Moray Navatej Reddy Secures Navodaya Seat
నవోదయ సీటు సాధించిన మోరే నవతేజ్ రెడ్డి
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
మొగులపల్లి మండలంలో పర్లపెల్లి ఎస్వి విద్యాలయం చదువుతున్న మోరే నవతేజ్ ఎనిమిదో తరగతిలో నవోదయ సీట్లు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ మోరే రవీందర్ రెడ్డి డైరెక్టర్ గుండారపు రాజు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ ఈ సంవత్సరం గురుకుల విద్యాలయాలలో 38 మంది విద్యార్థులకు గాను 38 మందికి అదేవిధంగా ఈ సంవత్సరం నవోదయలో వాడేజే మనస్విని ఏడవ తరగతిలో 8వ తరగతిలో గొర్రె నాగ తన్వితకు నవోదయ సీటు సాధించడం పాఠశాల2002 స్థాపించినప్పటి నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే గురుకులాలో నవోదయలో అత్యధిక సీట్లు సాధించిన ఏకైక విద్యాసంస్థ అని పాఠశాలలో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించడం గర్వకారణం అని అన్నారు పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పోషక మహాశయులు శ్రేయోభిలాషులకు మిత్రులకు మరియు పాఠశాల ఉపాధ్యాయులు మాదరవేణి అశోక్ మామునూరు రమేష్ నాగలక్ష్మి శ్రీలత ప్రవళిక ప్రణీత సంధ్య అందరికీ కృతజ్ఞతలు తెలిపారు
