శ్రీ వరవర రంగనాయక భాష నిలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

శ్రీ వరవర రంగనాయక భాష నిలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

కోదాడ, నేటి ధాత్రి:

 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను శనివారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామ వరవర రంగనాయక భాషా నిలయం గ్రంథాలయం నందు జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జ్యోతి రావు పూలే చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా 1888లో మహాత్మా అనే బిరుదు లభించింది. బడుగు బలహీన వర్గాల మహిళల కోసం ఆయన చేసిన సేవలు శిరస్మరణీయమైనవి.కుల వ్యవస్థ నిర్మూలన, అంటరానితనం తొలగింపు స్త్రీ విద్య, మహిళా సాధికారత కోసం తన భార్య సావిత్రిబాయి పూలే తో కలిసి 1848 లో పూణేలో బాలికల కోసం మొదట పాఠశాలను స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య, ఇర్ల శ్రీనివాస్ రెడ్డి,వట్టికూటి గురవయ్య, మాజీ సర్పంచ్, పాపి శెట్టి సత్యం పిఎసిఎస్ మాజీ చైర్మన్, కామిశెట్టి నరసింహారావు, మాజీ దేవాలయం చైర్మన్, జాబిశెట్టి నాగప్రసాద్ గ్రామ శాఖ అధ్యక్షులు,బండి చిన్న కోటయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు 9వ వార్డు మెంబర్, కాసాని శ్రీను, ఇర్ల గోపిరెడ్డి, పోశంఎర్ర కొండలు, ఇర్ల నర్సిరెడ్డి, సంపటం శ్రీనివాసరావు, మార్గం రామచందర్రావు,పొట్టా గాంధీ, అమరబోయిన రవి,దాట్ల సైదాచారి, భూక్యా హీరమ్. కుక్కడపు గోపయ్య,బొర్రా కొండలు, పోశం గాంధీ, పోశం వెంకటయ్య, గూడపు వెంకటేశ్వర్లు,దండాల పద్మావతి, కత్తి మాధవి,బంక వరలక్ష్మి, పిడమర్తి రజిని, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version