ఈనెల 25 లోపు రాష్ట్ర కమిటీ ఎన్నికలు.
తెలంగాణ రాష్ట్ర పద్మశాల సంఘం అధ్యక్షులు వేముల బాలరాజ్ నేత.
జనగాం జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి నేత.
స్టేషన్ ఘనపూర్ ( జనగామ) నేటిధాత్రి :-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి చేనేత కార్మికులకు సాధన కోసం సమిష్టిగా ఉద్యమించాలని.. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పద్మశాలి సంఘాన్ని మరింత బలపేతం చేస్తూ అవకాశం ఉన్నచోట పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీపీ వేముల బాలరాజు నేత, సీనియర్ జర్నలిస్టు జనగామ జిల్లా కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి నేత కోరారు. మంగళవారం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం సిల్పుర మండలం చిన్న పెండ్యాల గ్రామంలో నియోజకవర్గ స్టేషన్ ఇన్చార్జి గజ్జల దామోదర్ నేత ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ. భవిష్యత్తు మనదే. రాజకీయాల కచ్చితంగా పోరాటం చేద్దాంహక్కులు సాధించుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వారు వివరించారు ఈ నెల 25 లోపు రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వారు వివరించారు ఆకలి,అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఐదు లక్షలు ఎక్స్గేసియా చెల్లించాలని ఆ కుటుంబంలో కొరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందని నేపథ్యంలో ఉన్నటువంటి ఎన్నికల్లో అండగా ఉన్నారని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇచ్చిన మాట కట్టుబడి నేతన్నలకు అండగా ఉండాలని వారు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా పద్మశాలీలు ఉన్నారని రాజకీయ శక్తి ఎదగాలని వారు కోరారు తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల కమిటీ ఏర్పాటు చేసేందుకు కృషి చేశామని అదే నేపథ్యంలో జనగామ జిల్లాలు నూతన కమిటీని ఏర్పాటుకు విచ్చేసామని వారు తెలిపారు పద్మశాలి సమాజం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ నియోజకవర్గ పద్మశాలి సంఘం ఇన్చార్జి గజ్జల దామోదర్ నేత, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ చేనేత ఇంచార్జి శ్యామల పరమేశ్వర్ నేత, చింతగింది బిక్షపతి నేత, పేరాల నాగభూషణ్ నేత, జిల్లా రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.