-ఆపరేషన్ సిందూర్ సక్సెస్!
-ఆపరేషన్ సింధూర్…ఉగ్ర స్థావరాలు మటాష్!
-పహల్గావ్ దాడికి ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం.
-భారతీయుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం.
-దేశమంతా మన సైనికులకు సలామ్.
-జై హింద్ ట్విట్లతో దేశంమంతా మారుమ్రోగిపోతోంది.
-పాకిస్తాన్ లో వున్న 4 ఉగ్ర స్థావరాలు, పివోకేలో 5 బంకర్లు ధ్వంసం.
-మసూద్ కుటుంబం, బంధువులు మృతి.
-100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.
-26 ఉగ్రస్థావరాలు గుర్తింపు.
-పాకిస్తాన్ మాయమయ్యే సమయం ఆసన్నమైంది.
-ఇప్పుడే మొదలైంది…ఇక పాకిస్తాన్కు మూడిరది.
-ఉగ్రవాద స్థావరాలపై అర్థరాత్రి మొదలైన భారత్ దాడులు.
-25 నిమిషాలలో ఆపరేషన్ పూర్తయ్యింది.
-9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు.
-అంతర్జాతీయంగా పాక్ ఇప్పుడు ఏకాకి!
-పాక్కు మిగిలేది ఇక భవిష్యత్తు కాళరాత్రి.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఇండియా అంటేనే శాంతి సందేశం. శాంతికి నిలయం. పరహితం. పరోపకారం. ప్రపంచశాంతిని కోరుకునే దేశం. అలాంటి మన దేశం మీద ప్రతి క్షణం విషం చిమ్ముతూ బతకడమే పాకిస్తాన్కు అలవాటుగా మారింది. దేశం విడిపోయిన నాటి నుంచి ఏదో ఒక రకంగా గిచ్చి కయ్యం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నది. ఇప్పటికి నాలుగు సార్లు జరిగిన యుద్దంలో ఓడిపోయినా ఆ పాకిస్తాన్కు బుద్ది రావడం లేదు. 1972లో ఏకంగా 90 వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయి, యుద్దంలో ఓడిపోయారు. అయినా ఆ దేశానికి సోయి రావడం లేదు. ఎన్ని సార్లు ఆ దేశం పీచమణిచినా మారడం లేదు. తినడానికి తిండికి దిక్కులేకపోయినా సరే, మనతో యుద్ధం కోరుకుంటూ పతనం అంచుల్లో వున్నా దాని బుద్ది మారడం లేదు. మన దేశంలో ఎన్ని కవ్వింపులు చేసినా క్షమిస్తూ పోతూనే వున్నాం. పైగా ఆ దేశంలో విపత్కర పరిస్ధితులు ఎదురైన ప్రతిసారి సాయం చేస్తూ ఆదుకుంటూనే వున్నాం. అయినా ఆ దేశానికి కృతజ్ఞతలేదు. ఎన్నొసార్లు భూకంపాలు వచ్చిన పాకిస్తాన్ అతలా కుతలమైపోయిన సందర్భాలలో ఆదుకుంటూ వచ్చాం. ఇప్పటికీ నిత్యం గోదుమ పిండి పంపకపోతే , తిండికి దిక్కులేకపోయినా, మన తిండి తింటూ మన దేశంపైనే ప్రతికారం కోరుకుంటుంది. అలాంటి దేశానికి ఇక బుద్ది చెప్పే తరుణం ఆసన్నమైంది. ఇక పాకిస్తాన్ను కోలుకోకుండా, తేరుకోకుండా చేస్తే తప్ప పాకిస్తాన్ దారికి వచ్చే పరిస్ధితి లేదు. దాయాది దేశమని సాయం చేసినా, ఎన్ని పాలు పోసినా పాము విషమే కక్కుతుందన్నట్లు తన పాపపు బుద్దిని పాకిస్తాన్ ప్రదర్శిస్తూనే వుంటుంది. అందుకే ఇక ఆట మొదలైంది. ఉగ్రవాదులు వేట మొదలైంది. తనకు దిక్కులేకపోయినా, ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ, మన దేశంలో అశాంతిని రేపుతామని చూస్తున్న పాకిస్తాన్ను ఇక వదిలిపెట్టకూడదన్న గట్టి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఆరేళ్ల క్రితం మన సైనికులు 60 మందిని పొట్టన పెట్టుకున్నా, సర్జికల్ స్ట్రైక్తో ఆపేశాం. కాని ఆసారి పెహల్గావ్లో ముష్కరులు హిందువులను టార్గెట్ చేసి చంపడం అన్నది ప్రపంచంలో ఏ దేశం సహించలేదు. మన 140 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగిపోయింది. