నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ముదిరాజ్ మహా సభ జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి ముదిరాజ్ కు ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా ఈ నెల 13 న నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు పెద్దమ్మతల్లి దేవాలయం పరిధిలో నిర్వహించే ముదిరాజ్ అభినందన సన్మాన సభను నియోజకవర్గంలోని ముదిరాజ్ కుల భాందవుకు హాజరై విజయవంతం చేయాలని ముదిరాజ్ మహాసభ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జినుకల కొమ్మాలు పిలుపునిచ్చారు.పట్టణంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ కుల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్ కు జరిగే సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి నర్సంపేట, నెక్కొండ,చెన్నారావుపేట,దుగ్గొండి, నల్లబెల్లి,ఖానాపురం,నర్సంపేట రూరల్ మండలాల ముదిరాజ్ కుల మండల,గ్రామాల సొసైటీల అధ్యక్షులు కమిటీ సభ్యులు, కుల భాంధువులు,ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు,నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్, చెన్నారావుపేట అధ్యక్షులు హంస విజయరామరాజు, డివిజన్ నాయకులు ఈర్ల నర్సింహ రాములు, కుల పెద్దలు గోనెల నరహరి, డ్యాగల కిరణ్, తూటి శ్రీనివాస్, తుమ్మలపల్లి మహేందర్, మోటం రవి, బోల్ల స్వామి, నాయిని వేణు,పెండ్యాల మునేందర్, పెండ్యాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.