పద్మశాలీయుల ఆడపడుచుకు పట్టువస్త్రాలు-ఓడిబియ్యం సమర్పణ

సిరిసిల్లలో ఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు

సిరిసిల్ల(నేటి ధాత్రి ):

సిరిసిల్ల పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి-పద్మావతి అమ్మవార్లకు ఒడిబియ్యం మరియు పట్టు వస్త్రాలు సమర్పించు కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారికి ఒడిబియ్యం మరియు పట్టు వస్త్రాలను సమర్పించారు..
ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ..
కొన్ని వందల సంవత్సరాలుగా సిరిసిల్ల ప్రజల ఆరాధ్య దైవంగా కొలువబడుతూ నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ శాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో స్వామివారికి పూజలు నిర్వహించి ఒడిబియ్యం సిద్ధం చేసుకుని ఒడిబియ్యం పట్టు వస్త్రాలతో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం నుండి వేద పండితులు భాజా భజంత్రీలు మధ్య వైభవంగా బయలుదేరి శ్రీ శాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకొని పద్మశాలి ఆడబిడ్డ పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం మరియు స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించుకోవడం జరిగిందని ఈల ఎంతో వైభవంగా భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేలా సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ ఒడిబియ్యం పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ మరియు కార్యవర్గ సభ్యులకు పద్మశాలి కుల బాంధవులకు ఈ సందర్భంగా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు..
అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముఖ్యంగా రథోత్సవం సందర్భంగా పురపాలక సంఘం ద్వారా చేపట్టాల్సిన అన్ని చర్యలు చేపడుతూ ఇట్టి బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు..
భక్తులందరూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ అందరికీ శ్రీ శాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ మాట్లాడుతూ
పద్మశాలి ఆడపడచైన పద్మావతి అమ్మవారికి సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కుల బాంధవులు ఆడపడుచులు పెద్ద సంఖ్యలో మార్కండేయ స్వామి దేవాలయం నుండి ఒడి బియ్యం పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా బయలుదేరి వచ్చి శ్రీ శాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి అమ్మవారికి శాస్త్రీయ పద్ధతుల్లో ఒడి బియ్యం పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగిందని అన్నారు..
అలాగే బ్రహ్మోత్సవాలను రాబోయే రథోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు పత్తిపాక పద్మ, గుడ్ల శ్రీనివాస్, దార్నం అరుణ లక్ష్మీనారాయణ, గెంట్యల శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ,
సిరిసిల్ల పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ గాజుల బాలయ్య, మోర రవి, యువజన విభాగం అధ్యక్షులు గుండ్లపల్లి పూర్ణచందర్, మహిళా విభాగ అధ్యక్షురాలు కాముని వనిత, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడపు రవీందర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సంగీతం శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, బోల్లి రామ్మోహన్, పద్మశాలి కుల బాంధవులు, దేవాలయం మాజీ అధ్యక్షులు ఉప్పుల విట్టల్ రెడ్డి, మాజీ ధర్మకర్తలు, పుర ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!