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రేజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే, ముష్కర స్ధావరాలను కూకటి వేళ్లతో పెలికించి, ప్రపంచం ముందు మరోసారి భారత్ గొప్పదనాన్ని చాటుకున్నది. కాకపోతే పాకిస్తాన్ పాపాలకు ఎక్కడో అక్కడ పుల్ స్టాప్ పడాలి. పాకిస్తాన్ ఇక భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే కలలో కూడా అక్కడి పాలకులు ఉలిక్కి పడాలి. పాకిస్ధాన్కు మన దేశపు దెబ్బ అంత గట్టిగా పడాలనే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చింది. ఓ వైపు ప్రపంచంలో అభివృద్దిలో పోటీ పడాలని మనం ఆలోచిస్తుతంటే, ప్రతిసారి పాకిస్తాన్ కవ్వింపుల కోసం ఇక ఆలోచించే రోజు వుండకూడదు. అంటే పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో లేకుంటా చేస్తేనే దారి వస్తుంది. పాక్ ఆక్రమించుకున్న పిఓకే స్వాధీనంతోపాటు, పాక్ను అష్ట దిగ్భందనం చేస్తే తప్ప దానికి ఊరిరి ఆడదు. మన కేంద్ర ప్రభుత్వం అదే ఆలోచన చేస్తోంది. పాకిస్తాన్ కూసాలు కదిలిపోయేలా చేస్తోంది. భవిష్యత్తులో యుద్దం అన్న ఆలోచన వస్తేనే పాకిస్తాన్ గుండెలు అదిరిపోవాలి. అంతే కాదు మీరు తప్ప మాకు దిక్కులేదని కాళ్లబేరానికి రావాల్సిన అవసరం వుంది. అంత దూరం తీసుకుపోతే తప్ప పాకిస్తాన్ మాట వినదు. ఇప్పుడున్న పరిసి ్దతుల్లో పాకిస్తాన్పై కనికరం అన్నది చూపకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. హిందూస్తాన్ వైపు తొంగి చూసినా తునాతునకలైపోతామన్న భయం పాకిస్తాన్కు రుచి చూపించాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఆ అవకాశాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా జార విడువాలనుకోవడం లేదు. పాకిస్తాన్తో ఈ తలనొప్పి ఇక వుండదకూడదనే నిర్ణయానికి వచ్చింది. సరిహద్దును చూస్తే పాకిస్తాన్ ఇక జడుసుకోవాలి. ముష్కరులకు తావివ్వాలంటేనే పాకిస్తాన్కు తడిసిపోవాలి. అందుకే ఇక అసలు ఆట మొదలైంది. అంతం కాదిది..ఆరంభం. ఆపరేషన్ సింధూర్ సక్సెస్. 9 ఉగ్రవాద స్ధావరాలు మాటాష్. పలహాల్గావ్ దాడికి ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ తీర్చుకున్న ప్రతికారం. భారతీయుల్లో ఆనందం వెల్లిరిస్తోంది. ఇలాంటి మాట కోసం అమాయకులైన 25మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న నాటి నుంచి ఎదురుచూస్తున్నారు. ప్రతీకారంతో దేశ ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం ప్రతికారం తీర్చుకోకుంగా జాప్యం చేస్తుందని మధనపడినవ వారు కూడా వున్నారు. మన దేశ ప్రభుత్వ ఆలోచన, యుద్ద వ్యూహాలు అర్ధం చేసుకోలేక, బావోద్వేగాలతో ఎదురుచూసిన ప్రజలకు కూడా ఎంతో సంతోషాన్నిచ్చిన సందర్భమిది. దేశమంతా ఒక రకంగాచెప్పాలంటే పులకించిపోతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని, మన సైనికులను కీర్తిస్తోంది. దేశమంతా జేజేలు పలుకుతోంది. ఆపరేషన్ సింధూర్ అని పేరుపెట్టి మరీ ఉగ్ర స్ధావరాలను ధ్వంసం