు కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూల శ్రీనివాస్ గౌడ్ బాటిక స్వామి మాదాసు అర్జున్ మాదాసు మొగిలి బూర రాజగోపాల్ పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

6 లేన్లుగా మెరీనా బీచ్ రోడ్డు..

6 లేన్లుగా మెరీనా బీచ్ రోడ్డు..

 

shine junior college

 

 

 

ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేందుకు మెరీనా బీచ్‌ రోడ్డును ఆరు లేన్ల రహదారిగా మార్చాలని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) నిర్ణయించింది. దేశంలోనే పొడవైన బీచ్‌గా మెరీనా తీరానికి పేరుంది. ఈ బీచ్‌కు స్థానికులతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

 

చెన్నై: ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేందుకు మెరీనా బీచ్‌ రోడ్డు(Marina Beach Road)ను ఆరు లేన్ల రహదారిగా మార్చాలని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) నిర్ణయించింది. దేశంలోనే పొడవైన బీచ్‌గా మెరీనా తీరానికి పేరుంది. ఈ బీచ్‌కు స్థానికులతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతున్న మెరీనా బీచ్‌లో ట్రాఫిక్‌ సమస్య కూడా అధికంగా ఉంది. కామరాజ్‌ రోడ్డులో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడి చాలా సేపు వాహనాలు నిలిచిపోతున్నాయి.

ప్రస్తుతం మెరీనా లైట్‌ హైస్‌ సమీపంలో జరుగుతున్న మెట్రోరైలు పనుల కారణంగా ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు, పర్యాటకుల విజ్ఞప్తి మేరకు, ప్రస్తుతం నాలుగు లేన్ల రహదారిగా ఉన్న మెరీనా బీచ్‌ రోడ్డును ఆరు లేన్లగా మార్చేందుకు జీసీసీ నిర్ణయించింది. అందుకోసం కామరాజర్‌ రోడ్డు(Kamarajar Road)లోని వార్‌ మెమోరియల్‌ నుంచి లైట్‌ హౌస్‌ వరకు 2.8 కి.మీ విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు 23 మీటర్ల వెడల్పుతో ఉంది.

 

 

ఈ రోడ్డును అదనంగా 6 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం విస్తరంచనున్న ప్రాంతంలో నడక దారి, దివంగత నేతల విగ్రహాలున్నాయి. రోడ్డు విస్తరణ కోసం వార్‌ మెమోరియల్‌ నుంచి లైట్‌ హౌస్‌ వరకు ఉన్న 9 విగ్రహాలు ఇతర ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, 20 మీటర్ల వెడల్పు కలిగిన రాధాకృష్ణన్‌ రోడ్డు కూడా విస్తరించనున్నారు.ఈ విస్తరణపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు జీసీసీ అధికారులు తెలిపారు.

కూలీ సంచ‌ల‌నం.. రైట్స్‌తో రికార్డుల మోత‌

కూలీ సంచ‌ల‌నం.. రైట్స్‌తో రికార్డుల మోత‌

shine junior college

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూలీ చిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

 

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) 171 చిత్రంగా డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) క‌ల‌యిక‌లో బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న రూపొందుతున్న‌ చిత్రం కూలీ (Coolie). భారీ బ‌డ్జెట్‌తో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna Akkineni), ఉపేంద్ర (Upendra), షౌబిన్ (Soubin Shahir), స‌త్య‌రాజ్(Sathya Raj), శృతిహాసన్ (Shruti Haasan) వంటి సౌత్ ఇండియా సూప‌ర్‌ స్టార్లు కీల‌క పాత్ర‌లు పోషించ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) సంగీతం అందించాడు. స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) నిర్మించింది.

 

 

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం అగ‌ష్టులో 14న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమానుంచి ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ గ్లిమ్స్ సినిమాపై అమాంతం అంచ‌నాలు పెంచ‌గా.. ఆ వీడియోలో ర‌జ‌నీ మిన‌హా ఏ హీరో ముఖం డైరెక్టుగా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం విశేషం.ఇదిలాఉంటే ఈ సినిమా విదేశీ రైట్స్ విష‌యంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుస్తున్నాయి. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఈ వార్త హాట్ టాపిక్ అయింది.

 

 

బాక్సాపీస్ వ‌ద్ద‌ ‘కూలీ’ చిత్రం విదేశీ రైట్స్‌ ధర సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ప్రస్తుతం విదేశీ పంపిణీ హక్కుల బిజినెస్‌ ప్రారంభమైన క్ర‌మంలో ఈ మూవీ రైట్స్‌ సొంతం చేసుకునేందుకు ప్రముఖ సంస్థ ఏకంగా రూ.70 నుంచి రూ.80 కోట్ల మేర చెల్లించేందుకు ముందుకొచ్చింద‌ని వినికిడి. అయినప్పటికీ చిత్ర నిర్మాత కళానిధి మారన్‌ మరింత అధిక మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నారని దాంతో ఈ ఫారిన్‌ రైట్స్‌ బిజినెస్ చ‌ర్చ‌లు ఇంకా న‌డుస్తూనే ఉన్నాయ‌ని ఈ నెలాఖ‌రున అన్నీ ఫైన‌ల్ అవుతాయ‌ని స‌మ‌చారం. ఈ సినిమా హక్కులను రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్లకు విక్రయిస్తే మాత్రం.. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ రైట్స్ సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు 

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు 

shine junior college

 

ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్‌ రాజ్‌ ట్రిపుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు…
ముజ్‌ఫర్‌పూర్‌ (బిహార్‌): ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్‌ రాజ్‌ ట్రిపుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు. డిస్ట్రిక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో సంస్కృతి క్రికెట్‌ అకాడమీ తరఫున 13 ఏళ్ల అయాన్‌ కేవలం 134 బంతుల్లో 327 పరుగులు సాధించాడు. అందులో 22 సిక్సర్లు, 41 ఫోర్లు ఉన్నాయి. అయాన్‌, వైభవ్‌ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలసి ప్రాక్టీస్‌ కూడా చేసేవారు. ‘వైభవ్‌ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అతడి బాటలోనే నేనూ నడుస్తున్నాన’ని అయాన్‌ చెప్పాడు. రాజ్‌ తండ్రి కూడా క్రికెటర్‌ కావడం విశేషం.

