తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం మండే పల్లి గ్రామంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు ఇట్టి శిబిరంలో గ్రామంలోని గౌడ సంఘం సభ్యులకు ఉచిత గుండె పరీక్షలు చేస్తూ వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో 150 మందికి బీపీ షుగర్ ఈసీజీ మొదలగు సూపర్ స్పెషాలిటీ వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ హర్షిత్ వైద్య పరీక్షలు నిర్వహించారు మిడి కవర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ గౌడ సంఘం సభ్యులకు స్థానిక ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడమేలక్ష్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించామని అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడమే లక్ష్యమని నిరంతర ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు గుర్రం బలరాం గౌడు పెద్ది లక్ష్మయ్య మార్కెట్ మేనేజర్ కోట కరుణాకర్ శ్రీకాంత్ లక్ష్మీ రాజం తదితరులు పాల్గొన్నారు
మెడికల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం…