చేయడాన్ని దేశమంతా ఉద్వేగంతో సంబరాలు చేసుకుంటోంది. భారత్ మాతాకీ జై అని జై కొడుతోంది. జై హింద్ అంటూ దేశమంతా నినదిస్తోంది. దేశమంతా మన సైనికులు సలాం చేస్తోంది. జై హింద్ ట్విట్లతో దేశమంతా మారు మ్రోగిపోతోంది. పాకిస్ధాన్ ఆక్రమించుకున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే కాదు, ఏకంగా పాకిస్తాన్ గడ్డ మీదకు వెళ్లి మరీ ఉగ్ర స్ధావరాలను మన వైమానిక దళం ద్వంసం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా వున్న 26 ఉగ్ర స్ధావరాలను గుర్తించినట్లు సమాచారం. అందులో కీలకమైన 9 స్దావరాలను గుర్తించి ధ్వంసం చేశారు. పిఓకెలో వున్న 5 ఉగ్రవాద స్ధావరాలు, పాకిస్తాన్ గడ్డ మీద వున్న 4 స్ధావరాలను నామరూపాలు లేకుండా చేశారు. పాకిస్తాన్ గడ్డ మీద మన సైనికులు త్రివర్ణ పతాకం ఎగరవేడం గొప్ప శుభ పరిణామం. మన దేశమంతా సగర్వంగా సైనికులకు సలాం చేసింది. తీవ్ర వాద నాయకుడైన మసూద్ కుటుంబం మొత్తం చనిపోయింది. వారితోపాటు బంధువులు, ఇతర ఉగ్ర వాదులు మొత్తం 100 మందికిపైగా భారత్ జరిపిన వైమానికదాడిలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక మన కంటిలో నలుసులా, చెప్పులో రాయిలా తయారైన పాకిస్తాన్ కూడా మాయమయ్యే సమయం ఆసన్నమైంది. అయితే మన దేశం అనుసరిస్తున్న యుద్ద వ్యూహాలు అర్దం కాక ఇప్పటికే పాకిస్తాన్ తలలు పట్టుకుంటోంది. పాకిస్తాన్ విషయంలో ప్రపంచమంతా ఒకవైపు, పాకిస్తాన్ ఒక వైపు అనేలా యుద్ద తంత్రాన్ని నెరిపిన ఘనత మన ప్రదాని నరేంద్ర మోడీకే దక్కింది. గతంలో పాకిస్తాన్కాలు దువ్విన ప్రతి సందర్భంలోనూ ఏదోఒక దేశం మద్దతు ప్రకటిస్తూ వచ్చేవి. కాని ఈసారి 80 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్కు అగ్రరాజ్యాలేవీ పాకిస్తాన్కు మద్దతు పలకలేదు. ఒక రకంగాచెప్పాలంటే పాకిస్తాన్ ఏకాకి అయ్యింది. మన ప్రధాని నరేంద్ర మోడీ యుద్ద తంత్రాన్ని ఇప్పుడే మొదలు పెట్టారు. అయితే నిజానికి పహల్గావ్ దాడి మరుసటి రోజు నుంచే మన దేశం యుద్దతంత్రాన్ని మొదలు పెట్టింది. ముందు పాకిస్తాన్ను ఆర్ధికంగా కుదేలు చేసింది. ఆ దేశానికి ఎగుమతులు అన్నీ రద్దు చేసింది. తర్వాత వైమానిక దారులు మూసేసింది. పాకిస్తాన్కు సిందు నది నీళ్లను ఆపేసింది. దాంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైంది. ఇప్పటికే మూలిగే నక్కలాంటి పాకిస్తాన్ మీద మన ప్రభుత్వం కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ గిలగిలాడుతోంది. నిజానికి పాకిస్తాన్ ప్రజలు కూడా మన దేశంతో యుద్దం వద్దని ఆ దేశ సైనికులు కూడా పాకిస్తాన్ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. యుద్దం చేయడానికి ఇష్టపడక ఎంతో మంది పాకిస్తాన్ సైనికులు కూడా తమ ఉద్యోగాలు రాజీనామా చేశారన్న వార్తలు కూడా విన్నాం. అయినా పాకిస్తాన్కు బుద్ది రాలేదు. ఆ దేశ రాజకీయ నాయకులకు సోయి రావడం లేదు. ఇండియా మీద గెవడం అన్నది పాకిస్తాన్కు కలలో కూడా జరగనిది. యుద్దమంటే క్రికెట్ లాంటి ఆటలో గెలవడం కాదు. అయినా ఆటలో కూడా ఎప్పుడూ పాకిస్తాన్ పెద్దగా గెలిచింది లేదు. అలాంటిది యుద్దంలో పాకిస్తాన్ కనీసం