నాకు నటించడమే రాదన్నారు

నాకు నటించడమే రాదన్నారు

shine junior college

‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్‌. ఆమె నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే…

 

‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్‌. ఆమె నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే మలయాళ చిత్రం ఈనెల 27న విడుదలవుతోంది. ఇందులో లాయర్‌గా సురేశ్‌ గోపీ నటించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ మాట్లాడుతూ ‘నాకు నటన రాదంటూ చాలా మంది ట్రోల్‌ చేశారు. అయినా దర్శకుడు ప్రవీణ్‌ నాకు అవకాశం ఇచ్చారు. ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ వంటి గొప్ప చిత్రంలో ఎంపిక చేశారు. నాపై నమ్మకంతో ఇలాంటి పాత్రను ఇవ్వడమే నాకు దక్కిన విజయంగా భావిస్తున్నాను. ఇక నుంచి ప్రేక్షకులకు నచ్చే సినిమాలు మాత్రమే అంగీకరించాలని నిర్ణయించుకున్నా. కొవిడ్‌ సమయంలో నా కెరీర్‌ పరంగా, జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను’ అని చెప్పారు. కాగా, అనుపమ వ్యాఖ్యలపై సురేశ్‌ గోపీ స్పందించారు. ఒక నటిపై వివక్షను ప్రదర్శించడం మలయాళ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి కాదని అన్నారు. ‘అనుపమ మాట్లాడిన మాటలు ఆమె హృదయాంతరాళం నుంచి వచ్చాయి. గతంలో నటి సిమ్రాన్‌ విషయంలోనూ ఇదే విధంగా జరిగింది. మలయాళ చిత్రపరిశ్రమ ఆమెను చిన్నచూపు చూసి ఇండస్ట్రీ వదిలిపోయేలా చేసింది’ అని అన్నారు.

మెగాస్టార్‌తో డ్యూయెట్‌

మెగాస్టార్‌తో డ్యూయెట్‌

shine junior college
చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా…
చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఉత్తరాఖండ్‌లోని మసూరీలో రెండో షెడ్యూల్‌ మొదలైంది. ఇందులో చిరంజీవి సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. మంగళవారం నయనతార సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించనున్నారు. దర్శకుడిగా వరుస విజయాలను అందుకుంటున్న అనిల్‌ రావిపూడి ప్రేమ, కుటుంబ విలువలతో హృద్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చిరంజీవి పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది, ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది అని యూనిట్‌ తెలిపింది. షైన్‌స్ర్కీన్స్‌, గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి

ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్

ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్

shine junior college

 

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు చాలా రోజుల త‌ర్వాత‌ ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్ద‌మ‌వుతోంది.

 

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు చాలా రోజుల త‌ర్వాత‌ ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిద్ద‌మ‌వుతోంది. మిస్ ఫ‌ర్‌ఫెక్ట్ సిరీస్ ఫేమ్‌ అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru) లీడ్ రోల్‌లో, చరణ్ లక్కరాజు (Charan Lakkaraju) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా కృష్ణ పోలూరు (Poluru Krishna) దర్శకత్వం వ‌హించారు. గ‌తంలో శ్రీ రామ్‌, శివ‌బాలాజీల‌తో రెక్కీ (Recce) అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌ను రూపొందించి మంచి విజ‌యం ద‌క్కించుకున్న‌ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీరామ్ మ‌లి ప్ర‌య‌త్నంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.

 

1980లలో ఓ మారుమూల గ్రామం విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం వ‌ళ్ల అక్క‌డ‌ ప్రతి వధువు తమ‌ పెళ్లి రోజునే మరణిస్తుంటారు. దీంతో దశాబ్దంగా ఆ ఐర్లో పెళ్లిళ్లు అనేవి లేకుండా పోయి ప్ర‌తి ఒక్క‌రూ తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌తో జీవిస్తుంటారు. ఈక్ర‌మంలో ఒక పోలీస్‌ కానిస్టేబుల్ ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.

మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడే ప్రాంతంలో భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఓ శక్తివంతమైన సందేశంతో ఈ సిరీస్‌ను మ‌లిచారు. ఈ నేప‌థ్యంలోగ్రామంలో ఉండే రహస్యాలు, దాన్ని ఛేదించేలా ఇంట్రెస్టింగ్‌గా సాగే ఇన్వెస్టిగేషన్ క‌థ‌కు అదిరిపోయే సూపర్‌నేచురల్ థ్రిల్లర్ అంశాల‌ను మేళ‌వించి చూసే ప్రేక్ష‌కుల‌కు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ ఇవ్వ‌నున్నారు. ఇప్పుడీ సిరీస్ జూన్ 27 నుండి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండ‌గా త్వ‌ర‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు కృష్ణ పోలూరు, నిర్మాత శ్రీరామ్‌, న‌టి అభిజ్ఞలు మాట్లాడుతూ.. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంది. దాంలో అది ఆ విలేజ్‌లో భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలాంటి గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ అని అన్నారు. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో చిత్రీక‌రించామ‌ని, ప్రేక్షకులు ఈ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిరీస్‌ను ఎప్పుడెప్పుడు వీక్షిస్తారా? అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నామ‌ని అన్నారు.

మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఝరాసంగం.

మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఝరాసంగం, మండల విద్యార్థినికి స్టేట్ ర్యాంక్

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

విడుదల అయిన ఇంటర్ ఫలితాల్లో పురం అక్షిత రెడ్డి D/o పురం బసిరెడ్డి MPC(మొదటి సంవత్సరంలో)466/470 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు ఉత్తమ సాధించింది.ఈ సందర్భంగా విద్యార్థిని పురం అక్షిత రెడ్డికి ప్రిన్సిపల్ టీ తేనావతి మరియు అధ్యాపక బృందం మరియు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

పల్లె పోరుకు సిద్ధం!…..

పల్లె పోరుకు సిద్ధం!…..

◆ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం

◆ ఎన్నికలెప్పుడొచ్చినా సజావుగా నిర్వహించేలా కసరత్తు

◆ బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు సమకూర్చేపనిలో నిమగ్నం

◆ పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి

◆ జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు

◆ సర్పంచ్‌కు 30.. వార్డు సభ్యులకు 20

◆ రాష్ట్రంలో 12,848 పంచాయతీలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది.

సంగారెడ్డి,పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది. సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తిం పు, ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై అధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు లో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. తెలంగాణ లో గ్రామాల సంఖ్య పెరగడంతో బ్యాలెట్‌ బాక్సుల అవసరం మరింత ఏర్పడింది. అందుకే పక్క రాష్ర్టాల నుంచి బాక్సులు తెప్పిస్తున్నారు. అలాగే, గ్రామాలు, వార్డుల వారీగా కావాల్సిన బ్యాలెట్‌ పత్రాల అవసరాన్ని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది. ఇక, ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులను గుర్తించారు. పలుచోట్ల సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. ఇక, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కూడా సిద్ధమైనట్టు సమాచారం.

