హాస్పటల్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గండ్ర.

వైరల్ ఫీవర్లు వస్తున్నందున వైద్యులు అందుబాటులో ఉండాలని సూచన.

చిట్యాల, నేటి దాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో ఉన్న సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక పర్యటన చేసినా భూపాలపల్లి శాసన సభ్యులు గండ్రవెంకటరమణారెడ్డి, హాస్పటల్ లో పేషంట్స్ వార్డులో పర్యటించి, రోగులతో మాట్లాడారు.దవాఖానలో చికిత్స కోసం వస్తున్న రోగుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ హబ్ ద్వారా చాలా రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం చాలా నిధులు కేటాయించి, వైద్యరంగాన్ని ఎంతో అభివృద్ది చేస్తుందని తెలిపారు.ప్రభుత్వ దవాఖానల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
రానున్న స్వల్ప కాలంలో జిఎంఆర్ఎం ట్రస్టు ద్వార చిట్యాల సి హెచ్ సి లో రోగులకు ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనితున్నమని తెలిపారు
ఇటీవలే కాలంలో అకాల వాతావరణ మార్పులతో ప్రబలుతున్న జ్వరం కారణంగా ప్రజల ఎవరు ఇబ్బందులు పడుతున్నారనీ దవాఖానలో పర్యటన చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గొర్రె సాగర్ ,స్థానిక సర్పంచ్ పూర్ణచందర్, హాస్పిటల్ సూపర్డెంట్ జీడి తిరుపతి స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టి నాయకులు, వైద్యులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!