జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రఫీ నామినేషన్ దాఖలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపాలిటీ 14వ వార్డు నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా, జహీరాబాద్ ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రెటరీ, మహమ్మద్ రఫీ తన నామినేషనన్ను దాఖలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, గతంలోనూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేశానని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనను 14వ వార్డు కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డు మరియు మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని, 14వ వార్డు అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.తనను పతంగి గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు,యువకులు,కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు. పాల్గొన్న వారందరికీ మొహమ్మద్ రఫీ ధన్యవాదాలు తెలిపారు.
