వీణవంక బైక్ ర్యాలీ లో పాల్గొన్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

*బీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి పాడి కౌశిక్ రెడ్డి

వీణవంక.(కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:శుక్రవారం వీణవంక మండల కేంద్రంలోని అన్ని గ్రామాల నుండి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు కార్యకర్తలు నాయకులతో కలిసి బైక్ రాలితో జమ్మికుంట పట్టణంలో నూతన బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. జై బీ ఆర్ఎస్ జై కేసీఆర్ జై కౌశిక్ అంటూ నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు హోరెత్తించారు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తో అనేక పథకాలను అమలు చేసిన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ఏకైక లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నిరంతరం మీ ముందుండే నన్ను గెలిపించాలని పాడి కౌశిక్ ప్రజల కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవం ఆరోపణలను తిప్పి కొట్టాలని కోరారు. ప్రతిరోజు మీ ముందు మీ మధ్యలో తిరిగే వ్యక్తిని ఓట్ల కోసం కాకుండా ఎప్పుడు మీ సమస్యలను పరిష్కరించడానికి పాటుపడే వ్యక్తి కౌశిక్ రెడ్డిని గెలిపించాలన్నారు. అధికార ఉన్నా లేకున్నా ఈ హుజురాబాద్ నియోజకవర్గం లో అభివృద్ధికి పాటుపడే వ్యక్తినని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి జెడ్పిటిసి వనమాల సాధవరెడ్డి సర్పంచ్ నీల కుమారస్వామి, గంగాడి తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి,ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్, సంగ సమ్మ,య్య, మర్రి స్వామి,ఉప సర్పంచులు ఒరెం భానుచందర్ రామగుండం రాజ్ కుమర్, శరత్ రెడ్డి, కాసర్ల సుధాకర్, భూమయ్య అఖిల్ అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!