చెప్పుకునే రణ తంత్రం లేదు. సైనిక సంపత్తి చాలదు. మన దేశ ప్రజలంతా ఒక్క సారి జై హింద్ అంటే ఆ సౌండ్కే పాకిస్తాన్ సగం గుండె ఆగిపోతుంది. అలాంటి పాకిస్తాన్ కొన్ని అగ్ర రాజ్యాల అండ చూసుకొని ఎగురుతూ వుండేది. కాని ఇప్పుడు ఏ దేశం పాకిస్తాన్కు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అంతే కాదు అఫ్గనిస్తాన్ తాలిబన్లు కూడా పాకిస్తాన్కు మద్దతు పలకలేదు. అయినా పాకిస్తాన్కు సిగ్గు రావడం లేదు. మన దేశ నుంచి విడిపోయిన ముక్కకే అంత వుంటే, ఆ ప్రాంతాన్ని దానం చేసిన మనకు ఎంత వుండాలి? మన సైనిక శక్తి కింద వారి సంఖ్య ఎంత? గతంలో ఊ అంటే అణ్వాయుదాలున్నాయంటూ పదే పదే పాకిస్తాన్ బెదిరిస్తూ వచ్చేది. అయినా మన దేశం ఎంతో సంయమనంతో వుండేది. మన మంచితనం పాకిస్తాన్కు చేతగాని తనంగా కనిపిస్తోంది. ఈసారి అసలు పాకిస్తాన్ అనేదే లేకుండా చేస్తే తప్ప దారికి రాదు. 1972 తర్వాత మళ్లీ మనదేశంలో సైనిక మాక్ డ్రిల్ జరిగిందంటే మన ప్రభుత్వం ఎంత స్ధిర నిర్ణయంతో వుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంతతను దెబ్బతీసేలా పక్కలో బల్లెంలా నిత్యం కొర్రీలు పెడుతుంటే ఇంకా చూసుకుంటూ ఊరుకునే పరిస్దితి లేదని మన ప్రభుత్వం హెచ్చరిక జారీచేసింది. ఓ వైపు పాక్ మన దేశ భూగాగాన్ని ఆక్రమించుకొని ఆ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు అడ్డగా చేసి పెట్టి మారణ హోమం సృష్టించాలని ఇప్పటి వరకు పాకిస్తాన్ చూసింది చాలు. ఇకపై మన దేశం ఉపేక్షించే పరిస్దితి లేదని ప్రదాని మోడీ తేల్చి చెప్పేశారు. ఆఖరుగా ఐక్య రాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్ ఈ విషయాన్ని లెవనెత్తి పై చేయి సాధించాలిన చూసింది. మన దేశం చెప్పిన సమాధానం విని పాకిస్తాన్ బిత్తర పోయింది. ప్రపంచ దేశాలతోపాటు, ఐక్య రాజ్య సమితికూడా మన దేశానికి మద్దతు పలికింది. పాకిస్తాన్ చేత కూడ ఉగ్ర వాదులను తుదముట్టించేందుకు సహకరిస్తామని చెపాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో తమ దేశంపై భారత్ దాడిచేయాలని చూస్తోందని చెప్పి సానుభూతి పొందాలని చూసింది. కాని మన ప్రభుత్వం మాత్రం మేం ఉగ్రవాదుల ఏరి వేత మాత్రమే చేస్తున్నామని చెప్పడంతో ఐక్యరాజ్య సమితిలో పాక్ పరువు పోయింది. లేనిపోనివి చెప్పి సానుభూతి పొందాలనుకున్నా చెల్లలేదు. అదే రోజు అర్ధరాత్రి అంటే 7తేదీన ఆలస్యం చేయకుండా 9 ఉగ్ర వాద స్ధావరాలను ధ్వసం చేసింది. పాకిస్తాన్లాగా దొంగ దెబ్బ మనం తీయలేదు. ప్రపంచానికి చెప్పి మరీ మన ప్రభుత్వం ఉగ్ర స్ధావరాలను టార్గెట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో 25 నిమిషాలలో పని పూర్తి చేసింది. అయితే ఇక్కడితో ఆగిపోయేది కాదు. మనదేశం ఆగేది కాదు. అందుకే హోం మంత్రి అమిత్షా కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ 2 వుంటుందని ప్రకటించారు. అంటే ఆట ఇప్పుడే మొదలైంది. ఇంకా ఇ ంకా వుందని అమిత్షా సంకేతాలిచ్చినట్లైంది. ఏ రకంగా చూసినా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకి. ఇక ప్రతి రాత్రి పాకిస్తాన్కు కాళరాత్రే..! జై భారత్. జై హింద్!!