రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలకు ఇస్సిపేట క్రీడాకారుడు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన గాజుల కేదారి, సుజాత కుమారుడు శ్రీ గాజుల మురళి కృష్ణ ఈ నెల 12వ తేదీన భూపాలపల్లి జిల్లా పోటిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు జిల్లా యువజన క్రీడా అధికారి చిర్ర రఘు, సీనియర్ క్రీడాకారుడు పాడుగుల శివకుమార్, వ్యాయమ ఉపాధ్యయులు, రాజయ్య, అజయ్, సురేష్, ఆనంద్ తెలిపారు, ఈ కార్యక్రమాన్ని ఉద్యేశించి స్థానిక గ్రామ సర్పంచ్ యర ముకుంద రెడ్డి, అభినందనలు తెలిపారు ఈ నెల 20నుండి 23వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నల్గొండ లో జరుగుతాయి జిల్లా జట్టు నుండి మంచి ప్రతిభ కనబరిచి రానున్న రోజుల్లో గ్రామానికి జిల్లా కి మంచిపేరు తీసుకురావాలని సీనియర్ క్రీడాకారులు, గ్రామ ప్రజలు మరియు పెద్దలు తెలిపారు
