పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ, నేటిధాత్రి:

స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా 15 రోజుల పాటు పిల్లలు అతిసార వ్యాధికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని ఓ ఆర్ ఎస్ మరియు జింక్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలనిహనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు .ఈరోజు హనుమకొండ పట్టణ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీ కడిపికొండ కు సంబంధించిన వైద్యాధికారులు సూపర్వైజర్లతో కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా కేసులు రాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ ,ప్రజల్లో అవగాహన కలిగిస్తూ పాజిటివ్ వచ్చిన ఏరియాలో తగిన చర్యలు తీసుకోవాలని , ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించాలని డ్రైడే ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేయాలని అలాగే గ్రామాల్లో మరియు పాఠశాలల్లో వైద్య శిబిరములు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా చేతుల పరిశుభ్రత పై ,పరిసరాల పరిశుభ్రత వంటి అంశములపై అవగాహన కలిగించాలన్నారు. టీవీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపులలో పరీక్షలు ఎక్కువగా నిర్వహించడంతోపాటు టీవీకి చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని అలాగే వారికి పోషణకు సంబంధించిన అవగాహన ,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్,అడిషనల్ డి ఎం హెచ్ ఓ మరియు ఇన్చార్జి మలేరియా అధికారి డాక్టర్ టి మదన్ మోహన్ రావు ఆరోగ్య కేంద్రాల వారీగా మెడికల్ క్యాంపులు ,అలాగే పాజిటివ్ కేసులు (తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించగా, జిల్లా ఎమినైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్,మరియు రోట వైరస్ వ్యాక్సిన్ ల గురించి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు టీబీ ముక్తాభియాన్ అలాగే ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తదార్ అహ్మద్ఎన్సిడి, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల తగిన సూచనలు చేయడం జరిగింది.