పంచాయతీ గుర్తులివే..

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులపై తుది కసరత్తు పూర్తయ్యింది. సర్పంచ్‌ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఆమోదించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇవే గుర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది.

సర్పంచ్‌ గుర్తులు:

ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్‌, లేడీ పర్సు, టీవీ రిమోట్‌, టూత్‌ పేస్టు, స్పానర్‌(పానా), చెత్త డబ్బా, బ్లాక్‌ బోర్డు, బెండకాయలు, కొబ్బరితోట, వజ్రం, బకెట్‌, డోర్‌ హ్యాండిల్‌, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీ లైట్‌, బ్రష్‌, క్రికెట్‌ బ్యాటర్‌, పడవ, బిస్కెట్‌, పిల్లనగ్రోవి, చైను, చెప్పులు, బెలూన్‌, క్రికెట్‌ వికెట్లు

వార్డు సభ్యుల గుర్తులు

గౌను, గ్యాస్‌స్టవ్‌, స్టూల్‌, గ్యాస్‌ సిలిండర్‌, బీరువా, విజిల్‌, కుండ, డిష్‌ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీం, గాజుగ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్‌ కవర్‌, హాకీ స్టిక్‌ మరియు బంతి, నెక్‌ టై, కటింగ్‌ ప్లేయర్‌, పెట్టె, విద్యుత్‌ స్తంభం, కెటిల్‌.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

రాష్ట్రంలోని పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్లే హాట్‌టాపిక్‌గా మారాయి. సామాజిక వర్గాల వారీగా ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. పం చాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకుం టే స్థానిక ఎన్నికల వైపు గురిపెడుతున్నారు. పం చాయతీ ఎన్నికల్లో సగం దాకా మహిళా రిజర్వేషన్లు ఉండడంపైనా తర్జనభర్జన పడుతున్నారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రా మాల్లో సామాజికవర్గాల జనాభాశాతం, మహిళల సంఖ్యతోపాటు గతంలో వరుసగా మూడుసార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలిసింది. గతసారి వచ్చిన రిజర్వేషన్‌ ఈసారి మారవచ్చని అంటున్నారు. తమ గ్రామానికి ఫలానా రిజర్వేషన్‌ను కేటాయించాలని అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేస్తున్నారు.మొత్తంగా ఎన్నికల కోడ్‌ వెలువడకముందే రిజర్వేషన్ల అంశం పల్లెల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 12,848 గ్రామ పంచాయతీలను గుర్తించింది. వీటన్నింటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదిక వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. దాని ప్రకారం మొత్తం 12,848 గ్రామ పంచాయతీల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలుండగా, 570 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు ఉండగా అక్కడ 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇక, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో 19 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.

ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం

రాష్ట్రంలోని పంచాయతీల వివరాలు

జిల్లా గ్రామపంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు

ఆదిలాబాద్‌ 473 166 20

భద్రాద్రి కొత్తగూడెం 478 236 22

హన్మకొండ 210 129 12

జగిత్యాల 385 216 20

జనగాం 280 134 12

భూపాలపల్లి 248 109 12

జోగులాంబ గద్వాల 255 142 13

కామారెడ్డి 536 237 25

కరీంనగర్‌ 318 170 15

ఖమ్మం 579 288 20

అసిఫాబాద్‌ 335 127 15

మహబూబాబాద్‌ 482 193 18

మహబూబ్‌నగర్‌ 423 175 16

మంచిర్యాల 306 129 16

మెదక్‌ 492 190 21

మేడ్చల్‌ మల్కాజిగిరి 34 19 3

ములుగు 174 87 10

నాగర్‌కర్నూల్‌ 460 214 20

నల్లగొండ 868 352 33

నారాయణపేట 276 136 13

నిర్మల్‌ 400 157 18

నిజామాబాద్‌ 545 307 31

పెద్దపల్లి 266 140 13

రాజన్న సిరిసిల్ల 260 123 12

రంగారెడ్డి 531 232 21

సంగారెడ్డి 633 276 27

సిద్దిపేట 508 230 26

సూర్యాపేట 486 235 23

వికారాబాద్‌ 594 227 20

వనపర్తి 268 133 15

వరంగల్‌ 317 130 11

యాదాద్రి భువనగిరి 428 178 17

ఎన్కౌంటర్లో నేలకొరిగిన గాజర్ల రవి

ఎన్కౌంటర్లో నేలకొరిగిన గాజర్ల రవి:-

టేకుమట్ల, నేటిధాత్రి:-

 

shine junior college

అల్లూరి జిల్లాలలో భారీ ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల అగ్ర నేతల మృతి … ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు మావో యిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ , అంజు మృతి చెందారు. . ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి నుంచి మా వోయిస్టులు పరారయ్యారు. మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం .భూపాలపల్లి జిల్లా టేకు మట్ల మండలం వెలిశాల గ్రామా నికి చెందిన గాజుల రవి అలియాస్ ఉదయ్ 40 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం ముగిసింది., అప్పటి రాజ శేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిగిన చర్చల ప్రతినిధిలో గాజర్ల రవి ఒకరు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఏవోబీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గాజర్ల రవి పై 25 లక్షల రివార్డు ఉంది గాజుల రవి మృతితో టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛా యలు అలముకున్నాయి.

భారత ప్రధాని పిలుపుమేరకు.

“నేటిధాత్రి” జమ్మికుంట.

11వ “అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాల” జరుగున్న కార్యక్రమాలలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ నెల 27 నుండి వచ్చే నెల 21 వరకు (25 రోజుల పాటు) జమ్మికుంట మండలంలో “ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్” GAD పోతీరెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న”ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా” కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా ఆయుష్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో…

మెడికల్ ఆఫీసర్ లు డాక్టర్ సంధ్యారాణి,GAD పోతీరెడ్డిపల్లి, ప్రిన్సిపాల్ CH.లచ్చయ్య, స్కూల్ స్టాఫ్, PET లు సిబ్బంది, పాల్గొన్న కార్యక్రమంను విజయవంతం చేసారు..

 

యోగ శిక్షణ కార్యక్రమలో. మెడికల్ ఆఫీసర్ సంధ్యా రాణి మాట్లాడుతూ… యోగా తో నిత్యం వాడే మందుల వాడకం తగ్గుతుందని చెప్పారు… ప్రిన్సిపాల్ లచ్చయ్య మాట్లాడుతూ… యువత శరీర శౌష్ణవం, వృద్ధి చెంది, ఆరోగ్యావంతమైన శరీరం ఏర్పడుతుందని…చెప్పారు..మరియు యోగా నిర్వాహకులు, ప్రఖ్యాత శిక్షకులు శ్రీ దేవునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ…”భారతీయ జీవనశైలి లో అందరికి సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగ నిత్య జీవితం లో భాగం చేసుకోవాలని ” పిలుపునిచ్చారు.

