పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై.!

CBI investigation CBI investigation

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై సమగ్రహ విచారణ చేయాలి.

సీబీఐ విచారణకు డిమాండ్.

తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్.

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

తిరుపతి జీవకోన షెకినా చర్చి నందు తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మాట్లాడుతూ ఆంధ్రా తెలంగాణా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్రైస్తవ సువార్తికుడు ప్రవీణ్ పగడాల గత 25 వ తేది తన బైక్ మీద రాజమండ్రి నుండి వెళుతూ దివాన్ చెరువు దగ్గర ప్రమాదం సంభవించి మరణించారన్న సంగతి విన్న క్రైస్తవ సమాజం తీవ్ర నిరాశకు గురియై శోక సంద్రంలో మునిగిపోయారు.

అయినా గొప్ప బైబిల్ పండితుడు. పేదలకు తమ సొంత ఖర్చులుతో సహాయం చేస్తు, అనేక మంది అనాధులకు తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించారు.

అయితే ఆయన మరణించిన విధానం చూడగా అది ప్రమాదం కాదు హత్య జరియుండవచ్చుననని అక్కడ ఆక్సిడెంట్ జరిగిన స్థలాన్ని పరిశీలించగా అనుమానం వ్యక్తమైంది.

క్రైస్తవ సమాజమంతా ఎలుగెత్తి నిరసన చేయగా పోలీసులు శాఖా వారు అనుమానాస్పద మరణముగా కేసు నమోదు చేసుకొని క్రైస్తవ నాయకుల సమక్షంలో పోస్ట్ మార్టం చేసారు.

పోస్ట్ మార్టం అయిన తరువాత ఎస్పీ,హోం మంత్రి, ముఖ్యమంత్రి అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ డిపార్ట్మెంట్ కమిటీ వేసి తీవ్ర విచారణ చేసి న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది.

అయితే తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ డిమాండ్ చేస్తు ఏదో విచారణ మాటలతో పరిమితం కాకుండా నిజం నిగ్గుతేల్చి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సెక్రటరీ జైపాల్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజం మంచి వ్యక్తిని కోల్పోయామని బాధను వ్యక్తం చేసారు.

బీఎస్పీ పార్టీ నాయకులు వెంకట్ ప్రవీణ్ పగడాలా మరణం సందేహాలు ఉన్నాయని సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో పాస్టర్.సగేయు, అజరయ్య,దిలీప్ కుమార్,పీటర్, పీరారెడ్డి, జెర్నియా, తిమోతి దేవర్ జాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!