అంగన్వాడీ కేంద్రం లో పోషణమసొత్సవాలు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బుధవారం చిట్యాల మండల కేంద్రంలోని అంగన్వాడి ఒకటవ కేంద్రంలో గ్రోత్ మేళ మరియు పోషణ మాసోత్సవాలను అంగన్వాడీ టీచర్ చింతల సంధ్యారాణి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ అవంతి మెడికల్ ఆఫీసర్ మౌనిక హాజరై ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశాలను తల్లులకు వివరించారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం డిడబ్ల్యు ఓ గారు డీఎంహెచ్ఓ సూచనల మేరకు పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లల బరువు ఎత్తు ప్రతినెల తీసుకోవాలని అప్పుడే పిల్లలలో లోపాలను, పోషణ పరిస్థితులను గుర్తించవచ్చునని ఆమె అన్నారు పిల్లలు తక్కువ బరువునకు గురి అయినట్లయితే తీసుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు అదనపు ఆహారము వ్యక్తిగత శుభ్రత త్రాగే మంచి నీరు వయసులవారిగా ఇవ్వవలసిన టీకాలు గూర్చి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో 30 మంది పిల్లల బరువు, ఎత్తును చూసి ఒకరికి అన్నప్రాసన కార్యక్రమం చేయించారు . ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయప్రద,హెల్త్ సూపర్వైజర్ సంజీవరెడ్డి విజిత ఏఎన్ఏం సుమలత ఆశ వర్కర్ కృష్ణవేణి, ఆయా లావణ్య కిషోర్ బాలికలు మహిళలు పిల్లలు హాజరైనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!