కాళేశ్వరంపై కూనంనేని విషం!

`కూనంనేని వ్యాఖ్యలు కమ్యూనిస్టు పార్టీకే అవమానం!

`తెలంగాణ సాయిధ పోరాటం కూనంనేని మర్చిపోయినట్లున్నాడు!

`కమ్యూనిజం సిద్దాంతాలకు తిలోదకాలిచ్చినట్లున్నాడు

`తెలంగాణలో విద్యుత్‌ ఉద్యమాలు చేసిన సిపిఐ వారసుడుగా మాట్లాడడం లేదు 

`రాజకీయంగా కేసిఆర్‌ ను కూనంనేని ఏం మాట్లాడినా అభ్యంతరం లేదు

`ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం కూల్చాలనడం అవివేకం!

`కూనంనేని ఆంద్రా పక్షపాతి అని మరోసారి తేలింది

`ప్రాజెక్టుపై అవగాహన లేమి వ్యాఖ్యలు!

`తెలంగాణలో ఎర్రపార్టీలో కూనంనేని కుత్సిత స్వభావం

`పొత్తులో గెలిచినా నిజం మాట్లాడడం కమ్యూనిస్టుల నైజం

`కాళేశ్వరం బాగు చేసి నీళ్లివ్వాలని కోరాల్సిన కూనంనేని

`తెలంగాణ రైతును ఆగం చేసే సలహాలివ్వడం దురదృష్టకరం

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కమ్యూనిస్టులు పేద పక్షపాతి సిద్దాంతాలు తిలోదకాలిచ్చినట్లున్నాయి. పాలకపక్షాలకు అనుబంధంగా మాట్లాడితే గాని మనుగడ సాగించలేవని నిర్ణయానికి వచ్చినట్లున్నాయి. అందులోనూ తెలంగాణ అంటే కమ్యూనిస్టుపార్టీలకు ఆది నుంచి చిన్న చూపే. వివక్షలకు కేంద్రమే.అందుకే తెలంగాణ ప్రగతి కోసం కమ్యూనిస్టులు మాట్లాడిరదిలేదు. ప్రశ్నించింది లేదు. కాని అడుగుడునా అభివృద్దికి అడ్డుపడ్డారన్న సంగతి చాలా మందికి తెలియదు. తెలంగాణలో ఏనాడు ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేయలేదు. పైగా తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకున్న సందర్భం కూడా వుంది. కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణలో ప్రాజెక్టుల విషయంలో ఏకతాటిపైకి వచ్చి అడ్డుకున్నసందర్బాలు కూడ వున్నాయి. అందుకే ఓ దశలో కేసిఆర్‌ దబ్బనం పార్టీలు కూడా వారిని విమర్శించారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, కాళేశ్వరం రద్దు చేయాల్సిందే అంటూ సిపిఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు సంచనల ప్రకటన చేశారు. కాలేశ్వరం అంటే కేసిఆర్‌, కేసిఆర్‌ అంటే కాళేశ్వరం అని గొప్పగా ప్రకటించుకున్న కేసిఆర్‌ ఇప్పుడు కమీషన్‌ మందు అబద్దాలు చెబుతున్నారన్నారు. నిజంగా కాళేశ్వరం గురించి తెలిసినా, ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి తెలంగాణ రైతాంగం దృష్టిలో కూనం నేని సాంబశివరావు మరోసారి విలన్‌ అయ్యారని చెప్పక తప్పదు. తెలంగాణలో కాళేశ్వరం అంటే ఏమిటో ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడా? లేక కాంగ్రెస్‌ గొంతుకై మాట్లాడుతున్నాడా? అన్నది ఆయనే చెప్పాలి. ఎందుకంటే కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్‌ నిర్మాణం సమయంలో 50 టిఎంసిల రిజర్వాయర్‌ నిర్మాణం చేయొద్దని కమ్యూనిస్టులు పెద్దఎత్తున పోరాటం చేశారు. తెలంగాణకు ఏదో మేలు చేస్తున్నట్లు నటించారు. కాని ఇప్పుడు వారి వ్యహార శైలి ఏమిటో పూర్తిగా అర్ధమౌతోంది. అంటే సిపిఐ పార్టీకి కాళేశ్వరం నిర్మాణం చేయడమే ఇష్టం లేదని అర్ధమౌతోంది. కాళేశ్వరం నిర్మాణం జరిగితే ఆంద్రాకు ఇబ్బంది అవుతుంది? ఇదీ కమ్యూనిస్టుల ఆలోచనలాగా వుంది. నిజానికి తెలంగాణ ఉద్యమానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం. కమ్యూనిస్టులది సమైక్య వాదం. విశాలాంద్ర నినాదం. అందుకే ఇంకా ఆ భావన నుంచి కమ్యూనిస్టులు బైటకు రాలేకపోతున్నారు. మంచికో చెడుకో సిపిఎం పార్టీ ఆది నుంచి అదే స్టాండ్‌ మీదవుంది. తెలంగాణ ప్రకటించిన నాటికికూడా సమైక్యాంధ్ర నినాదాన్నే ఎత్తుకున్నది. ఏపిలో సమైక్య ఉద్యమం సాగించింది. కాని సిపిఐ మాత్రం మనుగడ కోసం తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చింది కాని, తెలంగాణ వాదం ఆ పార్టీలో లేదని కూనం నేని వ్యాఖ్యలతో తేలిపోతోంది. ఓ వైపు తెలంగాణ సమాజం మొత్తం కాళేశ్వరంతో నీళ్లందాయని నమ్ముతుంటే రైతులు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటుంటే కూనంనేని సాంబశివరావుకు తెలియడం లేదా? కాళేశ్వరం నీళ్ల ఖమ్మం జిల్లాలో కనిపించలేదా? ఇప్పటికీ ఎల్లంపల్లినీళ్లే తెలంగాణను ఆదుకుంటున్నాయా? అదే నిజమైతే తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది? తెలంగాణ ఉద్యమానికి సిపిఐ ఎందుకు ముద్దతిచ్చింది. తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఎలా కనిపించింది? ఎల్లంపల్లితోనే తెలంగాణ సాగు సాగితే ఏటా తెలంగాణకు కరువెందుకు వచ్చింది? తెలంగాణ పల్లెలు వలసలు ఎందుకు వెళ్లిపోయాయి? పాలమూరు ఎందుకు వలసల జిల్లా అయ్యింది? మాట్లాడే ముందు కనీసం సోయితో కూనంనేని మాట్లాడితే బాగుండని తెలంగాణ వాదులు కోరుతున్నారు. కాలేశ్వరం వల్ల ఎక్క ఎకరాకు నీరందలేని అసత్యాలు మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారా? లేదా అన్న ఆలోచన కూడా లేకుండా ప్రకటనలు చేయొచ్చా? ఎల్లంపల్లి ద్వారా తెలంగాణ పంటలు పండితే 2014 వరకు తెలంగాణలో చెరువులెందుకు