
దివాంగులకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా , నేటిధాత్రి
బుదవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో
జిల్లా సంక్షేమ శాఖ, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
జిల్లా లోని అర్హులైన దివ్యాంగులు రెండు మోటారు వెహికల్స్ ను గ్రామం. కోడిసెలకుంట లోని బనోతు యాకూబ్, గ్రామం నర్సాపూర్ గుర్రం శ్రీహరి లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలసి పంపిణీ చేశారు .
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి టి.రవి,
సి.డి.పి.ఓ. శిరీష, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.