Gold Kavachams Donated to Lord Venkateswara
శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు బంగారు కవచాల సమర్పణ..
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూరు నగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.
స్వామివారి ఉత్సవ మూర్తులకు భక్తులు భవానంద రెడ్డి – జ్యోతి దంపతులు బంగారు కవచాలను విరాళంగా ఆలయ ధర్మకర్తలు గండ్ర జ్యోతి వెంకట రమణా రెడ్డి కి అందచేశారు.
స్వామివారి సేవలో భాగంగా ఈ విరాళం అందజేసిన దాతలను ఆలయ కమిటీ వారు అభినందించారు. స్వామివారి సేవలో భక్తులు భాగస్వాములు కావడం సంతోషకరమని,దాతల కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు స్థానిక భక్తులు పాల్గొన్నారు.
