నిప్పుకు ఆహుతి అవుతున్నహరితహారం మొక్కలను పట్టించుకోని అధికారులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల మైలారం గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారం మొక్కలకు బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతానా నిప్పు అంటుకొని దగ్నం అవుతున్నాయి. గ్రామపంచాయతీ అధికారులు, అటవీ శాఖ అధికారులు గాంధీ నగర్, మైలారం గ్రామంలో ప్రజలకుఅవగాహన సదస్సు పెట్టకపోవడం హరితహారం మొక్కలు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ రెండు గ్రామాలకు అధికారులు కచ్చితంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గ్రామ రైతులకు ప్రజలకు ముఖ్యంగా రైతులు పంట పొలాలను సదును చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిప్పు అంటిస్తున్నారు. ఇంతకముందు ఒకసారి ఇలానే కాలుతుండగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి మహారాజ్ అప్పుడే రోడ్డు వైపు నుండి వస్తుండగా మంటలు అంటుకోవడం చూచి మంటలను ఆర్పేయడం జరిగింది ఇప్పుడు హరితహారం మొక్కలు సుమారు 100కు పైగా కాలిపోయాయి దీనిపై విచారించి అధికారులు చర్యులు తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!