ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
సిరిసిల్ల టౌన్ ( నేటి ధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని నిన్న భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన సందర్భంగా. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కార్యకర్తలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరియు గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఐటి మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలభిషేకం చేసిన కాంగ్రెస్ జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు . కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.