నిండలేదు. కాలువలెందుకు పారలేదు. వాగులు, వంకలు ఎందుకు జీవ కాలువలు కాలేదు. బోర్లు ఎందుకు వెయ్యి ఫీట్లు వేసినా నీళ్లు రాకపోయేవి. ఎండాకాలం సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో చుక్క నీరు కూడా అందకపోయేది. తెలంగాణలో బావులన్నీ ఎందుకు ఎండిపోయాయి? తెలంగాణ రైత సాగు వదిలేసి ఎందుకు వలసలు వెళ్లినట్లు? హైదరాబాద్‌లో పెద్ద పెద్ద రైతులు కూడా సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్లు? పాలమూరు నుంచి నిత్యం బొంబాయి, పూన, షోలాపూర్‌, బీవండి, సూరత్‌కు బస్సులు ఎందుకు నడిచినట్లు? ఈ సంగతులన్నీ కూనంనేనికి తెలియనివా? శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు కూడా కొంత కాలం ఆగితే నిర్మాణం చేసేవారు కాదు. అప్పుడే ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటుకావడంతోపాటు ప్రధాని నెహ్రూ చొరవతీసుకొని ప్రాజెక్టు శంకుస్ధాపన చేశారు. అయినా ఎన్నేళ్లు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు సాగిందో కూనం నేనికి తెలియదా? 16లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చేలా డిజైన్‌ చేసిన శ్రీరాం సాగర్‌ ను 14 ఎకరాలకు కుదించిన వారు ఎవరు? అలా నిర్మాణం చేసినా కనీసం ఐదు లక్షల ఎకరాలకు పారకం పారించారా? శ్రీరాంసాగర్‌లో నీళ్లున్నా తెలంగాణ రైతులకు నీళ్లు విడదల చేయమంటే చేసేవారా? తెలంగాణకు కరువొచ్చినా ఫరవాలేదని వదిలేసిన కాలం లేదా? ఎల్లంపల్లి ఎప్పుడు మొదలు పెట్టారు? ఎప్పుడు పూర్తి చేశారు. దాని వల్ల తెలంగాణ సాగు పెరిగిందా? కరువు తీరిందా? తెలంగాణ అదనపు స్ధిరీకరణ జరిగిందా? ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ గోసను కమ్యూనిస్టులు చూడలేదా? కాని తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసి, ఆంద్రాలో అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నా ఏనాడైనా సిపిఐ ప్రశ్నించిందా? రాయలసీమ కరువు మీద వున్న ప్రేమ పాలమూరు మీద సిపిఐ చూపించిందా? ఆంద్రాలో 70 టిఎంసిల కండలేరు నిర్మాణం చేస్తున్నప్పుడు కళ్లలో ఏం పెట్టుకున్నారు. అప్పుడు భూకంపాలు వస్తాయని ఎప్పుడైనా అన్నారా? వెలిగొండ 43 టిఎంసిలతో నిర్మాణం చేస్తుంటే ఏనాడైనా అడ్డుకున్నారా? ఈ ఎత్తిపోతల వల్ల ప్రజా దనం వృదా అని ప్రశ్నించారా? లేదు. ఆంద్రాలో రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఎండబెట్టేందుకు సహకరించారు. పోతిరెడ్డి పాడు నుంచి మద్రాసు దాకా నీళ్లు వెళ్తుంటే తెలంగాణకు నీళ్లియ్యాలని కొట్లాడిన చరిత్ర సిపిఐకి వుందా? లేదు. ఆంద్రాలో ఊరకళ్లు, బ్రహ్మంగారి మఠం, అలుగునూరు, అవుకు ఇలా అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేసినా అడ్డుకోలేదు. అంతెందుకు పోలవరం వల్ల ఖమ్మం ఉమ్మడి జిల్లాకు నష్టం జరుగుతుందని ఏనాడైనా మాట్లాడిన సందర్భం వుందా? భద్రాద్రి రాముడు మునిగిపోయే ప్రమాదమున్నా ప్రశ్నించారా? ఇప్పుడు బనకచర్లకు గోదావరి నది నుంచి 200టిఎంసిల నీరు తరలించుకుపోవాలని ఏపి ప్రభుత్వం చూస్తుంటే సిపిఐ కళ్లు మూసుకున్నదా? తెలంగాణలోని కాళేశ్వరం రద్దు చేస్తే ఏపికి నీళ్లు వరదలా వెళ్తాయి. అటు పోలవరానికి పుష్కలంగా నీరందుతాయి. బనకచర్లకు కూడా నీళ్లు పారుతాయి. బనకచర్ల కూడాఎత్తిపోతల పధకమే? అది ఎలా సక్రమమౌతుంది? దానికి విద్యుత్‌ ఖర్చు కాదా? ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేసిన అనేక రిజర్వాయర్లు నిండేందుకు ఎత్తిపోతల పథకాలకు ఖర్చు కావడం లేదా? పోతిరెడ్డి పాడు వల్ల ఎంత విద్యుత్‌ వినియోగమౌతుందో తెలియదా? అన్నీ తెలుసు. కాని కూనం నేనికి తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. తెలంగాణలో ఎమ్మెల్యేగా వుండాలి. ఆంద్రా ప్రయోజనాలు కాపాడాలి. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సమస్యలతో వుండాలి. కమ్యూనిస్టులు ఉద్యమాలతో ఉనికిని కాపాడుకోవాలి. ఆ పార్టీల మనుగడ కోసం ప్రజలు కష్టాల పడాలి. అన్నమో రామచంద్రా అంటుంటే ప్రజలను ఆదుకుంటున్నట్లు, వారి పక్షనా పోరాటం చేస్తున్నట్లు కమ్యూనిస్టులు నటించాలి. నాయకులుగా వెలుగొందాలి. సిపిఐ స్వార్ధపూరిత రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ఆగం చేయాలి. గతంలో చంద్రబాబు రెండోసారి సిఎంగా గెలిచిన తర్వాత కరంటు చార్జీలు పెంచడం జరిగింది. అయితే అప్పుడు కమ్యూనిస్టులు తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసినట్లు కలరింగ్‌ ఇచ్చారు. తెలంగాణ రైతులను రెచ్చగొట్టి వారి చావులకు కారణమయ్యారు. కాని ఏపి రైతులు నీటి తీరువాతో సాగు సాగిస్తుంటారు. అందులోనూ బోర్లు వినియోగిస్తుంటారు. వారికి కరంటు బిల్లులు భారమౌతాయని వారి పక్షాన పోరాటం చేసేందుకు తెలంగాణ రైతులను రెచ్చగొట్టారు. అప్పుడూ కమ్యూనిస్టుల నిజస్వరూపం తేలిపోయింది. తెలంగాణ వచ్చినా, ఆంద్రా ప్రయోజనాలే మోస్తోంది. కూనం నేని వ్యాఖ్యలు తెలంగాన రైతాంగానికి ఆగ్రహం తెప్పించింది.

