‘గోపన్ పల్లి చెరువుకు చుక్క నీరు ఇవ్వలేదు’
దేవరకద్ర నేటి ధాత్రి:
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామ రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి రైతులకు శనివారం జీనుగ విత్తనాలు, సబ్సిడీ స్ప్లింక్లర్ పైపులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి.. గోపన్ పల్లి సమీపం మీదుగా వెళుతున్న.

గోపన్ పల్లి చెరువుకు చుక్క నీరు ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పైపులను, విత్తనాలను ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అనేక సబ్సిడీ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు అందజేశామన్నారు. తమది రైతుల ప్రభుత్వమన్నారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.