ఎంపీ వద్దిరాజు జుబ్లీపురలో ఆత్మీయ సమ్మేళనం

ప్రతిపక్షాల మోసపు వాగ్ధానాలు, మాయమాటలు నమ్మొద్దు.ఎంపీ రవిచంద్ర

ఖమ్మం జిల్లా నేటి ధాత్రి

ఖమ్మం టౌన్.కేసీఆర్ గొప్ప పాలనాదక్షులు, తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దారు:ఎంపీ రవిచంద్ర

కేసీఆర్ ను కాపాడుకునే,నిలబెట్టుకునే, మూడోసారి ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ప్రజలందరిపై ఉంది:ఎంపీ రవిచంద్ర

వైశ్యులు క్రమశిక్షణకు మారుపేరు,రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో వారి పాత్ర గణనీయమైనది: ఎంపీ రవిచంద్ర

ఖమ్మంను ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తున్న మంత్రి అజయ్ ను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందాం:ఎంపీ రవిచంద్ర

మంత్రి అజయ్ కుమార్ తో కలిసి జుబ్లీపురలో ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర

 

ప్రతిపక్షాల మోసపు వాగ్ధానాలు, మాయమాటలు నమ్మొద్దని, కాంగ్రెస్ కాలంచెల్లిన పార్టీ అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గొప్ప పాలనాదక్షులని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టడమే కాక అద్భుతంగా తీర్చిదిద్దారని, ఇంకా కూడా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.ఇలాంటి మహానేతను కాపాడుకునే, నిలబెట్టుకునే, మూడోసారి ముఖ్యమంత్రిని చేసే గురుతర బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.ఎంపీ రవిచంద్ర ఖమ్మం నగరం జుబ్లీపురలో మంగళవారం ఉదయం ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, వైశ్యులు(షావుకార్లు) క్రమశిక్షణకు మారుపేరని,వ్యాపారదక్షత, దైవభక్తి గలవారని,షేవింగ్స్ బాగా చేస్తుంటారని వివరించారు.రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి,గుళ్లు గోపురాల నిర్మాణంలో వీరి పాత్ర విడిదీయలేనిదని,గణనీయమైనదని కొనియాడారు.ఖమ్మం నగరాన్ని, జిల్లాను అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తున్న మంత్రి పువ్వాడకు మనమందరం అండగా ఉండి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందామన్నారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు వేములపల్లి వెంకటేశ్వరరావు, విద్యాసంస్థల అధినేత బొమ్మా రాజేశ్వర్ రావులు ఎంపీ వద్దిరాజును శాలువాతో సత్కరించారు.ఈ సమ్మేళనంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, స్థానిక కార్పోరేటర్ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!