జైపూర్ మండలంలోని పలు గ్రామాలను పర్యవేక్షించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో గురువారం రోజున మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను, బోర్ వెల్స్ పనులను ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పర్యవేక్షించారు. వేసవికాలంలో గ్రామంలో ప్రజలకు త్రాగు నీటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని గ్రామపంచాయతీ సిబ్బందికి తెలియచేశారు. అలాగే మరమ్మత్తులు అవసరమైన బోర్ వెల్స్ పనులను సత్వరమే పూర్తిచేసి గ్రామస్తులకు వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

టేకుమట్ల గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ పనులు పూర్తి

టేకుమట్ల గ్రామంలోని మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ జరుగుతుందన్న విషయం ఎంపీడీవో దృష్టికి రావడంతో గురువారం రోజున టేకుమట్ల గ్రామాన్ని సందర్శించి పైప్ లైన్ లీకేజీ పనులను దగ్గరుండి పూర్తి చేపించడం జరిగింది.

ఇందారం శివాలయంలో బోర్ వెల్ మోటర్ మరమ్మత్తులు చేపిస్తాము

ఇందారం గ్రామంలోని శివాలయం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి బోర్ వెల్ మోటారు సరిగా పనిచేయకపోవడంతో నీటి కొరత ఏర్పడి భక్తులు ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ గురువారం రోజున శివాలయాన్ని సందర్శించి వీలైనంత తొందరగా మోటర్ పనులు పూర్తి చేసి భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే మోటార్ పనులు పూర్తయ్యే వరకు మిషన్ భగీరథ వాటర్ వచ్చేలా చూడాలని పంచాయతీ సెక్రెటరీకి తెలియజేశారు. ఈ పర్యటన కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!