ఘనంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రం లోని కస్తూర్బ పాఠశాల యందు జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా పాఠశాల ఇంచార్జి పొన్నం సునీత మాట్లాడుతూ ఇందులో భాగంగా వ్యాసరచన పోటీలు రంగవల్లులు క్విజ్ పోటీలు ప్రముఖ శాస్రవేత్తలు మరియు ఆవిష్కరణలు సైన్స్ అంశాలపై వ్యక్తిత్వ ప్రసంగం పోటీలు వినియోగం విద్యార్థులచే చేయబడిన నమూనాల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం లో సైన్స్ ఉపాధ్యాయులు తోట రాధిక వెంగల విజయలక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు