కేజిబివిలలో ఎంఎల్టీ నూతన కోర్స్ ప్రారంభం.
వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలో గల దుగ్గొండి, పర్వతగిరి కేజిబివిలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను
రాష్ట్ర ప్రభుత్వము కళాశాల స్థాయిలో (ఇంటర్ మీడియట్) (ఎంఎల్టీ) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నూతన కోర్స్ లను ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు.ప్రతీ కళాశాలలో ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లను మంజూరు చేయడం
జరిగిందన్నారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ వైద్య విద్య పట్ల ఆసక్తి కలిగిన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోగలరని తెలిపారు. అంతే
కాక 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్ర మరియు జిల్లా ఉత్తీర్ణత శాతం కంటే మెరుగైన ఫలితాలు కేజిబివిలు
సాధించయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.జిల్లాలో గల 09 కేజిబివిలలో ఖానాపూర్, రాయపర్తి మరియు వర్ధన్నపేట
కేజిబివిలలో ఎంపీసీ,బైపిసి కోర్సులు ,చెన్నారావుపేట, గీసుగొండ, నల్లబెల్లి,సంగెం కేజిబివిలలో సిఈసి,ఎంపీహెచ్ డబ్ల్యు,(మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్) కోర్సులు ఉన్నాయని అలాగే దుగ్గొండి, పర్వతగిరి కేజిబివిలలో ఎంఎల్టి కోర్సులలో అధిక
మొత్తంలో గ్రామీణ ప్రాంతంలోని పేద బలహీనవర్గాల బాలికలు ప్రవేశాలను పొందగలరని జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కోరారు.