పేద ప్రజల వద్దకే… మెగా హెల్త్ క్యాంప్…
ఆరోగ్య సమస్యల కోసం సంపూర్ణ సురక్ష కేంద్రంను సంప్రదించాలి
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
కేసముద్రం మండలం దీన్ దయల్ నగర్ కాలనీ ఎస్ ఆర్ స్కూల్ దగ్గర జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని సంపూర్ణ సురక్ష కేంద్రం, ఆధ్వర్యంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందని సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ బి రమేష్ తెలియజేశారు. ఈ క్యాంపులో మొత్తం 138 అన్ని రకాల రక్త పరీక్షలు
షుగర్, బీపీ మరియు సాధారణ పరీక్షలు హెల్త్ క్యాంప్లో నిర్వహించడం జరిగిందని కాలనీ లోని ప్రజలు అందరు సధ్వినియోగ పరుచుకున్నారని తెలిపారు.
ఈ క్యాంపు కు ముఖ్య అతిధిగా జిల్లా హెచ్ ఐ వి /ఎయిడ్స్, టీబీ, లేప్రసీ కంట్రోల్ ప్రోగ్రాం ఆఫీస్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దాదాపు 148 మందిని ఒపీ చూడటం జరిగిందని తెలియజేసారు. గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల వద్దకే వచ్చి హెల్త్ క్యాంపు పరీక్షలు నిరహించటం మూలంగా వారి యొక్క స్థితి తెలుస్తుందని చెప్పారు. మీకు ఆరోగ్య పరమైన,మానసిక ఆరోగ్య పరమైన కౌన్సిలింగ్ మరియు సుఖ లైంగిక సమస్యల కోసం సంపూర్ణ సురక్ష కేంద్రం ను సంప్రదించాలని కోరారు సంపూర్ణ సురక్ష కేంద్రం యొక్క కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. శ్రవణ్ డాక్టర్, శ్రీకాంత్ , ఏ ఎన్ ఎం సుప్రజా , ఆశ వర్కర్ పూలమ్మ , ఎస్ ఎస్ కె ఓ ఆర్ డబ్ల్యు మానస, సర్వోదయ యూత్ ఆర్గనైజషన్ ఓ ఆర్ డబ్ల్యు రమదేవి సరోజ , చిట్టమ్మ, విజయ గ్రామప్రజలు పాల్గొన్నరు. మా గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం ద్వారా మాకు చాలా ఆనందంగా ఉందని ప్రజలు హార్షం వ్యక్తం చేసారు.