ఎన్టీఆర్‌ ఫస్ట్‌.. రేవంత్‌ నెక్స్ట్‌

`ఎప్పటికైనా నేను సీఎం అని చెప్పిన వన్‌ అండ్‌ ఓన్లీ రేవంత్‌ రెడ్డి.

`నేను సీఎం కావడమే నా లక్ష్యం అని చెప్పిన ఒకే ఒక్కడు రేవంత్‌ రెడ్డి.

`అంత ధైర్యంగా చెప్పిన నాయకుడు మరొకరు లేరు.

`సీఎం కావడమే లక్ష్యంగా రాజకీయాలు చేసిన ఏకైక నాయకుడు.

`గతంలో నేను సీఎం కావాలి అని చెప్పిన ఎన్టీఆర్‌.

`తర్వాత ధైర్యంగా చెప్పింది రేవంత్‌ రెడ్డి.

`సీఎం కావాలన్న లక్ష్యంతో రాజకీయాలలోకి వచ్చిన రేవంత్‌.

`అప్పటి కాంగ్రెస్‌ నాయకులు చేసిన అవమానం ఎన్టీఆర్‌లో కసి పెంచింది.

`అవమాన భారంతో సీఎం కావాలనుకున్న ఎన్టీఆర్‌.

`ముందు నుంచి సీఎం కావాలన్న లక్ష్యంతో ముందుకొచ్చిన రేవంత్‌.

`పదవుల కోసం ఎక్కడా ఎదురుచూడలేదు.

`రాజకీయ పదవులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

`సమయస్ఫూర్తితో రాజకీయాలు చేశాడు.

`ఉన్నత రాజకీయ పదవులే ఎంచుకుంటూ వెళ్లాడు.

`సామాన్య కార్యకర్తగా వుండడానికి ఎక్కడా ఇష్ట పడలేదు.

`అంది వచ్చిన అవకాశాలు వదులుకోలేదు.

`ఎవరికీ భయపడలేదు..కేసులు, జైళ్లు లెక్క చేయలేదు.

`అందుకే రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యారు.

`కేసీఆర్‌ ఇంత ధైర్యంగా సీఎం కావాలని చెప్పలేదు.

`మనసులో సీఎం కావాలని అందరికీ వుంటుంది.

`తెలంగాణ వస్తే నేనే సీఎం అని కేసీఆర్‌ చెప్పుకోలేదు.

`దళితుడు సీఎం అని చెప్పి అధికారంలోకి వచ్చిండు.

`రేవంత్‌ రెడ్డి నేనే సీఎం అని కూడా అనేక సార్లు అన్నాడు.

`వైఎస్‌. రాజశేఖరరెడ్డి సీఎం కావాలని కలలుగన్నాడు.

`అది నెరవేరడానికి ముప్పై సంవత్సరాలు కష్టపడ్డాడు.

`సొంత పార్టీలోనే అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.

`ఆఖరుకు పాదయాత్ర చేసి సిఎం అయ్యారు.

`అప్పుడు కూడా నేనే సీఎం అని ఎప్పుడూ చెప్పలేదు.

`చంద్రబాబునాయుడు కూడా ఎప్పుడూ నేను సిఎం అవుతానని చెప్పింది లేదు.

`ఎన్టీఆర్‌ బతికున్నంత కాలం ఆయనే సిఎం అని అనేక సార్లు అన్నాడు.

`ఆఖరుకు ఎన్టీఆర్‌ కు పక్కన పెట్టి సిఎం అయ్యారు.

`నేను సీఎం అవుతా అని అవరోధాలెదురౌతున్నా చెప్పిన ఏకైక లీడర్‌ రేవంత్‌.

 

హైదరాబాద్‌ ,నేటిధాత్రి: 

  ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం వుంటుంది. చిన్నప్పుడు పెద్దయ్యాక ఏమౌతావని అడిగితే డాక్టర్‌, ఇంజనీర్‌, లాయర్‌, కలెక్టర్‌ ఇలాంటి మాటలు వింటుంటాం. ఇప్పుడు కొద్దిగా పరిస్దితి మారింది. సాఫ్ట్‌ వేర్‌ అంజనీర్‌ అనే పదం పిల్లలకు కూడా తెలిసిపోయింది. గత తరంలో మాత్రం ప్రభుత్వఉద్యోగాలు గురించి మాత్రమే తల్లిదండ్రులు చెప్పేవారు. ఒకవేళ తమ పిల్లలు మెకానిక్‌ అవుతా అంటే ఆ తల్లిదండ్రులు షాక్‌ అయిన సందర్భాలు కూడా వుంటాయి. ఇన్ని కోట్ల మందిలో అందరూ చెప్పిన సమాదానం కన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలు మాత్రం ప్రత్యేకం. చిన్నప్పుడు స్నేహితులతో ఎప్పుడు మాట్లాడినా లీడర్‌ నైతా అంటూ చెప్పేవారిన ఆయన సన్నిహితులు, చిన్న నాటి స్నేహితులు ఇప్పటికీ గర్తు చేస్తుంటారు. చిన్న నాటి నుంచే రేవంత్‌రెడ్డి లీడర్‌ లక్షణాలు పునికి పుచ్చుకున్నట్లు చెబుతారు. అలాగే ఆయన పెరిగి పెద్దై లీడర్‌గానే ఎదిగారు. సహజంగా లీడర్‌ కావాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీలో కార్యకర్తగా, ఆ తర్వాత సర్పంచ్‌ ఇలా అంచెలంచెలుగా ఎదుగిన వారున్నారు. కాని ఒకే సారి జడ్పీటీసి అయిన నాయకులు చాలా తక్కువ. అది కూడా ఇండిపెండెంట్‌గా గెలవడం అంటే మాటలు కాదు. సామాన్యమైన విషయంకాదు. అందులోనూ ఉమ్మడి రాష్ట్రంలో బలంగా వున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం, మరో వైపు బిఆర్‌ఎస్‌ పార్టీల హవా కొనసాగుతున్న తరుణంలో ఇండిపెండెంటుగా మిడ్జిల్‌ జడ్పీటీసి అయ్యారు. లీడర్‌గా తొలి మెట్టు ఎక్కేశారు. ప్రజా ప్రతినిధి అయ్యారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ ఇండిపెండెంటుగా ఎమ్మెల్సీ కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అప్పుడు కూడా బలమైన మూడు రాజకీయపార్టీలను కాదని ,రేవంత్‌రెడ్డి గెలవడం అనేది గొప్ప అవకాశం. అలా మండలిలో అడుగుపెట్టిన రేవంత్‌రెడ్డిని ఓ మాజీ ఎమ్మెల్సీ ఏం కావాలని ఎమ్మెల్సీ అయ్యారు? అని ప్రశ్నిస్తే సిఎం. అని క్షణం ఆలోచించుకోకుండా రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పారు. నిజానికి ఆ సమయంలో రేవంత్‌ రెడ్డి మాటను ఎవరూ నమ్మరు. అలాంటి సమాధానం ఎవరు చెప్పినా, మనసులో నవ్వుకుంటారు. లేక అవునా…అంటూ ధీర్ఘం తీస్తారు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి? అనుకునే ఆత్మ విశ్వాసం నిండుగా వున్న రేవంత్‌ రెడ్డి సిఎం. కావాలన్న లక్ష్యమే ఇంత దూరం నడిపించింది. ఆయనలో ఆత్మవిశ్వాసమే కాదు, అతి విశ్వాసాన్ని కూడా నింపింది. లేకుంటే ఇంత దూరం వచ్చేవారు కాదు. సహజంగా ఎవరికైన ఒక దశలో అతి విశ్వాసం కూడా అవసరమౌతుందని రేవంత్‌రెడ్డి జీవితాన్ని చూస్తే అర్ధమౌతుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపిలకు మాత్రమే సిఎం అయ్యే చాన్సులు వస్తాయి. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాత తెలుగుదేశంపార్టీలో చేరారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్‌రెడ్డికి తెలుగుదేశంలో సిఎం. అయ్యే అవకాశం వచ్చేదో లేదో కాని, తదాస్తు దేవతలు మాత్రం అప్పుడే దీవించారు. ఇంతలో తెలంగాణ ఉద్యమం బలపడిరది. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వున్న వైఎస్‌ అకాల మరణం చెందారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. తెలంగాణ రానే వచ్చింది. తెలంగాణ నుంచి తెలుగుదేశం క్రమక్రమంగా కనుమరుగౌతూ వచ్చింది. అయితే ఇక్కడ మరికొన్నివిషయాలు చెప్పుకోవాలి. నిజానికి రేవంత్‌రెడ్డికి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కావాలని బలంగా వుండేది. కాని ఆ పదవికి అడుగడుగునా అప్పుడున్న తెలుగుదేశం నాయకులు అడ్డుపడ్డారు. రేవంత్‌రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడుకాకుండా అడ్డుపడ్డారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరింత బలహీనపడుతూ వచ్చింది. అప్పుడు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ వైపు చూశారు. ఏం మాయా మంత్రం చేశారో గాని కాంగ్రెస్‌లో చేరారు. చేరుతూనే వర్కింగ్‌ ప్రెసిడెంటు అయ్యారు. అయితే ఇక్కడ కూడా నల్లెరు మీద నడకసాగలేదు. కాంగ్రెస్‌లో ఎంట్రీ అంత సులువుగా జరగలేదు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరిన తర్వాత అవమానాలు తప్పలేదు. సీనియర్‌ నాయకులు బెదిరింపులు తప్పలేదు. అందుకు ఎదురీత రేవంత్‌రెడ్డికి తప్పలేదు. కాని ఆయన లక్ష్యం ఒక్కటే…తాను జీవితంలో సిఎం కావాలి! అనే లక్ష్యం ముందు అన్నీ చిన్నవిగా మారిపోయాయి. అటు కేసిఆర్‌ ప్రభుత్వ వేధింపులు, ఇటుకాంగ్రెస్‌ పార్టీలోసీనియర్‌ నాయకుల చిన్న చూపులు ఎన్ని వున్నా వెరవలేదు. బెదరలేదు. లక్ష్యం చేరే వరకు అలసిపోలేదు. అందుకే సిఎం అయ్యారు. ఆ సమయంలో కూడా తాను సిఎం. అవుతానన్న నమ్మకంతోనే ఆయన పార్టీని భుజాల మీద మోశాడు. కాంగ్రెస్‌ పార్టీని పదేళ్ల తర్వాత అధికారంలోకి తెచ్చాడు. తన పంతం నెగ్గించుకోవడమే కాదు, గమ్యం చేరాడు. లక్ష్యం నెరవేర్చుకున్నాడు. ఇలా రాజకీయాల్లో లక్ష్య సిద్దితోపాటు, కేసిఆర్‌ను పడగొట్టి నిలబతానని, సిఎం. అవుతానని చాలెంచ్‌ చేసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. తెలుగు రాజకీయ చరిత్రలోనే ఇలా సిఎం. అయిన నాయకుడు వన్‌ అండ్‌ ఓన్లీ రేవంత్‌ రెడ్డి. సిఎం కావాలన్న కలను నెరవేర్చుకున్న మరో నాయకుడు ఎన్టీఆర్‌. నిజానికి ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. ఇక సినిమాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం సినీరంగంలోకి ప్రవేశిస్తోంది. ఆ సమయంలో రాజకీయాల వైపు మళ్లాలన్న ఆలోచన వచ్చింది. కాని ఏదో ఒక పదవి తీసుకోవాలని మాత్రమే అనుకున్నారు. అప్పటి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఒకరిద్దరితో చర్చలు కూడా జరిపారు. కాని లాభం లేదన్న సమాధానం వినాల్సివచ్చింది. పైగా అవమానాలు కూడా ఎదురయ్యాయి. దాంతో ఎవరో ఇచ్చే పదవి నాకెందుకు? నేనే లీడర్లను తయారు చేస్తాను. ఇంత కాలం ఆదరించిన ప్రేక్షకులకు రుణం తీర్చుకుంటాను. సిఎం. అయి తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటాననకున్నాడు. అప్పటికే రాజీవ్‌గాంధీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించారన్న వార్త దావాణలంలా వ్యాపించింది. తెలుగువారి ఆత్మగౌరవం డిల్లీలో తాకట్టులో వుందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. అదే సమయంలో తెలుగుజాతి విముక్తి, తెలుగు ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ప్రకటించారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అదికారంలోకి వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ను ఓడిరచి, సిఎం అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కొత్త రాజకీయ నీరును అందించారు. కాంగ్రెస్‌లో హేమా హేమీలనుకున్న నాయకులంతా కొత్త వారి చేతిలో ఓడిపోయారు. అసలు నవయువకులెంతో మంది మంత్రులయ్యారు. అలా తనకు జరిగిన అవమానం నుంచి సిఎం. అవుతానాన్నారు. అయ్యారు. ఈ ఇద్దరు తప్ప చరిత్రలో తాను సిఎం. కావాలని అనుకున్నవారు లేదు. అయినవారు లేరు. ఉమ్మడి రాష్ట్రంలో 1980 నుంచి సిఎం కావాలని కలలు గన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 వరకు ఎదరుచూడాల్సి వచ్చింది. సీనియర్ల ఎప్పుడు పోతారో..తాను సిఎం ఎప్పుడు అవుతానో అనుకునేవారని కొందరు చెబుతుండేవారు. కాని నేను సిఎం అవుతా ముందే చెప్పిన నాయకుడు కాదు. ఎమ్మెల్యే , మంత్రి అయిన తర్వాత సిఎం. ఆశలు చిగురించాయి. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌పార్టీని గెలిపించారు. పాదయాత్ర సమయంలో కూడా ఆయన ఎక్కడా నేనే సిఎం అవుతానని చెప్పింది లేదు. అధిష్టానం ఎవరికి అవకాశమిస్తే వాళ్లే సిఎం. అవుతారని చెప్పాడు. అంతే కాని రేవంత్‌రెడ్డిలా సిఎం. అవుతానని చెప్పలేదు. ఇక ఏపి ముఖ్యమంత్రిగా నాలుగోసారి పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుకు సిఎం. కావాలన్న ఆశ వున్నప్పటికీ ఎప్పుడూ, ఎక్కడ చెప్పినట్లు లేదు. ఎన్టీఆర్‌ వున్నంత కాలం ఆయనే సిఎం. అని అనేక సార్లు చెప్పిన నాయకుడు చంద్రబాబు. కాకపోతే ఆ పరిస్ధితులు ఆయనను సిఎం. చేశాయి తప్ప, తాను సిఎం అవ్వడానికే రాజకీయాల్లో వచ్చానని ఏనాడు చెప్పలేదు. కకపోతే ఎవరికైనా మనసులో వుంటుంది. బైటకు పదిమందిలో పదే పదే చెప్పిన నాయకుడు రేవంత్‌ తప్ప మరేవరూ లేదు. అంతెందుకు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన కేసిఆర్‌ కూడా తాను సిఎం. అవుతానని ఎప్పుడూ చెప్పలేదు. ఆంతరంగిక సమావేశాలలో అనేవారు అని కొంత మంది చెబితే వినడమే తప్ప ప్రజలకు నేరుగాచెప్పింది లేదు. ఆఖరుకు తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రచారం చేశారు. నేనే సిఎం.అని కేసిఆర్‌ ఎక్కడ చెప్పలేదు. అయితే నేను సిఎం అవుతానని చెప్పిన ఇద్దరు లీడర్లలలో మరోక విషయంలోనూ పోలిక వుంది. ఎన్టీఆర్‌ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారు. పేదలకు సన్న బియ్యం ఉచితంగా ఇచ్చి పేదల కడుపు రేవంత్‌ నింపుతున్నారు. ఈ విషయంలోనూ ఇద్దరూ చరిత్ర సృష్టించారు. చరిత్రలో నిలిచిపోతారు.

కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక.

కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక

టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య

ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ

కేసముద్రం నేటి ధాత్రి:

 

 

shine junior college

కేసముద్రం మున్సిపాలిటీలోని హరిహర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ అడహక్ కమిటీ కన్వీనర్ గా కొండపల్లి రామచందర్ రావు అధ్యక్షత వహించగా రాష్ట్ర టిడిపి పార్టీ పరిశీలకులుగా యనాల అనంతరెడ్డి హాజరై కేసముద్రం టిడిపి మండల పార్టీ ఎన్నికలను నాయకుల, కార్యకర్తల మధ్య ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించారు. కేసముద్రం టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు బండి పుల్లయ్య,రాష్ట్ర మాజీ కార్యదర్శిలు ఎం డి. ఇమామ్, వెంకటనారాయణ, మహబూబాబాద్ పార్లమెంటు మాజీ అధికార ప్రతినిధి ప్రేమ్ చంద్,కొరివి మండల పార్టీ అధ్యక్షుడు వీరస్వామి, మహబూబాబాద్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మ వెంకటేశ్వర్లు హాజరైనారు. అదేవిధంగా మండల పార్టీ ఉపాధ్యక్షులుగా యాసారపు నరసయ్య,ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శులు గూడేలు ముత్తయ్య,గుగులోత్ లక్ష్మణ్,భూక్య లచ్చిరాం, కార్యదర్శులుగా ఆవుల సారయ్య,షేక్ దలాల్ షరీఫ్, కోశాధికారిక గుర్రాల స్వరూపాలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా ఎన్నికైన యశోబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ… మండల కేంద్రంలో టిడిపి పార్టీని మరింత బలోపేతం చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తూ రానున్న స్థానిక ఎన్నికలలో టిడిపిని మంచి స్థానంలో నిలిపేలా కృషి చేస్తానని నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర జిల్లా మండల నాయకులకు కార్యకర్తలకు ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు.

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు

జైపూర్ నేటి ధాత్రి:

shine junior college

జైపూర్ మండలం ఇందారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న బానోతు సురేష్ జూన్ 5వ తేదీన తన మొబైల్ ఫోన్ ఎక్కడో పోయినట్లు తెలిపారు. ఆందోళన చెందిన బాధితుడు జైపూర్ పోలీస్ స్టేషన్ లో జూన్ 13వ తేదీన తన మొబైల్ ఫోన్ పోయిందని దరఖాస్తు ఇవ్వగా పోలీస్ వారు సిఈఐఆర్ పోర్టల్ కంప్లైంట్ నమోదు చేసుకొని ట్రేస్ చేసి తన మొబైల్ 17వ తేదీ మంగళవారం బానోత్ సురేష్ కి జైపూర్ పోలీసులు అందజేయడం జరిగింది.ఎవరి ఫోను చోరీకి గురైన ఎక్కడైనా ఫోన్ మిస్సయిన ఆందోళన చెందకుండా సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా తమ మొబైల్ ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు.

error: Content is protected !!
Exit mobile version