పట్టణాన్ని మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ చాబుత్ర .!

Operation. Operation.

మందమర్రి పట్టణాన్ని నేరా రహితంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ చాబుత్ర

మందమర్రి నేటి ధాత్రి :

 

 

మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి. అర్థరాత్రి ఆవారా గా తిరుగుతున్న 30 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్
18 బైకులు,1 కారు, 5 సెల్ఫోన్లు స్వాధీనం
2 డ్రంకెన్ డ్రైవ్ కేస్ లు నమోదు 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు.

శనివారం అర్థరాత్రి మందమర్రి పట్టణం లో రావడం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా (డిఐజి) ఐపిఎస్, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ గార్ల ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ గారి పర్యవేక్షణలో మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ముగ్గురు ఎస్ఐలు 25 మంది సిబ్బంది తో పెట్రోలింగ్ పార్టీలుగా మందమర్రి పట్టణాన్ని అష్టదిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 30 మందిని అదుపులోకి తీసుకొని మందమర్రి సిఐ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే వారి వద్ద నుండి 18 బైకులు, 1 కారు, 5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.అలాగే తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై డీడీ కేస్ లు నమోదు చేయడం జరిగింది.

 Operation
Operation

 

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ….
అర్ధరాత్రి అరుగుల (చబుత్ర) మీద బాతకానీలు కొడుతూ, రోడ్లమీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాళ్లకు ఇబ్బందులకు గురిచేసిన, తాగి వాహనాలపై తిరుగుతూ . రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్న, గొడవలు సృష్టిస్తున్న మరియు అనుమానస్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఉపేక్షించేది లేదని ఇక మీద నుండి ఈ డ్రైవ్ క్రమ తప్పకుండా నిర్వహిస్తామని హెచ్చరించారు.

అలాగే ఇప్పుడు జరుగుతున్న నేరాలకు ముఖ్యంగా మైనర్లు మరియు 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే అధికంగా ఉంటున్నారని, వీళ్లకు కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొచ్చినట్లైతే చాలా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలియజేశారు.

మందమర్రి పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని దీనికి పట్టణవాసులు సహకరించాలని కోరడం జరిగింది.

ఆపరేషన్ చాబుత్ర కార్యక్రమం లో మందమర్రి, రామకృష్ణాపూర్, కాశిపేట ఎస్సైలు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!