MLC Sirikonda’s Condolence Visit to Bereaved Families
మృతుల కుటుంబాలకు : ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండల కేంద్రానికి చెందిన కోడేల సమ్మయ్య మరియు కల్వచర్ల కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందగా మంగళవారం రోజున తెలంగాణ తొలి శాసనసభపతి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి సార్ వారి పార్థివ దేహాలను సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు. వారితోపాటు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, గ్రామపుర ప్రముఖులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
