నూతన గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి..
హన్మకొండ, నేటిధాత్రి:
గ్రేటర్ వరంగల్ నగర పరిధి, మడికొండ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య (సి ఎన్ జీ) గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్ సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వర్దన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ (పశ్చిమ) శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, కార్పొరేటర్ లు సి.ఎన్.జీ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.