
Water Shortage Threatens Crops in Shyampet
చెరువు నిండితేనే… పంటలు పండేది
చూస్తే వానలే.. చెరువు పూర్తిగా నిండలే
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కేంద్రంలోని దేవుని చెరువు నిండితేనే పంటలు పండు తాయి దేవుని చెరువు క్రింద ఉన్న పంట పొలాల దుస్థితి చెరువు వర్షం నీటి ఆధారంగా నిండుతుంది కానీ ప్రస్తుత చెరువు సగం మాత్రమే నిండింది. చెరువు నిండక పోతే భవిష్యత్తులో పంటల పరిస్థితి ఏమిటన్న బెంగ! దీంతో పంట పొలాలకు నీరు సరఫరా చేసేందుకు చాలా ఇబ్బందిక రంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.వాతా వరణ మార్పుల ద్వారా వర్షం పడితే నిండిన సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ దేవుని చెరువుకు వర్షపు నీరు చెరువు లోకి రాక నిడటం లేదు.
వర్షా లు కురవడంతో మండలం లోని చాలా చెరువులు మత్తడి పోస్తున్నాయి కానీ దేవుని చెరువుకు ఆధారం లేక నిడటంలేదు. చెరువుకు వచ్చే వరద రాక ఎస్సారెస్పీలో నీరు పడి వృధాగా పోతున్న వర్షపు నీరు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకొని చెరువు మత్తడి పోసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పాలకులు ఆ వైపుకు దృష్టి సాధించడం లేదు. దీంతో పొలాల రైతులు నీటి కొరత ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు
అధికారులు స్పందించాలి
శాయంపేట మండల రైతు ముసికే అశోక్
మండలంలోని దేవుని చెరువు కింద పంట పొలాలు సుమా రుగా 600 ఎకరాలు సాగుతు న్నాయి. చెరువుకు ఏటా నీటి రావడం కోసం తిప్పలు పడు తున్నాం. వర్షపు నీరు చెరువు లోకి రాకుండా ఎస్సారెస్పీ కాలువలో పడి వృధాగా పోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టించుకోని పని పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.