ప్రసూతి దావకాన మీద పట్టింపేది.

Hospital Hospital

ప్రసూతి దావకాన మీద పట్టింపేది

#చెట్ల తీగలతో ముసురుకున్న ఆసుపత్రి

#శిధిల వ్యవస్థకు దగ్గరగా వెల్నెస్ సెంటర్

#పాములకు పక్షులకు నివాసంగా!

#భయభ్రాంతులకు గురవుతున్న రోగులు

#కానరాని అధికారులు

హనుమకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

 

హనుమకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి లోని వెల్నెస్ సెంటర్ భవనం చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు పెరగడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం చెట్లతీగలతో ముసురుకుంది.

అసలు ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉందా లేదా అనే భావన కలుగుతుంది.

వెల్ నెస్ సెంటర్ కి రోజుకి కనీసం వందకు మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పత్రిక పాత్రికేయులు వస్తుంటారు అదేవిధంగా వెల్నెస్ సెంటర్ భవనం మొదటి అంతస్తుకి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు టీకాలు తీసుకోవడానికి వస్తుంటారు,వెల్నెస్ సెంటర్ భవనానికి చుట్టుపక్కల పిచ్చి చెట్లు పెరిగి తీగలు పారి మొదటి అంతస్తులోకి విస్తరించడంతో వాటి నుండి పాములు కీటకాలు వచ్చే అవకాశం ఉండడంతో రోగులు మరియు సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ కి రావాలి కానీ హాస్పిటల్ కి వస్తేనే సమస్య ఎదురయ్యేలా ఉంది ఇక్కడి పరిస్థితి ఇదిలా ఉంటే గర్భిణీలు ప్రసూతి కోసం చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల నుండి ఆసుపత్రి కి వస్తుంటారు, రోజుకు వందకు మందికి పైగా అవుట్ పేషెంట్స్ వస్తుంటారు వందకు మంది పైగా ఇన్ పేషెంట్స్ అడ్మిట్ అవుతారు, అందులో 30 నుండి 50 ప్రసవాలు జరుగుతాయి.

Hospital
Hospital

 

ఆసుపత్రిలో డాక్టర్లు మరియు సిబ్బంది తక్కువగా ఉండడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రభుత్య ఆసుపత్రి అంటేనే రోగులు జంకుతున్నారు మెరుగైన వైద్యం అందడం లేదనీ రోగుల బంధువులు అంటున్నారు,ఆసుపత్రిలో బెడ్స్ కూడా తక్కువగా ఉన్నాయని దీనికి తోడు ఆసుపత్రి గోడల చుట్టూ చెట్ల తీగలతోభయంకరమైన చెట్ల తీగలతో ఉండటంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నామని ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుకుంటున్నారు.

ఇదిలా ఈ సమస్యపై అధికారులకు సమాచారం అందించిన కూడా ప్రభుత్వ దావఖాన పట్టింతే లేకుండా పోయిందని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!