షష్టిపూర్తి వేడుకల్లో పాల్గొన్న ఎంపీడీవో.
నేటి ధాత్రి మొగుళ్లపల్లి:
మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి రాళ్ల బండి ప్రభాకర చారి షష్టిపూర్తి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మొగుళ్ళపల్లి ఎంపీడీవో సురేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి రాళ్ల బండి సరళ ప్రభాకర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. డిపెప్ (ప్రాథమిక విద్యాశాఖ)విభాగంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ గా పదవి విరమణ పొందిన రాళ్ల బండి ప్రభాకర్ షష్టిపూర్తి వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని మొగుళ్ళపల్లి ఎంపీడీవో సురేందర్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మొ ట్లపల్లి సర్పంచ్ నరహరి వెంకట్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ రాళ్ల బండి శ్రీనివాస్ డాక్టర్ రాళ్ల బండి ప్రశాంత్. (న్యూరో సర్జన్) ప్రజ్ఞన్.డాక్టర్ రాళ్ల బండి ప్రత్యూష (గైనకాలజిస్ట్ )పాలిక ప్రవీణ్. తదితరులు పాల్గొన్నారు.
