అర్ధరాత్రి అరెస్టులు దుర్మార్గమైన చర్య

# అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు.

నర్సంపేట,నేటిధాత్రి :

విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులు దుర్మార్గమైన చర్యలని ఎంసిపిఐ ( యు )నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు.గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో తమ పార్టీ విద్యార్థి సంఘం నాయకుడు జన్ను రమేష్ ను చెన్నారావుపేట పోలీసులు ఆకారణంగా అరెస్టు చేయడాన్ని ఎంసిపి ఐ ( యు ) తీవ్రంగా రాజమౌళి ఖండిస్తున్నట్లు తెలిపారు.అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కారణం లేకుండా అరెస్టు చేసి , నెక్కొండ పోలీస్ స్టేషన్ , చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ కు తిప్పుతూ ఇబ్బందుల గురి చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. నర్సంపేట మండలం మాదన్నపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం , నేడు ప్రజా ఉద్యమాలు చేస్తున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు.గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపినట్లుగానే , నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమాలను అణచివేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నదని అన్నారు. నిర్బంధ పాలన కొనసాగిస్తే రానున్న రోజుల్లో , ప్రజా ఉద్యమాలలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోవడం ఖాయమని అని అన్నారు .అక్రమంగాఅరెస్టు చేసిన ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్ ను , మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు .ఈ సమావేశంలో ఎంసిపిఐ ( యు ) జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం,పార్టీ నాయకులు కేశెట్టి శ్రీనివాస్ గుర్రం రవి ఆకుల రాజేందర్ , దండు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!